పొగ మానాలనుకుని విఫలమవుతున్నారా?.. ఇది మీకోసమే..

Publish Date:Aug 17, 2024

Advertisement

నిజంగా ఒక వ్యక్తి పొగతాగడం మానేయడం సాధ్యమేనా?? ఒకవేళ సాధ్యమైతే అది ఎలా మానగలుగుతాడు?

సహజంగా మొట్టమొదట చెయ్యవలసిన పని మానివెయ్యడమే. మొదటి రోజు గంటసేపు, మరునాడు రెండేసి గంటల సేపు, మూడో రోజున మూడేసి గంటల సేపు - ఇలా మానివెయ్యడమా? అసలు ఒకేసారి పూర్తిగా మానివెయ్యడమా? అనేది వ్యక్తిగత విషయం. దాన్ని ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు. ఏమైనా సరే, ఈ విషయంలో ఒక నిశ్చయం చేసుకోవడానికీ, దాన్ని తు.చ తప్పక అమలు చేయడానికి దృఢమయిన మనోనిబ్బరం అవసరం. 

అందుకోసం కొన్ని చిట్కాలు:
సాధ్యమైనంత వరకు పొగ తాగేవాళ్లకి దూరంగా ఉండాలి. ముఖ్యంగా మొదటి మూడు నాలుగు వారాలపాటు పొగతాగే వారితో, ఆ అలవాటు ఉన్న స్నేహితులతో కలవడకూడదు. వాళ్ళతో కలవకపోతే వాళ్ళు అపార్థం చేసుకుంటారని, ఏదో అనుకుంటారని ఆలోచన వద్దు. వాళ్ళు ఏమైనా అనుకున్నా.. మీరు పొగతాగడం మానేస్తే చాలామంది మీ దృఢ నిశ్చయానికి చాటున ఎంతో మెచ్చుకుంటారు. కాని, మరికొందరు ఏమి కాదు తాగు అంటూ బలవంతం చేస్తారు. కాబట్టి మీరు అనుకున్నది సాధించే వరకు స్నేహితులను కలవద్దు. 

పొగాకు వాడకం ఏ రూపంలోనైనా సరే దగ్గరకు రానివ్వకూడదు. పొగాకు అంటే అదొక మత్తు. కేవలం ధూమపానమే కాదు, ఇతర పొగాకు ఆధారిత పదార్థాలను కూడా తీసుకోకూడదు. వీలైతే స్నేహితులను కూడా మీతో జతకలిపి వారు కూడా మానేందుకు ప్రోత్సహించండి.  

ఎప్పటి నుండో అలవాటైన పొగ ఒక్కసారిగా మానితే.. మనసు అటే లాగుతుంది. అయితే పొగ తాగాలని అనిపించినప్పుడల్లా ఒకటి రెండు గ్లాసుల నీళ్లయినా లేదా పళ్లరసమైనా తాగాలి. కొంత కాలం ఇలా రోజూ చాలా సార్లు చెయ్యాల్సి వస్తుంది. కానీ తాగిన నీరు పొగ పీల్చాలనే తీవ్ర వాంఛను అరికట్టడానికి సాయపడుతుంది. పైగా, శరీరంలో కలిసిపోయిన నికొటిన్, ఇతర విష పదార్థాలను తొలగించడంలో ఇది తోడ్పడుతుంది.

రోజూ రెండుసార్లు వేన్నీళ్ల స్నానం చేసి, ఆ వెంటనే చురుకు పుట్టించే లాగ చన్నీటి స్నానం చెయ్యాలి. ఇది శారీరకంగా ఎంతో మెరుగు చెయ్యడమే కాదు, రక్తప్రసరణ క్రమాన్ని చక్కబరిచి, అనుకున్న పని చేయడానికి సహకరిస్తుంది. మనోనిబ్బరాన్ని పెంచుతుంది.  

రోజూ వ్యాయామం చెయ్యాలి. శ్వాస సంబంధ వ్యాయామాలు ఎంతో గొప్పగా సహాయపడతాయి. ప్రశాంతంగా, స్వచ్ఛమైన గాలి ఉన్న ప్రాంతాలకు అలా వాకింగ్ వెళ్లడం శ్వాసకోశాలను శుభ్రపరచి, ఆరోగ్యాన్ని పెంచుతుంది. 

ఆహారం విషయంలో జాగ్రత్త.. వీలైనంత ఎక్కువగా తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. పొగాకు వల్ల శరీరంలో చేరిన విషాలకు ఇవి చక్కని విరుగుడుగా పనిచేస్తాయి. నిజం చెప్పాలంటే కొన్ని వారాలపాటు ప్రత్యేకించి పండ్లు, కూరగాయలే తీసుకొని ఉన్నారంటే పొగ తాగాలనే కోరికే లేకుండా పోతుంది. రక్తంలో షుగర్లు నిలకడగా ఉండేందుకు సహాయపడుతుంది. తరచుగా కొంచెం కొంచెంగా తింటూ ఉండాలి. ఒత్తిడి సమయంలో నాడులను స్థిమిత పరచడానికి ఇది తోడుపడుతుంది. ఒత్తిడి ఉన్నప్పుడు తెలియకుండానే ఎక్కువ తినేస్తారు కాబట్టి జాగ్రత్త, ఇది ఊబకాయానికి దారి తీస్తుంది.

