ప్రకృతి సంరక్షణ దినోత్సవం రోజు ఈ ప్రమాణాలు చేద్దాం!

Publish Date:Jul 25, 2022

Advertisement

ప్రస్తుతకాలంలో మనిషి తెలిసి కొంత తెలియక కొంత చేస్తున్న తప్పు ఏదైనా ఉందంటే ప్రకృతిని కాలుష్యం చేయడం. ప్రకృతి కాలుష్యం అవడం వల్ల మనిషి చుట్టూ ఎన్నో సమస్యలు ఏర్పడుతున్నాయి. ప్రతి సంవత్సరం జులై 28 వ తేదీన ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవ సందర్భంగా ప్రపంచమంతటా ఏర్పడుతున్న కాలుష్యం, ప్రకృతి విషయంలో మనుషులు చేస్తున్న తప్పులు, ప్రకృతిని కాపాడుకునే మార్గాలు. ప్రణాళికలు వంటివి చర్చించడం, నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.

ప్రపంచవ్యాప్త దేశాలు అన్నీ తీసుకునే ఈ నిర్ణయాల గురించి పక్కన పెడితే ఈ ప్రపంచం మీద అధిపత్యం చూపిస్తున్న మనుషులమైన మనం ప్రకృతి పరిరక్షణ కోసం ఏవిధమైన జాగ్రత్తలు తీసుకోవచ్చు?? ప్రకృతిని అంతో ఇంతో మనకు తోచినంత కాపాడుకుంటే ఆ ప్రకృతి మన రేపటితరాలకు మంచి చేస్తుంది.

ప్రపంచ పర్యవరణ, ప్రకృతి సంరక్షకులు అందరికీ సూచిస్తున్న, అందరూ చేయగలిగిన కొన్ని పనులు తెలుసుకోవాల్సిందే. వాటిని పటిస్తామని ప్రమాణాలు చేసుకోవాల్సిందే.

ప్లాస్టిక్ వాడకం ఆపేయాలి!

పర్యావరణం గురించి ఆలోచించే అందరూ మొదట చెప్పేమాట ప్లాస్టిక్ వాడకం ఆపేయాలని. నిజానికి సాధారణ ప్రజలకు కూడా ఎంతో సరసమైన ధరలో అందుబాటులో ఉండటం వల్ల ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగానే ఉంది. ఈ ప్లాస్టిక్ ను తిరిగి పునర్వినియోగించే అవకాశాలు ఉన్నా అది పర్యావరణానికి నష్టం చేసేదే. దీన్ని కరిగిస్తే వాయుకాలుష్యం జరుగుతుంది. పోనీ భూమిలో కలిసిపోతుందా అంటే అదీ లేదు. 

అందుకే మనిషి తన జీవనశైలిలో ప్లాస్టిక్ ను వాడటం ఆపెయ్యాలి. బదులుగా క్లాత్ బ్యాగ్ లు, పేపర్ బ్యాగ్ లు వాడటం మొదలుపెట్టాలి.

విద్యుత్ ఆదా చెయ్యాలి!

విద్యుత్ ఉత్పత్తి నీటి ద్వారా, గాలి ద్వారా ఉత్పత్తి అవుతుంది. దీనికోసం ఎంతో యంత్రాంగం అవసరం అవుతుంది. విద్యుత్ కోసం పక్కరాష్ట్రాల నుండి అప్పు తీసుకునే స్థితికి ఎన్నో రాష్ట్రాలు దిగజరిపోయాయి. విద్యుత్ ను ఆదా చేయడం మొదలుపెడితే ఖర్చు తిరుగుతుంది, దాని వృధా అరికట్టినవాళ్ళం అవుతాము. అవసరం లేని సమయంలో ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు స్విచ్ ఆఫ్ చేయాలి. ఇంటి పనులలో వీలైనంత వరకు సొంతంగా పని చేసుకోవాలి. చీటికీ మాటికి విద్యుత్ ఆధారిత వస్తువులు కొని క్రమంగా ఇంటిపని చేయకుండా ఉంటే బద్దకం కూడా ఎక్కువైపోయి తొందరగా డయాబెటిస్ రావడం ఖాయం.

నీటిని పొదుపు చేయాలి!

అందరికీ నీరు ఎంతో అవసరం. విద్యుత్ లేకపోతే పక్షులు, జంతువులు ఎంచక్కా బ్రతికేస్తాయి కానీ నీరు మాత్రం అన్ని జీవులకు కావాలి. ఇంట్లో కుళాయి తిప్పితే వచ్చేస్తున్న నీళ్ల గురించి చాలామందికి భయమే ఉండదు. పైగా ఇళ్లలో ఫిల్టర్ అయిన నీళ్లను వదులుతారు. అలాంటి నీళ్లు ఎంతో విలువైనవి. మనఇంట్లో మన ట్యాంక్ లో నీళ్లున్నాయని దానికి మనం డబ్బు కడతామని ఇష్టమొచ్చినట్టు వృధాచేయకూడదు. ఇల్లు చదవడం, బట్టలు ఉతకడం, వంట పాత్రలు కడగడం ఇలా వీటికోసం వాడే నీటిని పెరట్లో చెట్లకు మళ్లించాలి.

