మీరే అండా దండా.. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులతో సమావేశానికి జగన్ సన్నాహాలు!

Publish Date:Sep 30, 2023

Advertisement

అప్పు చేసి బటన్ నొక్కి పప్పు బెల్లాలు పంచడమే పాలన అన్నట్లుగా గత నాలుగున్నరేళ్లుగా గడిపేసిన ముఖ్యమంత్రి జగన్ ను జనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు అధికారంలో ఉన్న  వైసీపీని పట్టించుకోను కూడా పట్టించుకోవడం లేదు.  పడకేసిన అభివృద్ధి, అసెంబ్లీ సాక్షిగా మంత్రులు చెప్పిన డైలాగులు, విపక్షంలో ఉన్నప్పుడు ఊరూరా తిరిగి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు, నవరత్నాల పేరిట పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాలను విస్మరించి, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్న పన్నులు, నానాటికీ దిగజారిపోతున్న   కొనుగోలు శక్తి.. ఇలా అన్నీ లెక్కలేసుకున్న ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.

దీంతో మీకు ఇచ్చిన ఒక్క చాన్సే ఎక్కువ.. ఇప్పటిదాకా మీరు నొక్కిన బటన్లు చాలు.. ఇక ఎన్నికలు రాగానే మేం బటన్ నొక్కి ఇంటికి పంపిస్తాం అంటూ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.  ప్రతిపక్ష నేతల పర్యటనలు, సభలలో ప్రజా స్పందనలోనూ ఇదే ప్రస్ఫుటంగా కనిపించింది. ఈ పరిస్థితిని గమనించిన జగన్ విపక్ష నేతలను తిరగనీయకుండా చేస్తే చాలని భావించారు. ఆ కారణంగానే   కక్షకట్టి తెలుగుదేశం అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయిం చారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నూ అరెస్టు చేయిద్దామనుకున్నా ఆయన కోర్టును ఆశ్రయించడంతో అది వీలు కాలేదు. ఇక చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ ప్రజలు నిరసనలకు దిగుతుంటే ఆంక్షలు విధించి  ప్రజా నిరసనాగ్రహాన్ని అణచివేయాలని చూశారు. దీంతో ప్రజలలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి.

దీంతో సీఎం జగన్ ఇప్పుడు ఎలా ముందుకెళ్లాలా అనే అంశంపై సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ ప్రతినిధులతో సమావేశమైన జగన్.. ఏపీకి జగనే ఎందుకు కావాలి? అంటూ ఓ కొత్త కార్యక్రమంతో ప్రజల వద్దకు వెళ్లాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా.. అలాగే సీఎం జగన్ స్వయంగా 4 వేల మంది  పార్టీ ద్వితీయ  శ్రేణి నేతలతో సమావేశం కావాలని ప్రణాళికలు రచించారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.  అక్టోబర్ లో ఈ సమావేశం జరిగే అవకాశాలున్నాయని అంటున్నారు.  పార్టీ అధిష్టానం నుండి ఇప్పటికే దీనిపై ఆదేశాలు కూడా వెళ్లాయని చెబుతున్నారు. మేథోమథనం సదస్సు పేరుతో అక్టోబర్ 9వ తేదీన విజయవాడలో  నిర్వహించనున్న ఈ సమావేశానికి నియోజకవర్గం, మండల స్ధాయి నేతలు హాజరవ్వబోతున్నారు. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల నుండి ద్వితీయ శ్రేణి నేతలను ఈ సమావేశానికి తరలించనున్నారట.

అభ్యర్థి ఎంతటివాడైనా,  పార్టీ తరపున అభ్యర్ధులు గెలవాలంటే ద్వితీయశ్రేణి నేతల మద్దతు చాలా అవసరం. వీరి అండ లేకుండా  పార్టీ అభ్యర్థుల గెలుపు సాధ్యం కాదు.  నగదు పంపిణీ నుండి కుల సమీకరణ ఆధారంగా ఓటర్లను పోగేయడం వరకూ అన్నీ ద్వితీయ శ్రేణి నేతల చేతుల మీదనే జరుగుతుంది. అందుకనే ఇలాంటి సుమారు 4 వేలమంది ద్వితీయ శ్రేణి నాయకులను నేతలను గుర్తించి ఈ సమావేశానికి పిలిచినట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. 2024 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలో సీఎం జగన్ ఈ సమావేశంలో ఈ 4 వేల మందికి వివరిస్తారని చెబుతున్నారు. అలాగే పనిలో పనిగా ఆయా  నియోజకవర్గాల్లో పార్టీ పరిస్ధితి, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు, ప్రజల అభిప్రాయం, అక్కడ ఈసారి పోటీచేసే   వారి విజయావకాశాలు ఇలా అన్ని విషయాల మీద జగన్ వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటారని చెబుతున్నారు.  ఈ నేపథ్యంలోనే ఈ సమావేశంపై వైసీపీ వర్గాలలో  ఆసక్తిగా వ్యక్తమౌతోంది.

నిజానికి వైసీపీలో ద్వితీయ శ్రేణి నాయకులంతా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి అనుయాయులూ  ఈ నాలుగేళ్లలో బాగానే వెనకేసుకున్నారనీ,  నియోజకవర్గాలలో ద్వితీయ శ్రేణి నాయకులుగా ఉన్న తాము మాత్రం తీవ్రంగా నష్టపోయామనీ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   ప్రభుత్వం వచ్చిన కొత్తలో చిన్నా చితకా పనులు చేసినా వాటి బిల్లులు మాత్రం ఇప్పటికీ పెండింగ్ లోనే ఉన్నాయి. ఆ తరువాత అప్పులమోతతో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు వెచ్చించే పరిస్థితులు లేకుండా పోయింది. ఎన్నికలకు ముందు పార్టీ కోసం భారీగా ఖర్చు పెట్టి అప్పులపాలైన నేతలు.. ప్రభుత్వం వచ్చాక ఏదొక పని  చేసుకుని నాలుగు రూపాయలు సంపాదించుకోవాలని చూసినా.. చెప్పుకొనేందుకు ఒక్క పని కూడా దక్కలేదు. చేసిన పనులకు బిల్లులూ రాలేదు. దీనికి తోడు  గ్రామ, మండల స్థాయి నేతలు తమకి అది కావాలి.. ఇది కావాలి అంటూ పలుమార్లు విన్నపాలు చేసుకున్నా నిధుల కొరతతో ఆ పనులు కూడా చేయలేకపోయారు. దీంతో ఇప్పుడు వారికి నియోజకవర్గాలలో తిరిగే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఆ ఫలితమే గడపగడపకు కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు నేరుగా తగిలిన నిరసన సెగలు అని చెబుతున్నారు.  ఈ నేపథ్యంలో  ఏపీకి మళ్లీ జగనే  కావాలో ప్రజలకు చెప్పమంటే ఏం చెప్పాలంటూ ద్వితీయ స్థాయి నేతలు వాపోతున్నారు. ఈ క్రమంలో అక్టోబర్ 9వ తేదీన సమావేశంలో జగన్ ఏం చెప్పనున్నారు? అందుకు నేతలు ఎలా స్పందించనున్నారన్నది ఆసక్తిగా మారింది.

By
en-us Political News

  
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.