కిడ్నీల గుట్టు తెలుసుకోండి!

Publish Date:Mar 9, 2023

Advertisement

రక్తంలోని పనికిరాని పదార్థాల్ని వేరుచేసి బయటకు పంపడానికి, రక్త శుద్ధితో పాటు రక్తపోటుని పరిరక్షించడానికి, శరీరంలో నీటి పరిమాణంతోపాటు మిగతా ద్రవ పదార్థాల స్థాయిని పరిరక్షించేవి మన దేహంలోని అత్యంత ముఖ్య భాగాలైన మూత్రపిండాలు. చర్మంలోని స్వేద గ్రంధులు చెమట రూపంలో కొన్ని మెటబాలిక్ వ్యర్థ పదార్థాల్ని, నీటిని బయటకు పంపుతున్నా వీటిని బయటకు పంపడానికి వుద్దేశించిన శరీరంలో ప్రత్యేకంగా వున్న అవయవాలు మూత్రపిండాలు.

మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో వున్న రెండు చిన్న అవయవాలు. ఒక్కొ మూత్రపిండం 10 సెం.మీ. పొడవు 6 సెం.మీ. వెడల్పు వుండి వెన్నెముక దిగువ భాగంలో రెండు పక్కలా రెండు వుంటాయి. చివరి రెండు రిబ్స్ మూత్రపిండాలకు రక్షణ నిస్తుంటాయి. ఒక్కో మూత్రపిండం 140 గ్రాముల బరువుంటుంది. దాదాపు మిలియన్ నెఫ్రానులు అనే వడపోత భాగాలు ఒక్కో మూత్రపిండంలో వుంటాయి. ప్రతీ నిముషం ఒక లీటరు రక్తం వాటి గుండా ప్రవహిస్తూంటుంది. 24 గంటల్లో ఈ నెఫ్రానులు 16 లీటర్ల ద్రావకాన్ని వేరు చేస్తుంటాయి. వాటిలోంచి చాలా భాగం మూత్రపిండాల నాళాలు తిరిగి గ్రహించగా ఆఖరికి 1 నుంచి లీటర్ల వ్యర్థ దావకం మూత్ర రూపంలో బయటకు పోతుంటుంది.

మూతము, మూత్రపిండాలు సాధారణంగా క్రిములు లేకుండా వుంటాయి. లోపల లేకపోయినా మూత్రాశయంలో ఆడ, మగ ఇద్దరిలో ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశముంది. మూత్ర మార్గము, మర్మావయవము ఒక చోటవుండడంతో సంపర్కము వల్ల క్రిములు లోపలకు ప్రవేశించి, మూత్రాశ యాన్ని చేరుకునే ప్రమాదముంది. దీనినే 'యురెథ్రయిటిస్' అంటారు.

పైలోనె ఫ్రయిటిస్

పోస్టేట్ గ్రంధులు పెద్దవైనప్పుడు మూత్రాశయ ద్వారం మూసుకుపో తుంది. దాంతో మూత్రాశయంలో మూత్రం నిల్వ వుండిపోయే ప్రమాదముంది. ఇన్ ఫెక్షన్ ని కలిగించే సూక్ష్మజీవులు మూత్రంలో అధిక సంఖ్యలో పెరుగుతాయి. అందుకనే అలాంటి పరిస్థితుల్లో అతి త్వరగా ఇన్ ఫెక్షన్ వచ్చే ప్రమాదముంది. మూత్రాశయం వరకే ఇన్ ఫెక్షన్ వస్తే అది త్వరగానే తగ్గిపోతుంది. అలాకాకుండా ఇన్ ఫెక్షన్ మూత్రపిండాల వరకూ వ్యాపిస్తే 'పైలో నెఫ్రయిటిస్' అనే వ్యాధి రావచ్చు.