ఇవన్నీ పాటిస్తే పొగతాగడం ఇంత సులువా అంటారు..

◆నిశ్శబ్ద

By
en-us Political News

  
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మోకాళ్ళ నొప్పులు. జీవనశైలిలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం మరియు సరైన పోషకాహారం..
వేసవి మొదలవ్వగానే తీవ్రమైన ఎండ , పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మన రోజువారీ  కార్యకలాపాలు , ఆరోగ్యంపై ప్రభావం చూపడం మొదలవుతుంది. ఈ రోజుల్లో బయట కొద్దిసేపు ఉన్నా కూడా శరీరం అలసిపోయేంత వేడిగా ఉంటుంది...
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.  ముఖ్యంగా వేసవి కాలంలో నీటిశాతం అధికంగా ఉన్న పండ్లను ఎంత తీసుకుంటే అంత మంచిదని చెబుతూ ఉంటారు. కానీ చాలామంది వేసవి కాలంలో పండ్ల జ్యూసులు..
నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య కిడ్నీ వ్యాధులు...
తిండి కలిగితే కండ కలదోయ్ అని అంటుంటారు. అలాగే కొందరు ఎంత కారంగా ఉన్న ఆహారం తింటే.. శరీరం అంత దృఢంగా ఉంటుందని కూడా అంటుంటారు.  ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు బాగా కారంగా...
నేటి కాలంలో మారుతున్న జీవనశైలి, ఒత్తిడి మరియు ఆహారపు అలవాట్ల వల్ల వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటు (Heart Attack) బారిన పడుతున్నారు. అయితే, గుండెపోటు అకస్మాత్తుగా వచ్చే ప్రమాదమే అయినప్పటికీ, మన శరీరం కొన్ని రోజుల ముందే కొన్ని లక్షణాల ద్వారా మనల్ని హెచ్చరిస్తుంది. ఆ సంకేతాలను సరైన సమయంలో గుర్తిస్తే ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు.
భారతీయుల ఆహారంలో పాలు, పాల ఉత్పత్తులకు చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది.  పాలు, పెరుగు, వెన్న, నెయ్యి లేకుండా రోజు అస్సలు గడవదు.  ఇక ఇప్పట్లో చాలా మంది పనీర్ కుడా బాగా వినియోగిస్తున్నారు....
మన వంటింట్లో ఉండే వెల్లుల్లి కేవలం రుచికే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలకు కూడా మారుపేరు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు, అధిక బరువు మరియు మధుమేహంతో బాధపడేవారికి వెల్లుల్లి ఒక వరప్రసాదం లాంటిది. ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఈ వీడియోలో వెల్లుల్లిని ఎలా వాడాలి మరియు దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి సవివరంగా వివరించారు...
ఆయుర్వేదంలో అయినా ప్రాచీన ఆరోగ్య చిట్కాలలో అయినా రాగి పాత్రలో నీరు త్రాగడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది శరీరానికి ఖనిజాలు , విటమిన్లను అందించి, జీర్ణక్రియను మెరుగుపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతుందని నమ్ముతారు. కానీ ఇది అందరికీ మంచిది కాదనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు...
మన భారతీయ సంప్రదాయంలో యోగాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. యోగా కేవలం ఆసనాలకే పరిమితం కాదు, ‘ముద్రలు’ కూడా మన శరీర ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. మన చేతి ఐదు వేళ్లు పంచభూతాలకు (అగ్ని, వాయువు, ఆకాశం, పృథ్వీ, జలం) ప్రతిరూపాలు. ఈ వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఉంచే పద్ధతినే ‘ముద్ర’ అంటారు.
మన శరీరంలో మెదడు తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన అవయవం కాలేయం (Liver). జీర్ణక్రియను మెరుగుపరచడం నుంచి, రక్తాన్ని శుద్ధి చేయడం వరకు కాలేయం సుమారు 500 పైగా పనులను నిర్వహిస్తుంది...
ఈ రోజుల్లో అనారోగ్యకరమైన జీవనశైలి,  ఆహారపు అలవాట్ల కారణంగా గుండె జబ్బుల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో కొంతకాలంగా యువతలో గుండెపోటులు సంభవిస్తున్నాయి. గుండెను బలోపేతం..
వేసవి కాలంలో శరీరానికి నీరు చాలా అవసరం. నీటి కొరత ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి రోజుకు 8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగమని వైద్యులు తరచుగా సలహా ఇస్తారు. అదనంగా..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.