మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం.. రేవంత్ రెడ్డి శ‌పథం.. బీఆర్ఎస్ కింకర్తవ్యం!

Publish Date:Nov 8, 2024

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అధికారపగ్గాలు చేపట్టిన నాటి నుంచి ప్రతిపక్ష బీఆర్ఎస్ పై దూకుడుగానే ముందుకెళ్తున్నారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో అధికార బీఆర్ఎస్ పార్టీపై విమ‌ర్శ‌ల దాడి చేసిన రేవంత్‌.. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కూడా అదే ఫార్ములాను అమ‌లు చేస్తున్నారు. త‌ద్వారా రేవంత్ దూకుడుతో  బీఆర్ఎస్ తేలిపోతున్న ప‌రిస్థితి. తెలంగాణ రాజ‌కీయాల్లో ప‌దేళ్లుగా పెద్ద‌దిక్కుగా ఉంటూ వ‌చ్చిన మాజీ సీఎం కేసీఆర్‌ అధికారం కోల్పోయిన త‌రువాత కేవ‌లం త‌న ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. ఒక ప‌క్క అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు కేటీఆర్ ఆధ్వ‌ర్యంలో బీఆర్ఎస్ నేత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.. కేసీఆర్  మాత్రం నోరు మెద‌ప‌డం లేదు. దీంతో అధికార కాంగ్రెస్ ను ఎదుర్కోవ‌టంలో బీఆర్ఎస్ ఆశించిన స్థాయిలో స‌ఫ‌లం కావ‌డం లేదు.

దీనికి తోడు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న నేత‌ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్ర‌త్యామ్నాయం మేమే అని చెప్పుకుంటున్న బీజేపీ నేత‌లు సైతం ప్ర‌జాస‌మ‌స్య‌లపై గ‌ళ‌మెత్త‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నారు.  బీజేపీలో ఒక‌రిద్ద‌రు నేత‌లు మిన‌హా మిగిలిన నేత‌లు రేవంత్ స‌ర్కార్ వైఫ‌ల్యాల‌ను ఎత్తిచూపేందుకు అసలు ప్రయత్నమే చేయడం లేదు. తాజాగా హైడ్రా, మూసీ ప్ర‌క్షాళ‌న విష‌యంలోనూ బీఆర్ఎస్ నేతల నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యలోపం  కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. అలాగే బీజీపీ కూడా మూసీ ప్రక్షాళన, హైడ్రా విషయంలో  ఉదాశీనంగానే ఉంటోందని రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. 

మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి  (మూసీ నది ప్రక్షాళన) ప్రాజెక్టు తెలంగాణ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్ర‌క్షాళ‌న‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. హైదరాబాద్‌ను వరదల నుంచి రక్షించేందుకు, ఆక్రమణకు గురైన మూసీ నది పరివాహక ప్రాంతాలను పునరుద్ధరించి, కాలుష్య కోరల నుంచి మూసీని కాపాడేందుకు   మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. అధికారులు ముందుగా మూసీ నది ఎఫ్‌టీఎల్‌ పరిధిని సర్వే చేశారు. ఈ సర్వేలో దాదాపు 16 వేల నివాసాలు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నట్లు తేలింది. అందులో పేద, మధ్యతరగతి వారు నివసిస్తున్నారు. దీంతో ప్రభుత్వం  మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌లో భాగంగా ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న పేదలకు ఉచితంగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇవ్వాలని   నిర్ణయించింది. అందుకోసం ఇప్పటికే జీఓ కూడా జారీ చేసింది. పోలీసు భద్రత మధ్య కూల్చి వేయాల్సిన ఇళ్లకు అధికారులు మార్క్ వేశారు. ప‌లు ప్రాంతాల్లో ఇళ్ల‌ను   కూల్చివేశారు. దీంతో స్థానికంగా మెజార్టీ ప్ర‌జ‌ల నుంచి తెలంగాణ ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌య్యింది. త‌మ ఇళ్ల‌ను కూల్చొద్దంటూ మూసీ బాధితులు ఆందోళ‌న‌కు దిగారు. వారికి అండ‌గా ఉంటామ‌ని బీఆర్ఎస్‌, బీజేపీ నేత‌లు హామీలిచ్చారు. కొంద‌రు నేతలు బుల్డోజ‌ర్లు బాధితుల‌ ఇళ్ల‌పైకి వెళ్లాలంటే మ‌మ్మ‌ల్ని దాటుకొని వెళ్లాలంటూ రేవంత్ స‌ర్కార్ కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. కానీ, రేవంత్ స‌ర్కార్ మాత్రం మూసీ సుంద‌రీక‌ర‌ణ విష‌యంలో ఏమాత్రం వెన‌క్కు త‌గ్గేలా క‌నిపించ‌డం లేదు. 

