ప్రపంచ రక్త దాన దినోత్సవం.. అపోహలు...

Publish Date:Jun 17, 2021

Advertisement

అన్నీదానాలలోకి రక్త దానంచాలా గొప్పది.ఇది నిజం. మీరు చేసిన రక్త దానం ఒక ప్రాణాన్ని కాపాడు తుంది. ఇది నిజం అత్యవసర సమయంలో ముఖ్యంగా  రోడ్డు ప్రమాదం లో ఆసుపత్రిలో ఉన్నవారు, గుండెకు స్టన్టింగ్ బై పాస్ సర్జరి చేసుకునే వారికి ,లేదా ఇతర శస్త్ర చికిత్సలు చేసుకునే రోగులకు, అత్యవసరంగా రక్త దానం చేయడం అవసరం. కొన్ని సందర్భాల లో నేరుగా రోగికి రక్త దానం చేయడం వల్ల రోగి కోలుకుని మన ముందు బతికి వస్తే మనం చేసిన రక్త దానం ఎంత గొప్పదో తెలుస్తుంది. ఒక సంతృప్తి ఉంటుంది.

ప్రపంచ రక్త దాన దినోత్సవం- అపోహలు...

జూన్ 14 న  ప్రపంచ రక్త దాన దినోత్సవాన్ని జరుపు కుంటారు.దీనికి గుర్తుగా ఈ వారం అంత దినోత్సవాన్ని జరుపు కుంటారు. అయితే రక్త దానం పై కొన్ని అపోహలు సందేహాలు ఉన్నాయి. రక్తదానం గురించి సరైన అవగాహన అర్ధం చేసుకోడం అవసరం. వైద్య రంగం గురించి చాలా రకాల అపోహలు ఉంటూనే ఉంటాయి.దీని పై పూర్తిగా పరిశోధన లు సరిగా జరగ లేదు.నేటికీ పూర్తిగా అవగాహన కల్పించ లేక పోతున్నారు .అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 13.2 మిలియన్ల రక్త దాతలు ఉంటే ప్రపంచ వ్యాప్తంగా 1 0 0 మిలియన్ల ప్రజలు కొన్ని యూనిట్ల రక్తం ప్రతి సంవత్సరందానం చేస్తారు. 

మీరు రక్తదానం చేయాలన్న నిర్ణయం తీసుకుంటే...

మీరు  చేసే రక్త దానం చేయాలన్న ఒక ప్రాణాన్ని రక్షిస్తుంది.చాలా  మంది రక్తాన్ని వివిధ గ్రూపులుగా విభజిస్తారు. ఎర్ర రక్త కణాలు, ప్లాటి లెట్స్, ప్లాస్మా, ను రోగులకు వ్యక్తులకు ప్రత్యేక పరిస్థితులలో ఇవ్వచ్చు. ఐలాండ్ యూనివర్సిటీ ఆసుపత్రికి చెందిన ఉపాద్యక్షుడు ఎమెర్జెన్సీ మెడిసిన్ డాక్టర్ జేమ్స్ ఎఫ్ కెన్ని రక్తదానం గురించి న అభిప్రాయాలు వెలిబుచ్చారు.ఎవరైతే అత్యవసర సమయం లో తీవ్రమైన గాయాలు  లేదా సర్జరీ చేసుకునే రోగులు,లేదా కీమో థెరఫీ.లేదా బోన్ మ్యారో  సహజంగా అవసరం  అవుతుందో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ప్రతి రెండు సెకండ్ల కు రక్తం అవసరం.ఇలా  ప్రతి సంవత్సరం రక్తం ఎక్కించడం, లేదా రక్త మార్పిడి చేస్తూ ఉంటారు.

1) రక్త దానం చేస్తే అనారోగ్యం పాలౌతమా...

ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళు రక్త దానం చేయవచ్చు. రక్త దానం చేశాక అనారోగ్యం పలౌతారని అనడం కేవలం అపోహ అనారోగ్యం రావడం  తక్కువే., రక్త దానం చేసీన తరువాత వైద్యులు ఒకరోజు విరామం తీసుఓవలని సూచిస్తారు. విరామం తరువాత కొన్ని శక్తి నిచ్చే పానీయాలు తీసుకో వాలని సూచించారు. రక్త దానం చేసిన నాలుగు వారాలు లేదా మూడు నెలలలో మరలా మన శరీరంలో తిరిగి చేరుతుంది. ఆతరు వాడేప్లాస్మా పెరుగు తుంది.రక్తం నిల్వ చేసే కేంద్రాలలో బ్లడ్ బ్యాకు లలో ఇవ్వచ్చు. లేదా నేరుగా ఆసుపత్రుల లోని రక్త నిధి కేంద్రాలలో రక్తం దానం చేయవచ్చు. రక్త దానం చేయడం వల్ల కొన్ని సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉన్నాయన్నది వాస్తవం అని డాక్టర్ జాన్ రైమో అన్నారు.రక్త దానం చేయడం వల్ల  త్వరగా అలిసి పోవడం, శరీరం తేలిక గా ఉండడం., బలహీనంగా ఉన్నట్లు అనిపించడం సహజమని అన్నారు. కాగా ఈ సమస్య నుంచి బయట పాడాలంటే మంచి నీళ్ళు తీసుకుంటూ ఏదైనా స్నాక్స్ తీసుకోవాలని సూచించారు.చేయి ఎర్రగా అయినట్లు దద్దుర్లు ఉన్నట్లు 
అని పిస్తుంది..