మూత్ర పిండాలలో రాళ్ళు

మూత్రపిండాలు పని చేసుకుపోతున్నప్పుడు వ్యర్థాలతో పాటు కొన్ని పదార్థాలు డిపాజిట్ అయి అవి చిన్న చిన్న రాళ్ళలా మారి మూత్రపిండాలలో, మూత్రనాళాలలో అడ్డంపడుతుంటాయి. అవి రకరకాల పరిమాణాల్లో వుంటాయి. కాల్షియమ్ లేక యూరిక్ యాసిడ్ డిపాజిట్ లతో ఇవి తయారవుతుంటాయి. కొన్ని రాళ్లు పెద్దవిగా కూడా వుంటాయి. అవి మూత్రనాళాలలో అడ్డం పడి మూత్ర విసర్జనకి అవరోధాన్ని కలిగిస్తాయి.

మూత్ర పిండాలు చెడిపోవడం రెండు రకాలు.

అవి. 1. ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్

 2. క్రానిక్ నల్ ఫెయిల్యూర్.

ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అయితే మూత్రం తగ్గవచ్చు. వాపు రావచ్చు. రక్తపోటు పెరగవచ్చు. శరంలో నీరు తగ్గి అతిసార వ్యాధి రావచ్చు.

క్రానిక్ ఫెయిల్యూర్ లో మూత్రపిండాలు నెమ్మదిగా, పూర్తిగా చెడతాయి. తిరిగి వాటిని బాగు చేయడాని వీలుకాదు. మూతపిండాల మార్పిడి అవసరమవుతుంది.

నెఫ్రోటిక్ సిండ్రోమ్

మూత్రపిండాలలో నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనే అనారోగ్యము వస్తుంది. రక్తంలోంచి మూత్రపిండాలు పనికిరాని పదార్థాలు వేరు చేసేప్పుడు ప్రొటిన్ కూడా లీక్ అయి మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోయే జబ్బును 'నెఫ్రోటిక్ సిండ్రోమ్' అంటారు.

అధిక రక్తపోటుతో...

అధిక రక్తపోటు వల్ల మూత్రపిండాలు దెబ్బ తింటాయి. అధిక రక్తపోటు వల్ల క్రమంగా మూత్రపిండాలలోని చిన్న ఆర్టెరీస్ దెబ్బ తింటాయి. క్రమంగా మూత్రపిండాల పనితీరు పూర్తిగా దెబ్బ తింటుంది. దెబ్బతిన్న మూత్రపిండాల వల్ల రక్తపోటు మరింత పెరుగుతుంది. మూత్రపిండాలలోని రెనిన్ రక్తపోటు పెంచుతుంది.

మూత్రపిండాల్ని పాడుచేసే మరికొన్ని కారణాలు

కొన్ని కొన్ని జబ్బులవల్ల కూడా మూత్రపిండాలు దెబ్బ తింటాయి. కొన్ని మందులు, విషపదార్థాలు తీసుకున్నా మూత్రపిండాలు చెడిపోతాయి. 

'మూత్రపిండాల అనారోగ్యాన్ని పసిగట్టడానికి చేసే పరీక్షలు'

బ్లడ్ ప్రెజర్, ఎక్సరే, కిడ్నీబయాప్సీ, యూరిన్ అనాలిసిస్, బ్లడ్ అనాలిసిస్ మొదలయిన పరీక్షలు చేసి మూత్రపిండాల పనితీరుని శోధించి ఒకవేళ ఏమైనా అనారోగ్యాలుంటే కనుగొనడంతో పాటు అవి ఏ స్థాయిలో వున్నాయో కూడా తెలుసుకుంటారు. మొదట్లోనే చికిత్సని ప్రారంభిస్తే మూత్రపిండాల జబ్బులన్నింటినీ నయం చేయవచ్చు. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయనప్పుడు ఉప్పు నీరు, మాంసకృత్తులు (ప్రొటీన్స్) ఒక పద్ధతి ప్రకారమే తీసుకోవాలి. బాక్టీయావల్ల మూత్రపిండాలు కొద్దిగా పాడైతే యాంటి బయాటిక్స్ వాడాలి.

                                 ◆నిశ్శబ్ద.

