తల తిరుగుతోందా హరీష్‌రావ్?

Publish Date:May 3, 2024

Advertisement

తెలంగాణలో బిఆర్ఎస్ చచ్చిపోయింది. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత  బిఆర్ఎస్ అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రస్తుతం బిఆర్ఎస్ శవయాత్ర జరుగుతోంది. ఆ శవాన్ని మోస్తున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తదితర నాయకులు శ్మశానం ముందు శవాన్ని కిందకి దించి దింపుడు కళ్ళం ఆశలతో నోటికి ఏది తోస్తే అది మాట్లాడుతున్నారు. అలాంటి దింపుడు కళ్ళం ఆశలతో అగ్గిపెట్టె మచ్చా హరీష్ రావు శుక్రవారం ఒక మాట మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం గడువు ముగిసినా హైదరాబాద్‌ని ఏపీ, తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా పొడిగించాలని చూస్తున్నారట, దీనికోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారట. చంద్రబాబు ఆటలు సాగకూడదంటే లోక్‌సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ శవానికి ఊపిరి పోయాలట. ఇదీ హరీష్ రావు వెర్షన్.. తెలంగాణ ప్రజలు చాచిపెట్టి కొట్టినా ఈ బిఆర్ఎస్ నాయకులకు బుద్ధి రాలేదు. ఈ దిక్కుమాలిన పార్టీ ఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య విభేదాలు రేపి అధికారంలోకి రావాలని మొన్నటి ఎన్నికల సందర్భంగా కూడా ప్రయత్నించింది. అయితే ప్రజలు మాత్రం వీరి ఆటలు సాగనివ్వలేదు. అసలు ఆంధ్ర ప్రజలు మరోసారి హైదరాబాద్‌ని రాజధానిగా కోరుకోవడం లేదు. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేసుకోవాలని బలంగా కోరుకుంటున్నారు. చంద్రబాబు అయితే పదేళ్ళు అవకాశం వున్నా, అధికారంలోకి వచ్చిన సంవత్సరానికే హైదరాబాద్‌ని వదిలిపెట్టేసి అమరావతికి వెళ్ళిపోయారు. అలాంటి చంద్రబాబు హైదరాబాద్‌ని మరో్సారి ఆంధ్ర రాజధాని చేయాలని చూస్తున్నారని అనడానికి నోరెలా వచ్చిందయ్యా.

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరోసారి ఆంధ్ర బూచిని, చంద్రబాబును చూపించి లాభం పొందాలని బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే హరీష్ రావు తల తిరిగినట్టు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు ఆంధ్రలో ఆయన బాధలేవో ఆయన పడుతున్నారుగా.. మొన్న ముగిసిన అసెంబ్లీ ఎన్నికలలోగానీ, ఇప్పటి పార్లమెంట్ ఎన్నికలలోగానీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయడం లేదు కదా.. మరి ఇంకా ఎందుకు చంద్రబాబు మీద పడి వీళ్ళు ఏడుస్తున్నారో! ఇక బిఆర్ఎస్ పార్టీ బతికి బట్టకట్టే అవకాశాలు లేవు కాబట్టి, మరోసారి ఆంధ్ర, తెలంగాణ అంటూ రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఈ పింక్ పిశాచాల పని అయిపోయింది. వీళ్ళ అవాకులు, చెవాకులు తెలంగాణ ప్రజలు పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకుంటే మంచింది.