2) వృద్ధులు పెద్దలు రక్త దానం చేయవచ్చా...

ఇది నిజం కాదు. యు ఎస్ ప్రజలు 1 6 కంటే తక్కువ సంవత్సరాలు ఉన్నవాళ్ళు 50 కిలోలు -లేదా 110 పౌండ్లుఉన్న వాళ్ళు రక్త దానం చేయ వచ్చునని తెలిపారు.రక్తదానానికి వెల కట్టలేము. యునైటెడ్ కింగ్ డమ్ లో 17 సం --నుండి 6 0 సంవత్సరాల లోపు లేదా 70 సం లోపు వారు రక్త దానం చేయవచ్చు.అంతకు ముందు ఎవరైనా రక్త దానం చేసి ఉంటే మళ్ళీ రక్త దానం చేయవచ్చని తెలిపారు.

3) ఎవరైనా చికిత్సలో ఉంటే లేదా మందులు వాడు తుంటే వారు దానం చేయవచ్చా...

ఇది ఒక రకంగా ఉండే అపోహ మాత్రమే యాంటీ కాగులెట్స్, యాంటీ ప్లాటీలెట్స్, చర్మం పై వచ్చే పింపుల్స్ కి చికిత్స తీసుకున్న వారు. రక్త దానం చేయకూడదు.ఏది ఏమైనా చాలా రకాల కేసులలో మందులు అంటే రక్త దానం చేయమని అడగరు. రక్త దానం చేయడానికి ముందు వ్యక్తి వైద్య వృత్తిలో ఉన్న వారు ప్రస్తుతం వాడుతున్న మందులు వాటి వివరాలు రక్త దాతకు వచ్చే ఇతర పరిణామాలు 
వైద్యుడు మీకు మందులు సూచించి నట్లైతే ఆ మందులు రక్త దానం తీసుకో కూడదని అన్నది సరికాదు.

4)రక్త దానం చేయడం సమయం వృధా...

రక్తదానం చేయదానికి  రిజిస్ట్రేషన్ ప్రొసెసింగ్ పరిశీలన సమయం  తీసుకోడం అనుకుంటారు.రక్త దానం చేయడానికి 8- 10 నిమిషాల సమయం  పడు తుంది అమెరికన్ రెడ్ క్రోస్ ప్రకారం 15 నిమిషాల నుంచి ఒక ఘంట సమయం పడు తుంది.

5)రక్త దానం చేస్తే ఇన్ఫెక్షన్ వస్తుందా ?...

రక్త దానానికి ముందు కొంత ప్రిపరేషన్, ఉంటుంది. నీడిల్ ఇచ్చే ముందు రక్తం దానం చేసే దగ్గర  శరీరం గట్టిగా ఉండకూడదు.బిగ పట్టా కూడదు. కొత్త సూదిని లేదా స్టెర్లైస్ చేసిన సూదిని మాత్రమే వాడాలి.

6) రక్తం ఎక్కించు  కుంటె ఇన్ఫెక్షన్ వస్తుందా ?

రక్త దానానికి దీనికి సంబందం లేదు,ఇది ఒక అపోహ మాత్రమే వేరొకరి రక్తం తీసుకుంటే ప్రమాదం. అన్నది భ్రమ మాత్రమే.అని అనుకుంటున్నారు. రక్తం తీసుకున్న వారికి ఇన్ఫెక్షన్ వస్తుందన్న అరుదైన సంఘటన గా పేర్కొన్నారు.రక్తంలో ఏమైనా వైరస్ లు బ్యాక్టీరియా ఉనయో లేదో స్క్రీన్ 
చేస్తారు. లేదా హెపటైటీస్ బి పరీక్ష అనంతరం రక్తం  తీసుకుంటారు.అలాంటి సమస్యలో 100 లో ఒకరికి వస్తుంది.

7) రక్త దానం చేయడం నొప్పి కలిగిస్తుందా..

ఇది ఒక అపోహ రక్తం తీసేందుకు లేదా ఇచ్చేందుకు ఇచ్చే ఇంజక్షన్ ఇది సహజంగా అంత ప్రమాద కరమైనది కాదు. రక్త దానం చేయడం సురక్షితం గానే ఉంటుంది.

