హెపటైటిస్ పై అవగాహన చాలా అవసరం!

Publish Date:Oct 21, 2024

Advertisement

మానవజీవితాన్ని ప్రస్తుతకాలంలో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న అంశం అనారోగ్యం. ఎన్నో సమస్యలు మనిషిని ఒకపట్టాన ఊపిరితీసుకొనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాటిలో కాలేయ సంబంధ సమస్యలు కూడా ఉన్నాయి. కాలేయానికి వచ్చే సమస్యలలో చివరి వరకు బయటపడకుండా ప్రమాదాన్ని తెచ్చిపెట్టే సమస్య హెపటైటిస్. ప్రపంచ హెపటైటిస్ అవగాహన దినోత్సవంను ప్రతి సంవత్సరం జులై 28వ తేదీన జరుపుతారు. దాని సందర్భంగా ఈ హెపటైటిస్ గురించి వివరంగా అందరి కోసం.

అసలు హెపటైటిస్ అంటే ఏంటి?

కాలేయం వాపుకు గురయ్యి దాని పరిమాణం పెరిగిపోవడమే హెపటైటిస్ గా వైద్య శాస్త్రంలో చెబుతారు.

మద్యపానం ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం వాపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

దీర్ఘకాలిక మందులు వాడటం వల్ల కాలేయానికి ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

అన్నిటికంటే ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్లు హెపటైటిస్ సమస్యకు కారణమయ్యే అత్యంత సాధారణ సమస్య.

హెపటైటిస్ సమస్యలో ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అనేది కూడా ఒకటి. ఈ సమస్య కాలేయ కణజాల నిర్మాణానికి ప్రతిరోధకాలను తయారుచేసేటప్పుడు ఎదురయ్యే సమస్య.

హెపటైటిస్ సమస్యను దాని ప్రభావాన్ని, లక్షణాలను అనుసరించి  ఆరోగ్య నిపుణులు అయిదు వర్గాలుగా విభజించారు. వాటిలో హెపటైటిస్ A, B, C, D మరియు E అని ఉన్నాయి. వీటిలో ఒక్కో హెపటైటిస్ సమస్యకు ఒకో వైరస్ కారణమవుతుంది.

ప్రపంచ వ్యాప్తంగా 354 మిలియన్ల ప్రజలు హెపటైటిస్ B, మరియు హెపటైటిస్ C తో బాధపడుతున్నారు. ఇది చాలా దీర్ఘకాల ప్రభావాన్ని చూపిస్తుంది.

హెపటైటిస్ A అనేది హెపటైటిస్ A అనే వైరస్ వల్ల వస్తుంది. ఇధి తీవ్రమైన సమస్య అయినా చాలా తక్కువకాలం మాత్రమే ఉంటుంది.

హెపటైటిస్ B అనే వైరస్ కారణంగా హెపటైటిస్ B సమస్య వస్తుంది. ఇది చాలా దీర్ఘకాలిక సమస్య. ప్రపంచ వ్యాప్తంగా 257 మిలియన్ ప్రజలు దీనివల్ల బాధపడుతున్నారు.

హెపటైటిస్ C అనే వైరస్ వల్ల హెపటైటిస్ సమస్య వస్తుంది. ఇది సాధారణంగా రక్తసంబంధ సమస్యలలో ఒకటి. అయితే దీని ప్రభావం దీర్ఘకాలికంగా ఉంటుంది.

హెపటైటిస్ D అనేది హెపటైటిస్ B సమస్యతో కలసి వచ్చే సమస్య. ఇది కాలేయ మంటను ఎక్కువగా కలిగిస్తుంది.

హెపటైటిస్ E అనేది హెపటైటిస్ E వైరస్ వల్ల వస్తుంది. ఇది పారిశుద్ధ్యం సరైన విధంగా లేకపోవడం వల్ల అంటే కాలుష్య ప్రాంతాలలో నివసించేవారిలో కనిపిస్తుంది. ఇది సాధారణమైన సమస్యగా అనిపించినా గర్భిణీలలో చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది.

హెపటైటిస్ లక్షణాలు!

హెపటైటిస్ B మరియు C ఉన్నవాళ్ళలో లక్షణాలు బయటకు కనిపించవు. మిగిలినవి వెంటనే లక్షణాలను కలిగి ఉంటాయి.

అలసట,

జ్వరం,

జలుబు,

మూత్రం రంగు మారటం,

మలం పలుచగా ఉండటం అంటే విరేచనాలు అవుతున్నట్టు.

ఆకలి లేకపోవడం,

పొత్తికడుపు నొప్పి,

చెప్పలేనంతగా బరువు తగ్గిపోవడం,

చర్మం రంగు మారడం (కొందరు ఈ లక్షణం చూసి పచ్చకామెర్లు అనుకుంటారు).


