జగనే ఎందుకు?.. నిలదీస్తున్న జనం

Publish Date:Sep 30, 2023

Advertisement

 ప్రజల జ్ఞాపక శక్తి తక్కువే కావచ్చు. కానీ, నడుస్తున్న చరిత్రను, పడుతున్న కష్టాలను, కళ్ళ ముందు  కదులుతున్న అరాచక పాలను ప్రజలు మరిచి పోతారని ఎవరైనా అనుకుంటే అది పొరపాటే అవుతుంది. అంతే కాదు  అలా ఎవరైనా అనుకుంటే వారు అమాయకులు అవుతారు లేకుంటే అజ్ఞానులు అవుతారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రెంటిలో ఏ కోవలోకి వస్తారో  తెలియదు కానీ అయన మాత్రం అలాంటి భ్రమల్లో నే ఉన్నారని చెప్పక తప్పదు.  కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యాన్ని ఆయన చూడలేక పోతున్నారు.

నిజానికి నాలుగున్నరేళ్ళ జగన్ రెడ్డి పాలనలో  రాష్ట్రం అన్ని విధాలా అధోగతి పాలైంది. అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రాజధాని లేని రాష్ట్రంగా నవ్వుల పాలైంది. ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. ఈ అరాచక, అవినీతి పాలనను తట్టుకొనలేక   పెట్టుబడి దారులు పక్క రాష్టాలకు వెళ్లి పోతున్నారు. కొత్త పరిశ్రమలు రావడం లేదు. ఉద్యోగాలు లేవు .  ఇలా ఎటు చుసినా అష్టమ దిక్కే దర్శనమిస్తోంది. 

అవి చాలవన్నట్లు జగన్ రెడ్డి  కుట్ర పూరితంగా తెలుగుదేశం అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడంతో రాష్ట్రం అట్టుడికి పోతోంది.  చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ ... గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలుగు ప్రజలు నిరసన గళం వినిపిస్తున్నారు. జగన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇచ్చి తప్పు చేశామని ప్రజలు వాపోతున్నారు.  చెంపలేసుకుని మరీ చేసిన తప్పు  మళ్ళీ చేయమని ప్రతిజ్ఞ చేస్తున్నారు.

నిజానికి  చంద్రబాబు అరెస్ట్ కు ముందే రాష్ట్ర ప్రజలు  జగన్ రెడ్డి అరాచక అవినీతి పాలనకు స్వస్తి చెప్పాలనే  నిర్ణయానికి వచ్చేశారు.  ఇక చంద్ర బాబు అరెస్ట్ తర్వాత, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకాలంటే జగన్ రెడ్డిని ఓడించి సాగనంపడం ఒక్కటే మార్గమనే నిర్ణయాన్నిబహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా జనం రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. జగన్ రెడ్డి అరాచక పాలనకు ముగింపు పలికే శుభ ఘడియ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంత కాలం సంక్షేమం పేరుతో తమ వద్ద ముక్కుపిండి వసూలు చేసిన సొమ్మునే బటన్ నొక్కి తమకే పందేరం చేసిన జగన్ కు ఎన్నికలలో తామే బటన్ నొక్కి  సాగనంపేందుకు ఎదురు చూస్తున్నామని బాహాటంగానే చెబుతున్నారు.

 క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే  జగన్ రెడ్డి మాత్రం ఇంకా  పగటి కలలు  కంటున్నారు. ఇప్పటికీ వై నాట్ 175... భ్రమల్లోనే ఉన్నారు. నిజానికి  ఇంచు మించుగా ఏడాదికి పైగా సాగుతున్న గడప గడపకు వైస్పీ ప్రభుత్వం, నువ్వే మా నమ్మకం కార్యక్రమాల ద్వారా వైసీపీ ఎమ్మెల్యేలు ఇంటింటికీ వెళ్లి,  తలుపులు తడుతూనే ఉన్నారు. అయినా  ఫలితం లేదు. ప్రజలు చీత్కారాలు, చీవాట్లు భరించ లేక చాలా వరకు ఎమ్మెల్యేలు తూతూ మంత్రంగానే ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 

అయితే జగన్ రెడ్డి ప్రతి మూడు నాలుగు నెలకు ఒకసారి గడప గడపకు సమీక్ష పేరున, ఈ కార్యక్రమం ద్వారా ఏదో బ్రహ్మాండం జరిగిపోతోందనే భ్రమలు సృష్టిచే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాదు,  జగన్ రెడ్డి  తన చేతికి మట్టి అంటకుండా గడప గడప వ్యతిరేకతను ఎమ్మెల్యేల ఖాతాలో చేర్చి వారిని బలిపశువులను చేసేందుకు... గడపగడప నివేదికలను ఉపయోగించుకుంటున్నారు. 

