దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అంటే అభిమానం.. ఆయన తనయుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అంటే ఇంకాస్తా అభిమానం. ఆ అభిమానమే.. సొమిశెట్టి సుబ్బారావు గుప్తాను కొలుకోలేని దెబ్బ తీసిందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పార్టీ బాగుంటే.. తామంతా బాగుంటామనే ఓ చిన్న ఆశ... ఆ క్రమంలోనే జగన్ పార్టీ బాగు కోసం నాలుగు మంచి మాటలు చెప్పడమే తప్పు అయిందనే భావనలో సుబ్బారావు గుప్తా కురుకుపోయారని వారు పేర్కొంటున్నారు. ఆ క్రమంలో గుప్తా ఆత్మాభిమానం బాగా దెబ్బతిందని వారు చెబుతున్నారు.
తాజాగా స్వర్గీయ వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాతో సుబ్బారావు గుప్తా భేటీ కావాడం... ఈ సందర్భంగా వారిరువురి మధ్య పలు అంశాలు చర్చకు రావడం... ఆ క్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకల సందర్బంగా తాను మాట్లాడిన అంశాలు.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను సైతం వంగవీటి రాధకు సుబ్బారావు గుప్తా ఈ సందర్బంగా వివరించినట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత సుబ్బారావు గుప్తా ఆధ్వర్యంలో విజయవాడలో ఆర్య వైశ్య ఐక్యత సభ నిర్వహించారని.. ఈ సభకు రాష్ట్రంలోని వివిధ పార్టీలకు చెందిన ఆర్య వైశ్య నేతలంతా హాజరయ్యారని సమాచారం. ఈ సందర్భంగా సుబ్బారావు గుప్తా.. చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఒంగోలులో చోట రాజన్, డీ గ్యాంగులు దిగాయని... పద్దతి మార్చుకోవాలంటూ సదరు పార్టీ నేతలకు ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారని... అలాగే తనకు ముఖ్యమంత్రి వైయస జగన్ అపాయింట్మెంట్ ఇచ్చారని.. కానీ తనపై దాడి చేసిన వారిని శిక్షించకుండా.. వారితో తనకు క్షమాపణలు చెప్పించకుండా ముఖ్యమంత్రి వైయస్ జగన్ను తాను కలిసేదే లేదని సుబ్బారావు గుప్తా పేర్కొన్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా తనపై రాజకీయ, భౌతిక దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఈ సందర్భంగా సుబ్బారావు గుప్తా ప్రకటించారని.. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం నుంచి ప్రారంభించాలని ఆయన నిర్ణయించినట్లు సమాచారం. తనపై దాడి చేసిన వారిని.. పోలీసులు అరెస్ట్ పేరుతో రాచమర్యాదలు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చారంటూ తన సన్నిహితుల వద్ద సుబ్బారావు గుప్తా వాపోయినట్లు సమాచారం. అలాగే అర్థరాత్రి తన నివాసంపై దాడి చేసిన వారిని ఇంత వరకు అరెస్ట్ చేయలేదని... ఈ నేపథ్యంలో తాను చేపట్టనున్న కార్యక్రమాల్లో ఈ అంశాలన్నీ ప్రస్తావించనున్నట్లు సుబ్బారావు గుప్తా వెల్లడించారని తెలుస్తోంది.
అయితే సుబ్బారావు గుప్తాకు ఇప్పటికే ఆర్య వైశ్య సంఘాల నేతల మద్దతు లభించిందని.. అందుకే ఆయన ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏదీ ఏమైనా సుబ్బారావు గుప్తాపై దాడి అంశం.. అధికార జగన్ పార్టీకీ ముఖ్యంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పొలిటికల్గా పెద్ద దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-leader-subbarao-gupta-meet-vangaveeti-radha-39-129710.html
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్స్టార్ రజనీకాంత్తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఈ వివాదం కాస్తా ముదరడంతో తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగానైనా బరిలోకి దిగుతుందని, అవసరమైతే ఏ పోరాటానికైనా తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. తెలంగాణ సెంటిమెంట్ను టచ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో.. పవన్ కళ్యాణ్ ఈ సవాల్ను స్వీకరించడం సంచలనం సృష్టించింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కేవలం 80 స్థానాలకే పరిమితమైన టీఎంసీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అసమ్మతి గళాలు రోడ్డెక్కాయి. పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మెజారిటీ టీఎంసీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. గడిచిన 15 ఏళ్లుగా బెంగాల్ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన దీదీ, ఇప్పుడు సొంత పార్టీపై పట్టు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు.
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది.
రాష్ట్రంలో ఎన్నికల అనంతర పరిణామాలు, జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి.
ఆయనను బీజేపీ హైకమాండ్ ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. అప్పటి నుంచీ పార్టీ హైకమాండ్ పై అసంతృప్తితో ఉన్న అన్నామలై సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఉన్నారంటూ, గత కొంత కాలంగా వార్తలు వినవస్తున్నాయి.
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బెంగళూరు నగరాభివృద్ధి శాఖ తనకు కేటాయించకపోవడమే ఆయన అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. మీడియా ఎదుటే ఆయన తన రాజీనామా లేఖపై సంతకం చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.