8)సంవత్సరానికి ఒక్క సారె రక్త దానం చేయాలి...

ఇది నిజం కాదు శరీరానికి రక్త దానం చేసిన తరువాత రక్తం తిరిగి పొందాలంటే 8 వరాల సమయం పడుతుంది.మరల సురక్షితంగా రక్త దానం 
చేయవచ్చు. 

9) టా టూ వేసుకునే వారు, లేదా పచ్చ బొట్టు వేసుకునే వారు రక్త దానం చేయవచ్చా....

ఇది దీర్ఘ  కాలం గా ఉన్న అపోహ ఇంకా అపోహ ఇలాగే కొనసాగు తుంది. అమెరికన్ రెడ్ క్రోస్ ఇచ్చిన సూచన మేరకు టాటు వేసుకున్న తరువాత  టాటు అందు బాటులో ఉండ కూడదు.అదే సింగల్ ఇన్స్తుమెంట్ లేదా వాడి పారేసిన నీడిల్ అలా పచ్చ బొట్టు లేదా టాటు తీసుకున్న వాళ్ళు 3 నెలలు రక్త దానం చేయడానికి  ఆగాలి.

10) బీపీ ఉంటే రక్త దానం చేయవచ్చా...

మీకు హై బీపీ ఉంటే రక్తదానం చేయరాదు. ఇది నిజం కాదు. ఎవరైతే సిస్టోటిక్ బ్లడ్ ప్రెషర్ 180/100 ఉన్న వారు రక్త దానం చేయ వచ్చు.బిపికి వాడే మందుల వల్ల రక్త  దానం చేయకూడ దనేది లేదు. కొన్ని రకాల మందులు వాడడం లేదా డ్రగ్స్ వాడిన వాళ్ళు రక్త దానం చేయరాదు.

11) హై కొలస్ట్రాల్ ఉంటే రక్త దానం చేయవచ్చా...

ఇది నిజం కాదు హై కొలస్ట్రాల్ ఉన్న వారు వాడే తక్కువ మోతాదులో తీసుకునే మందు రక్త దానం చేయడానికి అనర్హులు

12)వేజి తెరియన్స్ వెజాన్స్ రక్త దానం చేయకూడదు...

ఇడీ మరో అపోహ ఆరోగ్యం పై హెల్త్ స్క్రీనింగ్ సాత్వికులు,రక్తంలో ఐరన్, రక్త హీనత తో    బాధ పడు తున్న వారికి  ప్రతి రక్త దాతను స్క్రీనింగ్ చేసి పరీక్షిస్తారు.కాగా రక్త హీనతతో ఉన్నవారు రక్త దానం చేయరాదు. ఇప్పటికే చాలా మంది రక్త దానం చేశారు .శరీరంలో  రక్తం ఉన్నంత కాలం మనిషి   జీవించి ఉంటారు. ఎర్ర రక్త కణాలను 42 రోజులలో ఉపయోగించాలో . ప్లాటి లెట్లను 5 రోజుల్లో వాడాలి. రక్త దానం చేసిన తరువాత మరింత మండి రక్త దాతల కోసం ఎదురు చూడాల్సిందే ఇంకా చాలా మంది రక్త దాతల కోసం ఎదురు చూడాల్సిందే. ఇంకా చాలా మంది రక్త దాతల అవసరం ఉంది. నాణ్యత అర్హులైన రక్త దాతల సంఖ్య తక్కువగా నే ఉంటుంది. ప్రక్తి రక్త దాత చాలా సురక్షితంగా  స్క్రీన్ చేయాలి. ఇన్ఫెక్షన్లు ఇతర వ్యాధులు ఇతర పరిస్థితులు ఉన్న వారిలో రక్తం సరి పడక పోవచ్చు. ఇతరులకు ఇవ్వలేక పోవచ్చు. రోగుల అవసరాలు తీర్చేందుకు మరింత ఎక్కువ మంది రక్త దాతలు అవసరం.యు ఎస్ లో 1/3 వంతు మంది  మాత్రమే అర్హులైన రక్త దాతలు ఉన్నారు. బ్లడ్ బ్యాంకుల నుండి ఆయా గ్రూపులకు సంబందించిన రక్తాన్ని పొందవచ్చు .ఒక్కో సారి రక్త నిధి కేంద్రాల లో సరి పడ రక్త నిధి ఉండచ్చు లేదా సరి పడా నిల్వ ఉండక పోవచ్చు. మానవ సేవే మాధవ సేవ ఒక వ్యక్తికి రక్తదానం చేస్తే ఒక ప్రాణాన్ని కాపాడిన తృప్తి ఉంటుంది.మీరు రక్త దాతలు కండి ప్రాణాలు కాపాడండి.

By
en-us Political News

  
సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.