ఇంతకూ అక్రమాస్తుల దోషులెవరు?
Publish Date:Sep 25, 2012
Advertisement
అక్రమాస్తులు, ఫెరా నిబంధనల ఉల్లంఘన వంటి కేసుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి చంచల్గూడా జైలులో ఉన్నారు. భారతీయశిక్షాస్మృతి ప్రకారం తప్పుఎవరు చేసినా దానికి సహకరించిన వారూ దోషులే. కానీ, ప్రస్తుత వాతావరణం చూస్తుంటే జగన్ మాత్రమే దోషి. మిగిలిన వారందరూ నిజాయితీపరుల్లా బొంకుతున్నారు. నేరుగా నేరం చేసినది జగన్, ఆయన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని ఈ కేసుల్లో దోషులు చెబుతుండటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంత పెద్ద నేరాలు చేయాలంటే సహకరించే పాత్రధారులూ ఎక్కువగా ఉంటారనేది జగమెరిగిన సత్యం. అయితే పాత్రధారులు మాత్రం తామేమీ చేయలేదని, తమకు తెలియకుండానే తప్పు జరిగిపోయిందని బొంకుతున్నారు. ప్రత్యేకించి ఎవరి మాట పరిశీలించినా అందరూ శ్రీవైష్ణవులే రొయ్యల బుట్టలో మాత్రం రొయ్యలు మాయమయ్యాయన్నట్లుంది పరిస్థితి. గతంలో మహిళా ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి మాటలు గుర్తు చేసుకుంటే తనపై ఒత్తిడి వల్లే ఇలా జరిగిందన్నారు. కనీసం ఆ తరహాలో కూడా మిగిలిన వారు మాట్లాడటం లేదు. తాజాగా దోషిగా సిబిఐ ప్రకటించిన మంత్రి ధర్మాన ప్రసాదరావు మాటలు గమనిస్తే తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఇదే విషయం రుజువు అవుతుందనే పూర్తి విశ్వాసం తనకుందని అన్నారు. న్యాయం పొందటానికి తనకున్న అన్ని అవకాశాలూ ఉపయోగించుకుంటానని తెలిపారు. తెలియక తప్పిదం, పొరపాటు కూడా చేయలేదని ధర్మాన నొక్కి చెబుతున్నారు. మరి తెలియక తప్పిదం చేయకపోతే వాన్పిక్ భూములు ఎలా విదేశీకంపెనీ, నిమ్మగడ్డ ప్రసాద్ పరమయ్యాయన్న రహస్యం మాత్రం అంతుబట్టడం లేదు. పోనీ, ఈ మంత్రి విచారణలో సహకరించేందుకు మానసికంగా సిద్ధమయ్యారా? అంటే అదీ అనుమానంగా కనిపిస్తోంది. ఎందుకంటే హైదరాబాద్లో రాజీనామా సమర్పించేసి ఢల్లీ పెద్దల ఒత్తిడితో, సిఎంను మెతకవైఖరి అవలంబించేలా చేసిన మేధావి కాబట్టి. ఇప్పటిదాకా ఏ మంత్రి ఇంత ఒత్తిడి సిఎంపై తీసుకురాలేదని పరిశీలకులూ అభిప్రాయపడుతున్నారు. ఏమైనా చివరికి జగన్ ఒక్కరే దోషిగా మిగిలే అవకాశం ఉంది అన్నట్లుంది ప్రస్తుత వాతావరణం.
http://www.teluguone.com/news/content/who-is-culprit-24-17658.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





