Publish Date:Jun 15, 2022
రాష్ట్రపతి ఎన్నిక విషయంలో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం చేయబోతున్నారన్న సంగతి తెలుగువన్ ముందే అంచనా వేసింది. రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిపై చర్చించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సమావేశానికి కేసీఆర్ డుమ్మా కొడతారన్న విషయాన్ని తెలుగువన్ ముందుగానే చెప్పింది. తొలుత కేసీఆర్ ప్రతినిథిగా పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కే.కేను పంపుతారన్న చర్చ జరిగినా చివరికి అది కూడా జరగలేదు. మొత్తంగా టీఆర్ఎస్ ఈ సమావేశానికి డుమ్మా కొట్టింది.
బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యతకు కేసీఆర్ చేసిన ప్రయత్నాలకు జాతీయ స్థాయిలో ఏ పార్టీ నుంచీ సానుకూలత వ్యక్తం కాకపోవడంతో ఆయన ఏం నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ముందుగానే వెల్లడించిన తెలుగువన్ మమతా బెనర్జీ ఆహ్వానాన్ని కేసీఆర్ మన్నించే అవకాశాలేలేవని కుండబద్దలు కొట్టేసింది. తెలుగువన్ ముందుగా చెప్పినట్లుగానే కేసీఆర్ మమతా బెనర్జీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సమావేశానికి గైర్హాజరయ్యారు. కాగా మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరిగిన భేటీ అనుకున్నంతగా సక్సెస్ కాలేదనే చెప్పాలి.
భేటీకి మమతా బెనర్జీ 22 మంది జాతీయ స్థాయి నేతలకు ఆహ్వానం పంపితే వచ్చిన వారు మాత్రం తక్కువ మందే. ఈ భేటీ కోసం మమతా బెనర్జీ ఆహ్వానం పంపిన నేతలలో ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. అయితే వారిలో ఒక్కరు కూడా ఈ భేటీకి హాజరు కాలేదు. కాంగ్రెస్ తరఫున మల్లిఖార్జున్ ఖర్గే, జైరాం రమేశ్, రణదీప్ సింగ్ సూర్జేవాలా హాజరు కాగా, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్, ఎస్పీ అధినేత యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, ఈ భేటీకి హాజరయ్యారు.
విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా శరద్ యాదవ్ పేరును మమతా బెనర్జీ ఈ సమావేశంలో ప్రకటించినప్పటికీ తాను పోటీకి సిద్ధంగా లేనంటూ శరద్ పవార్ స్పష్టం చేయడంతో మరో అభ్యర్థిని ఖరారు చేసేందుకు మరోమారు భేటీ కావాలని సమావేశం నిర్ణయించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-did-not-attend-mamatas-meeting-telugu-one-said-it-earlier-25-137733.html
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.