హెపటైటిస్ నిర్ధారణ చేయడానికి వైద్యులు చాలా రకాల పరీక్షలు చేస్తారు.

శారీరక పరీక్ష

రక్త పరీక్షలు

కాలేయ సమస్య పరీక్షలు

బయప్సి 

అల్ట్రా సౌండ్ పరీక్ష 

పైన చెప్పుకున్న పరీక్షల ద్వారా హెపటైటిస్ సమస్యను వైద్యులు నిర్ధారిస్తారు.

హెపటైటిస్ కు దూరంగా ఉండటం ఇలా!

హెపటైటిస్ A కు దూరంగా ఉండటానికి వ్యాక్సిన్ తీసుకోవచ్చు చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళవరకు అందరికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది.

వ్యాప్తిని తగ్గించుకోవడం మరొక ముఖ్యమైన జాగ్రత్త. తీసుకునే ద్రవపదార్థాలు, నీరు ఇతర ద్రవాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇన్ఫెక్షన్ లకు గురయ్యే అవకాశాన్ని రానివ్వకూడదు.

హెపటైటిస్ A మరియు E సంక్రమించకుండా ఉండటానికి పరిశుభ్రత చాలా ముఖ్యం.

ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు అక్కడ నీరు, ఆహారం, చల్లని పదార్థాలు, కూల్ డ్రింక్స్ వంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. హెపటైటిస్ B,C,E వైరస్ లు వీటి ద్వారా ఇన్ఫెక్షన్ సృష్టిస్తాయి.

పైన చెప్పుకున్నట్టు హెపటైటిస్ అనేది బయటకు తెలియకుండా ప్రమాదంగా మారే సమస్య. దాని నుండి అందరూ జాగ్రత్తగా ఉండాలి మరి.

                                  ◆వెంకటేష్ పువ్వాడ.

By
en-us Political News

  
మనుషుల నుండి ప్రాణం ఉన్న ప్రతి జీవి ఆహారం తీసుకోవడం పరిపాటి.  తీసుకునే ఆహారం నుండి లభించే శక్తితోనే శరీరం నిలబడుతుంది.
నేటికాలంలో ప్రేమ, ఆకర్షణ మధ్య తేడాను తెలుసుకోలేని వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. ఆకర్షణను ప్రేమగా పొరబడేవారు.. హద్దులు దాటి ముందుకు వెళ్లేవారు కోకొల్లలు ఉన్నారు.
మనిషి  మెదడు చాలా శక్తివంతమైనది.  మనిషి మనుగడ సాగుతున్నది మెదడు పనితీరు మీదనే.. మెదడు ఎంత ఆరోగ్యంగా ఉంటే మనిషి జీవితం అంత బాగుంటుంది.  కానీ మెదడు పనితీరు సరిగా లేకపోతే చాలా సమస్యలు వస్తాయి.
"నేటి బాలలె రేపటి పౌరులు.." "విత్తనం మంచిదైతే పసిడి పంట పండుతుంది".  ఇలాంటి మాటలు తరచుగా వింటూనే ఉంటాం.
ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు భారతీయ రైల్వే ద్వారా ప్రయాణిస్తారు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే వారు అయితే.. రాత్రంతా రైళ్లలోనే ఉండాల్సి వస్తుంది.
అన్నా తమ్ముడు, అక్కా చెల్లి, అన్నా చెల్లెళ్లు,  అక్కా తమ్ముళ్లు.. ఇలా తోబుట్టువుల బంధాలు చాలా గొప్పవి. ఒకే తల్లి రక్తం పంచుకుని పుట్టిన వారి మధ్య బంధం ఎంతో అపురూపమైనది.
"నేటి బాలలె రేపటి పౌరులు.." "విత్తనం మంచిదైతే పసిడి పంట పండుతుంది".  ఇలాంటి మాటలు తరచుగా వింటూనే ఉంటాం.
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలోని ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కోవాలని కోరుకుంటారు.
ఆచార్య చాణక్యుడు   గొప్ప రాజనీతిజ్ఞుడు,  వ్యక్తిత్వ విశ్లేషణా నిపుణులు,  ఆర్థిక శాస్త్ర నిపుణులు.  ఆయన వేల సంవత్సరాల కిందటే మనిషి జీవితంలో ఎన్నో విషయాలను ఎంతో స్పష్టంగా, వివరంగా చెప్పాడు.
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటూ ఉంటారు. కానీ ఆర్థిక అవసరం ఏర్పడినప్పుడు మానవ సంబందాలే ఆదుకుంటాయి.  
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విలువలు ఉండాలని కోరుకుంటారు, కానీ ఇది అంత సులభమైన పని కాదు.
నేటి కాలంలో ఇల్లు, కారు, పిల్లల చదువు, వ్యాపారం లేదా ఇతర అవసరాల కోసం లోన్ తీసుకోవడం చాలా సాధారణమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.