Publish Date:Jan 27, 2026
తెలంగాణలో సంచలనం సృష్టించిన, సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అత్యంత కీలకమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో రాధాకిషన్ రావు విచారణలో బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ నివాసం నుంచి చేతిరాతతో కూడిన చిట్టీలు వచ్చేవనీ, ఆ చిట్టీలలోని ఫోన్ నంబర్లను తాము ట్యాప్ చేసేవారమనీ వెల్లడించారు. దీంతో ఇప్పుడు ఆ చేతి రాత ఎవరిది అన్న చర్చకు తెరలేచింది.
అప్పటి సీఎం కేసీఆర్ కు అత్యంత వ్యవహరించిన సంతోష్ రావు చేతిరాతా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సిట్ కూడా ఇప్పుడు ఆయనను కూడా విచారించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రిటైర్డ్ ఐపీఎస్ ప్రభాకర్ రావును నిఘా విభాగం స్పెషల్ బ్రాంచ్ఇన్ ఛార్జ్ గా నియమించడంపైనా సిట్ ఆరా తీస్తోందంటున్నారు. ప్రత్యేకించి ఆయనకే ఈ బాధ్యతలు ఇవ్వడమేంటన్న దిశగా కూడా సిట్ దర్యాప్తు కొనసాగుతోందంటున్నారు. అత్యంత కీలకమైన పదవిని ఒక రిటైర్డ్ అధికారికి కట్టబెట్టడంలోని మతలబుపై సిట్ ఆరాతీస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక పోతే చిట్టీలలో చేతిరాత విషయం నిగ్గు తేల్చేందుకు బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారుల ఎదుట మంగళవారం (జనవరి 27) విచారణకు హాజరు కానున్నారు. ఈ మేరకు సంతోషరావుకు నోటీసులు జారీ అయ్యాయి..మంగళవారం (జనవరి 27) మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కు ఇటీవల సజ్జనార్ ని చీఫ్ గా నియమించిన సంగతి తెలిసిందే. సజ్జనార్ నియామకంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ఐపీఎస్ ని సిట్ ఇంచార్జ్ ని చేయడమేంటని ప్రవీణ్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో సిట్ ఆయనకు కూడా నోటీసులు ఇచ్చింది. దీంతో ప్రవీణ్ యూటర్న్ తీస్కున్నారు.
అదలా ఉంటేఇటు మాజీ మంత్రి హరీష్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను కూడా ఇటీవల సిట్ విచారించింది. ఇక ఇపుడు సంతోష్ రావు వంతు వచ్చిందంటున్నారు. అదలా ఉంచితే.. బీఆర్ఎస్ కూడా ఫోన్ ట్యాపింగ్ జరగలేదని అనడం లేదు. ఫోన్ ట్యాపింగ్ అన్నది సర్వసాధారణమనీ, అదేం పెద్ద నేరం కాదనీ అంటున్నది. కేటీఆర్ అయితే ఒక అడుగు ముందుకు వేసి ఫోన్ ట్యాపింగ్ అన్నది పోలీస్ డిపార్ట్ మెంట్ విధి నిర్వహణలో ఒక భాగం అన్నారు. ఇక ప్రస్తుతానికి వస్తే.. చేతిరాత చిట్టీల వెనుక ఉన్నది సంతోషేనా? అసలు దీని వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి? అన్న ఆసక్తి, ఉత్కంఠ సర్వత్రా వ్యక్తం అవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/who-is-behind-han-written-slips-39-213040.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.