Publish Date:Apr 19, 2022
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వైకాపాలో రేపిన చిచ్చు ఇంకా చల్లారలేదు. ఒక జిల్లాలో అసమ్మతి జ్వాల ఒకింత తగ్గిందనుకుని జగన్ ఊపిరి పీల్చుకునే లోగానే మరో జిల్లాలో మరింత ప్రజ్వలంగా అసమ్మతి మంటలు ఎగసి పడుతున్నాయి. తాజాగా పాయకరావు పేట ఎమ్మెల్యే తాను సింహాన్నిఅంటూ అసమ్మతి గర్జన చేశారు. నేరుగా పార్టీ అధినేత జగన్ కే వార్నింగ్ ఇచ్చేశారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రి పదవి ఆశించినపాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు....ఉన్నట్టుండి పునవ్యవస్థీకరణ జరిగిన రెండు వారాల తరువాత అధిష్ఠానంపై అసమ్మతి బాంబు వేశారు.
తనకు మంత్రి పదవి దక్కకపోవడం అన్యాయమంటూ ఆక్రోశం వ్యక్తం చేసి ఊరుకోకుండా....నేరుగా జగన్ సలహాదారు సజ్జలపైనా...పరోక్షంగా జగన్ పైనా విమర్శనాస్త్రాలు సంధించారు. తనకు మంత్రి పదవి దక్కకుండా చేసిన వాళ్లను విడిచపెట్టననీ....మూమూలుగా తాను శాంతంగానే ఉంటా అయితే అది నాణేనికి రెండో వైపే అంటూ పార్టీకి హైకమాండ్ కు అంటే జగన్ కు ఘాటు వార్నింగ్ ఇచ్చారు. సమయం చూసి తాను కొట్టే దెబ్బకు మైండ్ బ్లాక్ అయిపోవడం ఖాయమని హెచ్చరించారు.
ఇప్పటి వరకూ మంత్రి పదవి దక్కని పలువురు వివిధ మార్గాలలో అసమ్మతి వ్యక్తం చేశారు. అయితే గొల్ల బాబూరావులా ఎవరూ నేరుగా జగన్ పై విమర్శల దాడి చేయలేదు. అసమ్మతిని సమర్ధంగా చల్లార్చామని జగన్, ఆయన అనుయాయులు భుజాలు చరుచుకుంటున్న సమయంలోనే ఉరుములేని పిడుగులా గొల్ల బాబూరావు ఘటు విమర్శలతో, తీవ్ర హెచ్చరికలతో విరుచుకుపడటం వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఆయనీ వ్యాఖ్యలు చేసింది జగన్ మైండ్ చైల్డ్ గా చెప్పుకునే వలంటీర్ వ్యవస్థకుసంబంధించిన కార్యక్రమంలో. ఆదర్శ వలంటీర్ సేవలకు పురస్కారా ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గొల్ల బాబూరావు....అదే వేదికపై నుంచి పార్టీ హైకమాండ్ పై, జగన్ పై విమర్శలు గుప్పించి, సవాళ్లు సంధించారు. వ్యాఖ్యలు చేశారు.
కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా తమకు అన్యాయం జరిగిందంటూ అసంతృప్తితో రగిలిపోతున్నా బయటపడటానికి జంకుతున్న పలువురు ఎమ్మెల్యేలకు గొల్ల బాబూరావు మార్గదర్శనం చేశారా అన్నచర్చ వైకాపాలో అంతర్గతంగా సాగుతోంది. గొల్ల బాబూరావు పిల్లి మెడలో గంట కట్టేశారనీ, ఇక ఎలుకల్లా భయపడాల్సిన పరిస్థితి ఎమ్మెల్యేలకు ఉండదనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/will-show-what-i-am-ycp-mla-warning-to-jagn-39-134608.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.