By
en-us Political News

  
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మోకాళ్ళ నొప్పులు. జీవనశైలిలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం మరియు సరైన పోషకాహారం..
వేసవి మొదలవ్వగానే తీవ్రమైన ఎండ , పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మన రోజువారీ  కార్యకలాపాలు , ఆరోగ్యంపై ప్రభావం చూపడం మొదలవుతుంది. ఈ రోజుల్లో బయట కొద్దిసేపు ఉన్నా కూడా శరీరం అలసిపోయేంత వేడిగా ఉంటుంది...
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.  ముఖ్యంగా వేసవి కాలంలో నీటిశాతం అధికంగా ఉన్న పండ్లను ఎంత తీసుకుంటే అంత మంచిదని చెబుతూ ఉంటారు. కానీ చాలామంది వేసవి కాలంలో పండ్ల జ్యూసులు..
నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య కిడ్నీ వ్యాధులు...
తిండి కలిగితే కండ కలదోయ్ అని అంటుంటారు. అలాగే కొందరు ఎంత కారంగా ఉన్న ఆహారం తింటే.. శరీరం అంత దృఢంగా ఉంటుందని కూడా అంటుంటారు.  ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు బాగా కారంగా...
నేటి కాలంలో మారుతున్న జీవనశైలి, ఒత్తిడి మరియు ఆహారపు అలవాట్ల వల్ల వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటు (Heart Attack) బారిన పడుతున్నారు. అయితే, గుండెపోటు అకస్మాత్తుగా వచ్చే ప్రమాదమే అయినప్పటికీ, మన శరీరం కొన్ని రోజుల ముందే కొన్ని లక్షణాల ద్వారా మనల్ని హెచ్చరిస్తుంది. ఆ సంకేతాలను సరైన సమయంలో గుర్తిస్తే ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు.
భారతీయుల ఆహారంలో పాలు, పాల ఉత్పత్తులకు చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది.  పాలు, పెరుగు, వెన్న, నెయ్యి లేకుండా రోజు అస్సలు గడవదు.  ఇక ఇప్పట్లో చాలా మంది పనీర్ కుడా బాగా వినియోగిస్తున్నారు....
మన వంటింట్లో ఉండే వెల్లుల్లి కేవలం రుచికే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలకు కూడా మారుపేరు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు, అధిక బరువు మరియు మధుమేహంతో బాధపడేవారికి వెల్లుల్లి ఒక వరప్రసాదం లాంటిది. ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఈ వీడియోలో వెల్లుల్లిని ఎలా వాడాలి మరియు దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి సవివరంగా వివరించారు...
ఆయుర్వేదంలో అయినా ప్రాచీన ఆరోగ్య చిట్కాలలో అయినా రాగి పాత్రలో నీరు త్రాగడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది శరీరానికి ఖనిజాలు , విటమిన్లను అందించి, జీర్ణక్రియను మెరుగుపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతుందని నమ్ముతారు. కానీ ఇది అందరికీ మంచిది కాదనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు...
మన భారతీయ సంప్రదాయంలో యోగాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. యోగా కేవలం ఆసనాలకే పరిమితం కాదు, ‘ముద్రలు’ కూడా మన శరీర ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. మన చేతి ఐదు వేళ్లు పంచభూతాలకు (అగ్ని, వాయువు, ఆకాశం, పృథ్వీ, జలం) ప్రతిరూపాలు. ఈ వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఉంచే పద్ధతినే ‘ముద్ర’ అంటారు.
మన శరీరంలో మెదడు తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన అవయవం కాలేయం (Liver). జీర్ణక్రియను మెరుగుపరచడం నుంచి, రక్తాన్ని శుద్ధి చేయడం వరకు కాలేయం సుమారు 500 పైగా పనులను నిర్వహిస్తుంది...
ఈ రోజుల్లో అనారోగ్యకరమైన జీవనశైలి,  ఆహారపు అలవాట్ల కారణంగా గుండె జబ్బుల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో కొంతకాలంగా యువతలో గుండెపోటులు సంభవిస్తున్నాయి. గుండెను బలోపేతం..
వేసవి కాలంలో శరీరానికి నీరు చాలా అవసరం. నీటి కొరత ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి రోజుకు 8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగమని వైద్యులు తరచుగా సలహా ఇస్తారు. అదనంగా..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.