పునర్వినియోగం!

దేన్నైనాస్ అర్ పడేసేముందు తిరిగి వాడుకునే అవకాశం ఉందేమో ఆలోచించాలి. రీసైక్లింగ్ చేయడం, తిరిగి ఉపయోగించుకోవడం వల్ల వ్యర్థాలను తగ్గించవచ్చు.  చాలామంది వస్తువులను తిరిగి వాడటం అనేది షేమ్ గా ఫీలవుతారు. ఆ భావాన్ని తగ్గించుకోవాలి. ఇంట్లో ఉండే కంటైనర్లు, సీసాలు మొదలైనవాటిని మొక్కలు పెంచుకోవడానికి వేరే ఏమైనా స్టోర్ చేసుకోవడానికి వాడుకోవాలి.

అవసరం అయితే తప్ప కొత్తవి కొనకూడదు!

చాలామంది వస్తువులు పాతబడగానే కొత్తవి కొనేస్తారు. కానీ వస్తువులు చక్కగా పనిచేస్తున్నప్పుడు అలా పాతవి మార్చేయడం అవసరమా. మారుస్తున్న ఆ వస్తువుల వల్ల వాటిని తిరిగి రీసైకిల్ చేయడంలో చాలా పొల్యూట్ అయిపోతుంది. పరిశ్రమలు సెలరించే కొన్నిరకాల పాత వస్తువుల వల్ల పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లుతోంది అనే విషయం ఆలోచించవు. అందుకే ప్రతిఒక్కరు ప్రకృతిని కాపాడుకోవాలి.

                                   ◆ వెంకటేష్ పువ్వాడ.

By
en-us Political News

  
మనిషి  మెదడు చాలా శక్తివంతమైనది.  మనిషి మనుగడ సాగుతున్నది మెదడు పనితీరు మీదనే.. మెదడు ఎంత ఆరోగ్యంగా ఉంటే మనిషి జీవితం అంత బాగుంటుంది.  కానీ మెదడు పనితీరు సరిగా లేకపోతే చాలా సమస్యలు వస్తాయి.
"నేటి బాలలె రేపటి పౌరులు.." "విత్తనం మంచిదైతే పసిడి పంట పండుతుంది".  ఇలాంటి మాటలు తరచుగా వింటూనే ఉంటాం.
ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు భారతీయ రైల్వే ద్వారా ప్రయాణిస్తారు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే వారు అయితే.. రాత్రంతా రైళ్లలోనే ఉండాల్సి వస్తుంది.
అన్నా తమ్ముడు, అక్కా చెల్లి, అన్నా చెల్లెళ్లు,  అక్కా తమ్ముళ్లు.. ఇలా తోబుట్టువుల బంధాలు చాలా గొప్పవి. ఒకే తల్లి రక్తం పంచుకుని పుట్టిన వారి మధ్య బంధం ఎంతో అపురూపమైనది.
"నేటి బాలలె రేపటి పౌరులు.." "విత్తనం మంచిదైతే పసిడి పంట పండుతుంది".  ఇలాంటి మాటలు తరచుగా వింటూనే ఉంటాం.
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలోని ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కోవాలని కోరుకుంటారు.
ఆచార్య చాణక్యుడు   గొప్ప రాజనీతిజ్ఞుడు,  వ్యక్తిత్వ విశ్లేషణా నిపుణులు,  ఆర్థిక శాస్త్ర నిపుణులు.  ఆయన వేల సంవత్సరాల కిందటే మనిషి జీవితంలో ఎన్నో విషయాలను ఎంతో స్పష్టంగా, వివరంగా చెప్పాడు.
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటూ ఉంటారు. కానీ ఆర్థిక అవసరం ఏర్పడినప్పుడు మానవ సంబందాలే ఆదుకుంటాయి.  
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విలువలు ఉండాలని కోరుకుంటారు, కానీ ఇది అంత సులభమైన పని కాదు.
నేటి కాలంలో ఇల్లు, కారు, పిల్లల చదువు, వ్యాపారం లేదా ఇతర అవసరాల కోసం లోన్ తీసుకోవడం చాలా సాధారణమైంది.
ఈ సమాజంలో ప్రతి వ్యక్తికి కుటుంబంతో ఉండే అనుబంధం చాలా గొప్పది. ఎన్నో విషయాలు కుటుంబం నుండే నేర్చుకుంటారు.
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో రాణించడమే కాకుండా, తెలివైనవారుగా, క్రమశిక్షణ గలవారుగా , స్వయం సమృద్ధి గలవారుగా ఉండాలని కోరుకుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.