ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి.. ఆటో డ్రైవర్‌గా మారిన మహిళ.. సంపాదన తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Publish Date:May 30, 2026

Advertisement

 

ప్రస్తుత రోజుల్లో సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగం అంటే సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఐటీ కొలువు వస్తే జీవితం స్థిరపడినట్లేనని చాలా మంది భావిస్తారు. అయితే, అదే ఐటీ రంగానికి చెందిన ఒక మహిళ తన తొమ్మిదేళ్ల వైట్ కాలర్ ఉద్యోగానికి ఊహించని విధంగా గుడ్ బై చెప్పేసింది. సమాజం ఏమనుకుంటుందో అనే సంకోచాలు పెట్టుకోకుండా, పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉండే ఆటోమొబైల్ రంగాన్ని ఎంచుకుని ప్రస్తుతం ఆటో డ్రైవర్‌గా మారి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఈ ఆసక్తికరమైన సంఘటనకు సంబంధించిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఒక ప్రముఖ కంపెనీకి చెందిన సీఈఓ నెజ్రీన్‌ మిధ్లాజ్‌ తన ప్రయాణంలో భాగంగా ఈ మహిళా ఆటో డ్రైవర్‌ను కలిశారు. అమె కట్టుబొట్టు, మాట్లాడే విధానంలో కనిపించిన అపారమైన ఆత్మవిశ్వాసాన్ని చూసి ముచ్చటపడిన సదరు సీఈఓ, ఆమె విజయగాథను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

సాధారణంగా ఐటీ కంపెనీల్లో పని గంటలు, డెడ్‌లైన్లు, నిరంతర ఆన్‌లైన్ మీటింగ్‌ల వల్ల ఉద్యోగులపై మానసిక ఒత్తిడి తీవ్రంగా పెరుగుతోంది. ఈ మహిళ కూడా గత తొమ్మిది సంవత్సరాలుగా సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తూ అదే రకమైన కార్పొరేట్ ప్రెజర్‌ను ఎదుర్కొంది. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ పూర్తిగా దెబ్బతినడంతో, ఎంత డబ్బు సంపాదించినా మనశ్శాంతి కరువైందని భావించి ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టేయాలని గట్టి నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం ఆమె ఆటో నడుపుతూ నెలకు ఏకంగా రూ.60,000 వరకు సులభంగా సంపాదిస్తోంది. గతంలో కంటే ఆర్థికంగా స్థిరపడటమే కాకుండా, తన ఇష్టానుసారంగా పని వేళలను కేటాయించుకునే స్వేచ్ఛ దొరికిందని ఆమె సంతోషంగా చెప్తోంది. సమాజంలో లభించే హోదా కంటే మానసిక ప్రశాంతత, సంతోషకరమైన జీవితమే ముఖ్యమని భావించి ఆమె తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

కార్పొరేట్ ప్రపంచంలోని యాంత్రిక జీవన విధానంపై విసిగిపోయిన ఎంతో మంది ఐటీ ఉద్యోగులు ఈ పోస్టుకు స్పందిస్తూ తమ అభిప్రాయాలను రాసుకొస్తున్నారు. "తాము కూడా గత కొన్నేళ్లుగా రాత్రి వేళల్లో క్లయింట్ కాల్స్, ప్రొడక్షన్ సమస్యలతో సతమతమవుతున్నామని, అయితే ఈమె లాగా ధైర్యం చేసి బయటకు రాలేకపోతున్నామని" కొందరు నెటిజన్లు వాపోతున్నారు.

మరికొందరు మాత్రం, ఎలాంటి సంకోచం లేకుండా సమాజం ఏమనుకుంటుందో అనే భయాలను వీడి, గౌరవప్రదమైన రీతిలో స్వయం ఉపాధిని ఎంచుకున్న ఈ మహిళ నిజమైన రోల్ మోడల్ అని కొనిడుతున్నారు. రాబోయే రోజుల్లో మహిళలు కేవలం సాఫ్ట్‌వేర్ లేదా డెస్క్ ఉద్యోగాలకే పరిమితం కాకుండా, తమకు నచ్చిన రంగాల్లో స్వతంత్రంగా రాణించేందుకు ఇలాంటి విజయగాథలు గొప్ప స్ఫూర్తినిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

By
en-us Political News

  
వాహనం నడుపుతున్న అరుణ్ దృష్టి మొత్తం రోడ్డుపై కాకుండా మొబైల్ స్క్రీన్‌పై పడింది.ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి అత్యంత వేగంగా రోడ్డును దాటి పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది.
సీజన్ మొత్తం 776 పరుగులు సాధించి, ఐపీఎల్ చరిత్రలోనే ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. కేవలం పరుగులే కాదు, అతడు బంతిని బాదిన తీరు కూడా అమోఘం.
ఈ పెంపుతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై 42 పెరిగి, దాని ధర రూ. 3,113.50కి చేరింది. అయితే, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
టోర్నమెంట్‌లో అసాధారణమైన బ్యాటింగ్ నైపుణ్యంతో ఏకంగా 776 పరుగులు సాధించి, అత్యధిక పరుగుల బ్యాటర్ గా ప్రతిష్టాత్మక ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. అలాగే.. టోర్నీలోనే అత్యంత విలువైన ఆటగాడిగా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డుతో పాటు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ పురస్కారాన్ని కూడా వైభవ్‌ దక్కించుకున్నాడు.
దేశ భవిష్యత్తును మార్చే మీ ఓటు ఎంతో విలువైంది అంటూ ఈసీ ప్రజలకు సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చింది. ఈ ఆసక్తికరమైన పోస్టుకు రన్ మిషన్ విరాట్ కోహ్లీతో పాటు ఆర్సీబీ ఆటగాళ్లు ఐపీఎల్ ఛాంపియన్ ట్రోఫీతో ఎంతో ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటున్న ఫొటోను జత చేసింది.
బెంగళూరు మరోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈసారి కూడా కప్ మనదే అంటూ సామాజిక మాధ్యమ వేదికలో హర్షం వ్యక్తం చేశారు. వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్ గెలిచి ఆర్సీబీ చరిత్ర సృష్టించిందని పేర్కొన్న ఆయన పట్టుదల, దీక్ష, సంయమనంతో ఆడి నిజమైన ఛాంపియన్లలా నిలిచారన్నారు.
156 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా కోహ్లీ, తన మణికట్టు మాయాజాలంతో అద్భుతమైన ఫ్లిక్స్, పుల్ షాట్లతో కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. మరోవైపు, మోకాలి నొప్పితో బాధపడుతున్నప్పటికీ వెంకటేశ్ అయ్యర్ 16 బంతుల్లో 32 దూకుడుగా ఆడాడు.
తెలంగాణ ప్రభుత్వం మహిళలను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా ఆర్థికాభివృద్ధికి చోదకశక్తులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహించిన మహిళా వారోత్సవాలు ఘనంగా ముగిశాయి.
ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త రవాణా విప్లవానికి వేదిక కాబోతోంది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల అయిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ రేపటి నుంచే అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది.
ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లే శ్వర స్వామివారి దేవస్థానంలో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాల నాణ్యతపై ఆలయ ఈవో శీనా నాయక్ ఆదివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి తన రైతు మనసును చాటుకున్నారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి తీవ్రమైన ఉద్రిక్తతలకు వేదికగా మారాయి.
హైదరాబాద్ శివారులోని గండిపేట ప్రాంతంలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని నకిలీ పత్రాలతో కాజేసి విక్రయించేందుకు ప్రయత్నించిన భారీ భూ మోసాన్ని షేర్ లింగంపల్లి పోలీసులు ఛేదించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.