తాజాగా రెండు రోజుల క్రితం మళ్ళీ  అదే క్రతువును కానిచ్చారు. యథాతధంగా, తన గొప్పలు తనే చెప్పుకున్నారు. తన భుజాలను తానే చరుచుకున్నారు. ఎమ్మెల్యేలకు హెచ్చరికలు చేశారు. ఇంతవరకు చేసింది ఒకెత్తు, రానున్న ఐదారు నెలలు నెలలు మరో ఎత్తు.రాబోయే రెండు నెలలు జనంలోనే ఉండాలంటూ ఎమ్మెల్యేలు పార్టీ నాయకులకు హుకుం జారీ చేశారు. అంతే కాదు. మళ్ళీ జగనే ..ఎందుకు కావలి? అనే ప్రచార కార్యక్రమాన్ని ప్రకటించారు. అయితే మళ్లీ జగన్ ఎందుకు వద్దంటే వంద కారణాలు చెప్పగలం, ఎందుకు కావాలంటే ఏమి చెపుతామని, వైసీపీ నేతలే సైటైర్లు వేస్తున్నారు. నిజానికి, ఇప్పటికే, ప్రజాదరణ పూర్తిగా కోల్పయిన జగన్ రెడ్డి ఎంత ప్రయత్నం చేసినా, ఇంటికి వెళ్ళడం ఖాయం అన్నదే జనవాక్యంగా వినిపిస్తోంది. అందుకే  జనం అవును జగన్  ఎందుకు ? వద్దే వద్దు అంటున్నారు . ఏపీకి జగన్ అవసరం లేదని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు.

By
en-us Political News

  
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
ప్రజాస్వామ్య విలువలతో కూడిన పాలనకు, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలాంటి అరమరికలూ లేకుండా మిత్రధర్మాన్ని తప్పకుండా నడపిన వాజ్ పేయి స్ఫూర్తిగా ముందుకు సాగాలన్న సంకేతాన్ని ఈ విగ్రహావిష్కరణ ద్వారా చంద్రబాబు ఇచ్చారని అంటున్నారు.
బెంగ‌ళూరు టు ఢిల్లీ అన్నట్లుగా ప్ర‌త్యేక ఎపిసోడ్లు న‌డిచాయి. రాహుల్ గాంధీ డీకేకి స్పెష‌ల్ మెసేజీలు పెట్టారు. క‌ట్ చేస్తే ఏదో అనుకుంటే ఏమీ కాలేదు అన్నట్లుగా క‌ర్ణాట‌క‌లో సీఎం మార్పు జరగలేదు. కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది.
2022 నవంబర్ లో అప్పటి వైసీపీ సర్కార్ రోడ్డు విస్తరణ పేరుతో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం అనే కుగ్రామంలో ఇళ్ల ను కూల్చివేసింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ గ్రామాన్ని సందర్శిస్తానని అప్పట్లో మాట ఇచ్చారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇంత కాలం వ్యతిరేకిస్తూ వచ్చిన లొంగిపోయిన మావోయిస్టు నేతలు ఇప్పుడు అదే వ్యవస్థ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకు తాజాగా మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల ఇక ఆయుధాలు చేపట్టబోమంటూ చేసిన ప్రకటనే సాక్ష్యంగా నిలుస్తోంది.
దానం విషయంలో మాత్రం ఆయన అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీలోకి దిగడంతో.. ఇవే కోర్టులో , అలాగే స్పీకర్ ఎదుట తిరుగులేని ఆధారాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత వేటు పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మొత్తం మీద ఆ కేసులో కీలక మలుపునకు ఈ పెన్ డ్రైవ్ ఆధారం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు. ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు సమర్పించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో 9 మంది అధికారులతో కలిసి ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
పార్టీ పగ్గాలు చేపట్టడానికీ, ప్రధాని మంత్రి పదవిని అధిష్టించడానికి కాంగ్రెస్ లో సమర్థత ఉన్న నేత తన సతీమణి ప్రియాంక వధేరా గాంధీ మాత్రమేనంటూ రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈ కార్యక్రమానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అలాగే వైఎస్ కుటుంబీకులంతా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలకు వైఎస్ తనయ వైఎస్ షర్మిల మాత్రం హాజరు కాలేదు.
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.