రాచమల్లుకు ఎదురుగాలి.. ప్రొద్దుటూరులో తెలుగుదేశందే పై చేయి!

Publish Date:May 3, 2024

Advertisement

కడప పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం. ఆ జిల్లాపై ఆ కుటుంబం ఆధిపత్యం. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ కుటుంబం నిట్టనిలువుగా చీలిపోయింది.  ఆ ప్రభావం జిల్లాలో ఆ కుటుంబం ఆధిపత్యంపై కూడా పడింది. వైఎస్ మరణం తరువాత కడప జిల్లా మొత్తం కాంగ్రెస్ ను వీడి  జగన్ కు మద్దతుగా నిలిచింది. 2014 ఎన్నికలలో జగన్ పార్టీ పరాజయం పాలైనా కడప జిల్లా మాత్రం ఆయనకూ, ఆయన పార్టీకే జై కొట్టింది. అయితే 2019 ఎన్నికలలో జగన్ విజయం సాధించి ముఖ్యమంత్రి అయిన తరువాత పరిస్థితులు వేగంగా మారిపోయాయి. ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ జగన్ పునాదులు కదులుతున్న పరిస్థితి గోచరిస్తోంది. ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని ఆ పార్టీ వర్గాలే బాహాటంగా చెబుతున్నాయి. 

ఆ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా ఎనిమిది పదుల వయస్సున్న వరదరాజులు రెడ్డి పోటీలో ఉన్నారు. చంద్రబాబు ప్రొద్దుటూరు నియోజకవర్గ అభ్యర్థిగా వరదరాజులు రెడ్డిని ఎంపిక చేయడంపై అందరూ విస్మయం వ్యక్తం చేశారు. ఆయితే ఆయన తనక ఇవే చివరి ఎన్నికలు అంటూ చేస్తున్న ప్రచారం ప్రజలలో సానుకూలతకు కారణమైంది. అన్నిటికీ మించి ప్రొద్దుటూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆయన సమీప బంధువు బంగారురెడ్డిల అరాచకాలు, దౌర్జన్యాలతో విసిగిపోయిన స్థానికులు, వ్యాపారులు వరదరాజులురెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారు. అలాగే నియోజకవర్గంలో తెలుగుదేశం బలం, వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతా అన్నీ కలిసి వచ్చాయని చెప్పవచ్చు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో రాచమల్లు అరాచకత్వం అన్ని వర్గాల ప్రజలలో ఆయన పట్ల అసహనానికీ, అసంతృప్తికీ కారణమైంది. దీంతో  ప్రొద్దుటూరులో తెలుగుదేశం వైపు మొగ్గు కనిపిస్తోంది. 

ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేతలూ, క్యాడర్ తో సమన్వయం కరవైంది. ఆయన పూర్తిగా ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు తనకే ఓటు వేస్తారన్న భావనలో ఉన్నారు. అన్నిటికీ మించి వైఎస్ షర్మిలపై రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రజలలో మరీ ముఖ్యంగా మహిళల్లో ఆయన పట్ల వ్యతిరేకతకు కారణమయ్యాయి. వీటన్నిటికీ అదనంగా నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న మైనారిటీలు కాంగ్రెస్ వైపు చూస్తుండటం రాచమల్లు విజయావకాశాలను దారుణంగా దెబ్బతీసిందని పరిశీలకులు అంటున్నారు. మొత్తంగా ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ షర్మిల ప్రభావం వైసీపీకి ప్రతికూలంగా మారిందంటున్నారు. ప్రొద్దుటూరు పరిస్థితి కడప జిల్లాలో మారిన రాజకీయ ముఖచిత్రానికి అద్దంపడుతోందని చెబుతున్నారు. ప్రచారం నుంచి ప్రజా స్పందన వరకూ  తెలుగుదేశం కూటమికి సానుకూలత కనిపిస్తోందని చెబుతున్నారు. దీంతో ప్రొద్దుటూరులో రాచమల్లుకు ఎదురీత తప్పదని విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-17
ఆంధ్రప్రదేశ్ లో ఒక విచిత్ర పరిస్థితి నెలకొని ఉంది. రాష్ట్రంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్నారు. అంటే రాష్ట్రంలో అల్లర్లు శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత వాటిని అరికట్టి సాధారణ స్థితి పునరుద్ధరించేలా అధికారులకు దిశానిర్దేశం చేయడం. అయితే ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించేశారు.
న్నికలలో విజయం సాధించడం కోసం అనుసరిస్తున్న విధానాలు, మాట్లాడుతున్న మాటలే కొంత కాదు.. చాలా బాధను కలిగిస్తున్నాయి. 
పల్నాడు జిల్లాలో పోలింగ్ సందర్భంగా, ఆ తర్వాత అల్లర్లు జరిగిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ను, తిరుపతి ఎస్పీని ఎన్నికల సంఘం బదిలీ చేసింది.
సర్వేలు, ఫలితాలు కాదు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పేశారు. ఏపీలో రాబోయే ప్రభుత్వం ఏదో. ఆయన అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం సాధిస్తుంది.
పాపం ఈయనేమో జగన్ పేరు చెబితే ఆనందంతో గుడ్డలు చించుకుంటూ వుంటాడు. వాళ్ళేమో ఈయన్ని కూరలో కరేపాకుని తీసేసినట్టుగా తీసి అవతల పారేస్తూ వుంటారు. కేసీఆర్‌కి ఇలాగే అవ్వాలిలే!!
పల్నాడులో ఎన్నికల హింస పోలింగ్ ముగిసిపోయినా కొనసాగుతోంది. గత ఐదు రోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. 2019 ఎన్నికలలో పల్నాడులో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. నరసరావు పార్లమెంటు స్థానంతో పాటు మాచర్ల, వినుకొండ, పెదకూరపాడు, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, చిలకలూరి పేట అసెంబ్లీ స్థానాలలో విజయం కేతనం ఎగురవేసింది.
 బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోందని, విశాఖపట్టణానికి ఆగ్నేయంగా 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.
సిట్ చీఫ్‌గా నియమితులైన వినీత్ బ్రిజ్‌లాల్‌ని అర్జెంటుగా తప్పించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఎందుకయ్యా అంటే, ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం ఎవరిదో పెళ్ళి జరిగితే, దానికి వినీత్ బ్రిజ్‌లాల్, చంద్రబాబు హాజరయ్యారట.
రెండు మూడు రోజుల కిందట జనసేనాని పవన్ కల్యాణ్ సోదరుడు, ఆ పార్టీ సీనియర్ నాయకుడు నాగబాబు చేసిన ఓ ట్వీట్ సంచలనం సృష్టించింది. అక్కడితో ఆగకుండా ఆ ట్వీట్ నాగబాబు, అల్లు అర్జున్ అభిమానుల మధ్య అగాధాన్ని సృష్టించింది. ఆ ట్వీట్ చూసిన వెంటనే అంతా అల్లు అర్జున్ టార్గెట్ గానే నాగబాబు ఆ ట్వీట్ చేశారని భావించారు.
ఎందుకైనా మంచిదనే ధోరణితో తాడేపల్లి ప్యాలెస్‌ని మెల్లగా వదిలించుకుంటే మంచిదనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ జగనన్నకి పనేమీ లేదు.. అలాంటప్పుడు ఇక్కడ ఈ ఆస్తి ఎందుకనే ఆలోచనలో కూడా వున్నట్టు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ లో హై ఓల్టేజ్ ప్రచారం ముగిసి పోలింగ్ పూర్తయిన తరువాత కూడా హింసాకాండ కొనసాగుతోంది. అయితే ప్రధాన పార్టీల నేతలు మాత్రం పొలింగ్ పూర్తయిన తరువాత ఒక విధమైన విశ్రాంతి మూడ్ లోకి వెళ్లిపోయారు. పోలింగ్ ముగిసిన రోజు, ఆ తరువాత ఒకటి రెండు ప్రెస్ మీట్లు మినహా పెద్దగా మీడియా ముందుకు కానీ, ప్రజల ముందుకు కానీ రాలేదు.
టీఎస్ ఎప్‌సెట్ -2024 ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. విద్యాశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి బుర్రా వెంక‌టేశం, ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ఆర్ లింబాద్రి క‌లిసి ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. అగ్రికల్చ‌ర్, ఫార్మ‌సీ స్ట్రీమ్‌లో 89.66 శాతం ఉత్తీర్ణ‌త న‌మోద‌యింది. ఇందులో అమ్మాయిలు 90.18 శాతం, అబ్బాయిలు 88.25 శాతం ఉత్తీర్ణ‌త సాధించడం జ‌రిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.