By
en-us Political News

  
మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వర్గీయులు మరోమారు మారణహోమానికి పాల్పడ్డారు. ఓ మహిళపై పాశవికంగా దాడి చేశారు.
పసిఫిక్ దేశం పపువా న్యూ గినియాలోని ఎన్గా ప్రావిన్స్‌.లో కొండ చరియలు విరిగిపడి 670 మంది మరణించారు
బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను, తీవ్ర తుఫానుగా మారి బీభత్సం సృష్టించనుంది. ఈ తుఫాను బంగ్లాదేశ్ కేపుపారా కూ దక్షిణంగా 330 కిలోమీటర్ల దూరంలో, పశ్చిమ బెంగాల్ సాగర్ ఐలాండ్స్క 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న రెమాల్ ఉత్తర దిశగా కదులుతూ మరింత బలపడుతున్నది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవుల కారణంగా దేశం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల వేంకటేశ్వరుని దర్శనం కోసం తండోపతండాలుగా తరలివస్తున్నారు
రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు ఆదర్శంగా నిలవాల్సిన‌ ఏపీ సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డి భూబ‌కాసురుడిలా మారారా? విశాఖలో దళితుల అసైన్డ్ భూములను జవహర్ రెడ్డి కుమారుడు అప్ప‌నంగా మింగేయాలని ప్రయత్నించాడా? 2వేల కోట్ల రూపాయల భూముల‌ను కాజేసేందుకు స్కెచ్ వేశారా? అంటే అవున‌నే స‌మాధానమే వినిపిస్తోంది. జ‌వ‌హ‌ర్ రెడ్డి మ‌రో నెల‌రోజుల్లో సీఎస్ ప‌ద‌వి నుంచి రిటైర్డ్ కానున్నారు.. ఈ క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌హాయ‌ స‌హ‌కారాల‌తో జ‌వ‌హ‌ర్ రెడ్డి కుమారుడు, ప‌లువురు వైసీపీ ముఖ్య‌నేత‌లు అసైన్డ్ భుముల‌ను కాజేసే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. రాజ్‌కోట్‌లో వున్న టి.ఆర్.పి. గేమ్ జోన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో 35 మంది ప్రాణాలు కోల్పోయారు.
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-10
వీళ్ళంతా కవిత విషయంలో చాలా రిలాక్స్.గా వున్నారు. కానీ, ఒక్క మనిషి మాత్రం కవిత అరెస్టు అయినప్పటి నుంచి కుమిలిపోతూ వున్నారు. ఆమె ఎవరో కాదు.. కవిత మాతృమూర్తి శోభ!
సార్వత్రిక ఎన్నికలలో భాగంగా శనివారం (మే 25) జరిగిన ఆరో విడత పోలింగ్ లో కాంగ్రెస్ అగ్రనేతలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అయినా ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు అపరిష్కృతంగానే ఉన్నాయి. ఆందోళ‌న‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే ప‌దేళ్ల త‌ర్వాత విభ‌జ‌న చ‌ట్టంలోని ప‌లు అంశాల‌కు కాలం చెల్లుతుంది. అయిదే ఏపీ నేత‌లు త‌మ‌కేమీ ప‌ట్ట‌న‌ట్లు త‌డిబ‌ట్ట వేసుకొని నిద్దుర‌పోతున్నారు.
ఈ సారి సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత కేంద్రంలో ఎన్డీయే కూటమి కొలువుదీరినా ప్రధానిగా మోడీకి గతంలో ఉన్నంత సీన్ ఉండదా? అంటే ఆర్ఎస్ఎస్ వర్గాల నుంచి ఔనన్న మాటే వినిపిస్తోంది. గత ఎన్నికలలో బీజేపీ సొంతంగా గెలుచుకున్న సీట్ల కంటే ఈ సారి ఏ మాత్రం తగ్గినా మోడీ రీప్లేస్ మెంట్ విషయంలో బీజేపీలో, బీజేపీ పొలిటికల్ మెంటార్ అయిన ఆర్ఎస్ఎస్ లో విస్తృత చర్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
వైసీపీ నాయకురాలు రోజా ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలోకి జంప్ అవబోతున్నారు. జగన్ చెవిలో రోజాపువ్వు పెట్టి, తాను చంద్రముఖి-3లా మారి లక లక లక అనబోతున్నారు.
రాజకీయ నాయకులు అధికారం తలకెక్కి ప్రజలను విస్మరిస్తే.. ఎంతటి నాయకుడికైనా పరాభవం తప్పదు. ప్రతిష్ట మసకబారక తప్పదు. అధకారంలో ఉండగా తనను తాను కారణజన్ముడిగా మిలినిన మనుషులంతా మామూలు జీవులేనన్న భావన తలకెక్కి వారిని చులకనగా చూస్తే.. జనం తగిన బుద్ధి చెబుతారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.