అబద్ధాల ప్రచారం.. అడ్డంగా దొరికిపోయి నవ్వుల పాలు!

Publish Date:Jun 15, 2022

Advertisement

అబద్ధాలు చెప్పడం.. ఆ తరువాత అడ్డంగా దొరికిపోవడం నవ్వులపాలు కావడం వైసీపీకి ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఎంతలా అంటే అసలు ఏమాత్రం అవసరం లేని విషయాలలో కూడా బొంకేయడం.. దొరికిపోయి నాలుక కరుచుకోవడం. ఏదైనా సరే నిజం నిప్పులాంటిది. అది బయటపడక తప్పదన్న విషయం  ఏ మాత్రం ఇంగితం ఉన్నవారికైనా ఇట్టే బోధపడే వాస్తవం. మరి ఘనత వహించిన వైసీపీ పెద్దలకు మాత్రం అది ఎందుకు ఎప్పటికీ తెలిసేలా లేదు. ఏ విషయం తీసుకున్నా అబద్ధమే వైసీపీ నోట ముందుకు వస్తుంది.

వైఎస్ వివేకా హత్య కేసు నుంచి నిన్నటి  మమతా బెనర్జీ సమావేశం వరకూ వైసీపీ చెప్పినవన్నీ అబద్ధాలే. వైఎస్ వివేకా గుండెపోటుతో మరణించాడంటూ తొలుత అవాస్తవాలు ప్రచారం చేశారు. గంటల వ్యవధిలోనే వైసీపీ అగ్రనేతల నోట వచ్చింది పచ్చి అబద్ధమనీ, ఆయన దారుణ హత్యకు గురయ్యారనీ తేలిపోయింది. ఆ వెంటనే వివేకా హత్య వెనుక ఉన్నది తెలుగుదేశం అధినేత, ఆయన కుమారుడు అంటూ మరో ప్రచారాన్ని తలెత్తుకున్నారు. ఇప్పుడు సీబీఐ దర్యాప్తులో వెలుగు చూస్తున్న నిజాలన్నీ ఆ హత్య వెనుక ఉన్నది వైసీపీ అగ్రనేతల వైపే వేళ్లు చూపుతున్నాయి. ఆ తరువాత ఇటీవల జరిగిన కోనసీమ అల్లర్ల విషయం తీసుకుంటే.. తెలుగుదేశం, జనసేనలపై విమర్శలు గుప్పించారు.

కానీ పోలీసుల అరెస్టు చేసిన వారంతా వైసీపీ కార్యకర్తలే. ఏకంగా మంతి నివాసం దగ్ధం అయినా, ఎమ్మెల్యే నివాసాన్ని ధ్వంసం చేసినా ఆ చేసిన వారంతా వైసీపీ వారేనని తేలిపోయినా.. ఆ పార్టీ అధినేత మాత్రం విపక్షాలేనని ఆరోపణలు గుప్పిస్తుంటారు. ఇక తాజాగా ఎందుకు దాచారో, ఎందుకు అలా చెప్పారో అర్థం కాదు. రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎంపిక కోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ ఢిల్లీలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ కు ఆహ్వానం అందలేదంటూ వైసీపీ ప్రచారం చేసుకుంది. అయితే హస్తినలో సమావేశం పూర్తయిన స్వల్ప వ్యవధిలోనే జగన్ ను మమత సమావేశానికి ఆహ్వానించారనీ, జగన్ ఆ సమావేశానికి డుమ్మా కొట్టారనీ తేలిపోయింది.

సమావేశం జరుగుతున్న సమయంలో హస్తినలోనే ఉన్న విజయసాయి రెడ్డిని మీడియా ప్రశ్నించిన సందర్భంలో తమకు అసలు ఆహ్వానమే అందలేదని ఆయన విస్పష్టంగా చెప్పారు. ఆయన అలా చెప్పిన కొద్ది సేపటికే మమతా బెనర్జీ వైసీపీ సీఎం జగనను ఆహ్వానించారనీ తేలిపోయింది. మమత జగన్ కు పంపిన లేఖ బయటకు వచ్చింది. ఆహ్వానం అందినా అందలేదన్న అబద్ధం వైసీపీ నేతలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందన్నది రాజకీయ పరిశీలకులకు కూడా అంతుబట్టడం లేదు. మొత్తం ఎనిమిది మంది ముఖ్యమంత్రులకు మమతా బెనర్జీ ఆహ్వానం పంపితే.. వారిలో ఒక్కరు కూడా మమత నిర్వహించిన సమావేశానికి హాజరు కాలేదు. కానీ వారెవరూ కూడా జగన్ లా అసలు ఆహ్వానమే అందలేదని అవాస్తవాలు చెప్పలేదు.

 మమతా బెనర్జీ ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా అందరికీ పంపినట్లే జగన్ కూ లేఖ పంపారు. అందరికీ ఫోన్ చేసి ఆహ్వానించినట్లే జగన్ కూ ఫోన్ చేశారు. అయితే జగన్ మాత్రం మిగిలిన వారికి భిన్నంగా అసలు ఆహ్వానమే అందలేదంటూ పచ్చి అబద్ధాలు చెప్పారు. వైసీపీ అధినేత జగన్ రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారు. ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహం లేదు. అయితే విపక్షాల నుంచి ఆహ్వానం అందిందంటేనే మోడీగారు గుస్సా అవుతారని జగన్ భయపడుతున్నారా అందుకే ఆహ్వానం అందినా లేదని అబద్ధాన్ని ప్రచారం చేశారా అన్న అనుమానాలు అందరిలో వ్యక్తమౌతున్నాయి. మోడీ సర్కార్ కు ఇంతగా భయపడుతూ.. విపక్షం నుంచి ఆహ్వానం అందితేనే కేంద్రం పెద్దలకు కోపం వస్తుందని వణికిపోయే జగన్ ఇక కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం తీసుకురాగలరని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా అవసరం ఉన్నా లేకున్నా అబద్ధాలు ప్రచారం చేయడం తీరా అవి బయటపడి పరువు పోగొట్టుకోవడం వైసీపీకి ఒక అలవాటుగా మారిపోయింది. ఈ విషయాన్ని పార్టీ వర్గాలే అంగీకరిస్తున్న పరిస్థితి. 

By
en-us Political News

  
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.