తాజాగా సీఎం రేవంత్ రెడ్డి త‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మూసీ పున‌రుజ్జీవ‌న పాద‌యాత్ర చేప‌ట్టారు. సంగెంలోని మూసీ న‌ది ఒడ్డున ఉన్న శివ‌లింగానికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి యాత్ర‌ను మొద‌లు పెట్టారు. యాదాద్రి జిల్లా వ‌లిగొండ మండ‌లం సంగెం నుంచి భీమ‌లింగం వ‌ర‌కు సుమారు మూడు కిలో మీట‌ర్ల మేర రేవంత్ పాద‌యాత్ర కొన‌సాగింది. అనంత‌రం జ‌రిగిన స‌భ‌లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూసీ ప్ర‌క్షాళ‌న చేసి తీరుతామ‌ని, వెన‌క్కు త‌గ్గేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. చారిత్రాత్మ‌క‌మైన ఈ ప్రాజెక్టును అడ్డుకోవాల‌ని చూస్తే కేసీఆర్ కుక్క‌చావు చ‌స్తార‌ని, కేటీఆర్, హ‌రీశ్ రావుల‌పై బుల్డోజ‌ర్ల‌తో తొక్కుకుంటూ ముందుకు వెళ్తామ‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

ఈ పాద‌యాత్ర కేవ‌లం ట్రైల‌ర్ మాత్ర‌మే.. అస‌లు సినిమా ముందుందని రేవంత్ పేర్కొన్నారు. 2025 జనవరి మొదటి వారంలో వాడపల్లి నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర మొదలు పెడతానని, ముఫ్పై రోజుల్లో మూసి ప్రక్షాళన ప్రాజెక్టు డిజైన్లు ఖరారు అవుతాయన్నారు. ఒక విధంగా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌కు సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్ర‌మంలో వారు ఎలా రియాక్ట్ అవుతార‌నే విష‌యం ఆస‌క్తిక‌రంగా మారింది. 

మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న అనేది హైద‌రాబాద్ వాసుల‌కు సంతోషించే విష‌య‌మ‌నే చెప్పాలి. గ‌తంలో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఆ మేర‌కు ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ అడుగులు ముందుకు ప‌డ‌లేదు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి  మాత్రం ప‌ట్టుద‌ల‌తో ముందుకెళ్తున్నారు. మూసీ ప‌రివాహ‌క ప్రాంతాల్లోని నివాస‌దారుల‌ను ఒప్పించి, వారికి డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు క‌ట్టిస్తామనీ,  మూసీ ప్ర‌క్షాళ‌న విషయంలో మాత్రం వెనకడుగు లేదనీ విస్ఫష్టంగా చెబుతున్నారు.  అయితే, స్థానికంగా ప్ర‌జ‌ల నుంచి ప్ర‌భుత్వం తీరుపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మవుతున్నది. మ‌రో ఏడాదిన్న‌ర‌లో గ్రేట‌ర్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో  మూసీ న‌ది ప్ర‌క్షాళ‌నతో పార్టీకి న‌ష్టం వాటిళ్లుతుంద‌ని కొంద‌రు కాంగ్రెస్ నేత‌ల్లో ఆందోళ‌న నెల‌కొంది. అయినా సీఎం రేవంత్ ఎక్క‌డా వెన‌క‌డుగు వేసేందుకు ఇష్ట‌ప‌డటం లేదు. మ‌రోవైపు మూసీ బాధితుల త‌ర‌పున పోరాటం చేసేందుకు ప్ర‌తిప‌క్షాలు ముందుకొచ్చిన‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వం దూకుడు ముందు నిల‌వ‌లేక పోతున్నాయి. తాజాగా సీఎం రేవంత్ వ్యాఖ్యల‌తో మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న ప‌నులువేగం పుంజుకోనుంది. అయితే, విపక్ష పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ రేవంత్ దూకుడుకు ఏ మేర‌కు అడ్డుక‌ట్ట వేస్తాయి, మూసీ బాధితుల‌కు ఏ మేర‌కు అండ‌గా నిలుస్తాయ‌నేది వేచి చూడాల్సిందే.

By
en-us Political News

  
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో ఆయన సమక్షంలో జరిగిన డగ్ర్స్ పార్టీ వ్యవహారంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఘటనపై స్పష్టత కోరుతూ వారం రోజులలో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ అయ్యింది.
ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టులో ప్రస్తుతం తన కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ నుండి విచారణను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుత ధర్మాసనం వద్ద విచారణ జరుగుతుందన్న నమ్మకం లేదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ రాజాసింగ్ పై సెటైర్లు వేశారు. రాజాసింగ్, కేటీఆర్ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో ఇలాంటి స్నేహపూర్వక సంభాషణలు సాగడం మంచి వాతావరణానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వందేమాతరం అంశం చర్చనీయాంశంగా మారింది.
2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది. ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు.
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.