Publish Date:Apr 25, 2022
యాదాద్రి పేరు మళ్లీ యాదగిరి గుట్టగా మారిందా? అలా కేసీఆరే మార్చేశారా? మళ్లీ పాత పేరుతోనే పిలవనున్నారా? చినజీయర్ స్వామి పెట్టినందుకే యాదాద్రి పేరు వినిపించకుండా చేస్తున్నారా? యాదాద్రి మాదిరే త్వరలో భద్రాద్రి పేరు కూడా మార్చేస్తారా? అంటే అవుననే అంటున్నారు.
అఫీషియల్గా యాదాద్రి పేరు మార్చినట్టు ఇంకా ప్రకటన రాకపోయినా.. తాజాగా సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించిన అధికారిక సమాచారంలో యాదగిరి గుట్టు అంటూనే వివరాలు రిలీజ్ చేశారు. ప్రెస్నోట్లో సైతం యాదగిరి గుట్ట అనే ఉండటం ఆసక్తికరంగా మారింది. యాదాద్రి పేరును మళ్లీ యాదగిరి గుట్టగా మార్చేయనున్నారని తెలుస్తోంది. అందుకే, ఇన్నాళ్లుగా లేనిది.. ఇప్పుడు కొత్తగా యాదగిరి గుట్ట పేరుతో ముఖ్యమంత్రి పర్యటన సమాచారం ఇవ్వడంపై చర్చ జరుగుతోంది.
యాదాద్రి పేరును మళ్లీ యాదగిరి గుట్టగా మార్చడానికి చినజీయర్ కేసీఆర్ మధ్య విభేదాలే కారణమని అంటున్నారు. దశాబ్దాలుగా ఆ ప్రాంతానికి యాదగిరి గుట్ట అనే పేరు. తెలంగాణ వాసులంతా అలానే పిలుస్తారు. యాదాద్రి అనే పేరు ఇంకా అలవాటు కూడా కాలేదు. చినజీయర్ చెప్పారనే ఏళ్లుగా ఉన్న యాదగిరి గుట్టకు యాదాద్రి అని పేరు పెట్టారు. అలాగే భద్రాచలంను కూడా భద్రాద్రి అని నామకరణం చేసింది కూడా చినజీయరే. ఇన్నాళ్లూ ఆయనతో సీఎం కేసీఆర్ సఖ్యతగా ఉండటంతో కొత్త పేర్లు ఫిక్స్ అయ్యాయి. కానీ, ఇటీవల జీయర్ స్వామిని కేసీఆర్ పక్కనపెట్టేశారు. సమతామూర్తి విగ్రహ సమారోహనం ఎపిసోడ్లో కేసీఆర్ ఇగో హర్ట్ అయింది. అప్పటినుంచీ చినజీయర్ను హర్ట్ చేస్తున్నారు. ఆయన లేకుండానే యాదాద్రి ఆలయ పునరుజ్జీవ కార్యక్రమం జరిగిపోయింది. ఇప్పుడు చినజీయర్ పెట్టిన యాదాద్రి పేరును కూడా మార్చేసి.. మళ్లీ పాత పేరైన యాదగిరి గుట్టగానే ఉంచేయాలని భావిస్తున్నారు. స్థానికులు సైతం యాదాద్రి అంటే అదోలా ఉంది.. యాదగిరి గుట్ట అంటేనే మంచిగుంది అంటున్నారు. ఇక, చినజీయర్ పెట్టిన భద్రాద్రి పేరును కూడా మళ్లీ భద్రాచలం ఆలయంగా మార్చేసే ఆస్కారం ఉందంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/yadadri-as-yadagiri-gutta-39-134957.html
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.