Publish Date:Jan 26, 2026
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థిగా మారారు. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలోని కెన్నడీ స్కూల్ ఆప్ గవర్నమెంట్ లో రేవంత్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ తరగతులకు హాజరయ్యారు. అమెరికాలో తీవ్ర శీతాకాల పరిస్థితులు నెలకొన్నప్పటికీ, మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత లను లెక్కచేయకుండా ఆయన తరగతులకు హాజరై శిక్షణ తీసుకుంటున్నారు. ఓరియంటేషన్ సెషన్తో పాటు వివిధ దేశా లకు చెందిన ప్రతినిధులతో కోహార్ట్ పరిచయ కార్యక్రమం లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పరిపాలన, విధాన నిర్ణయాలు, నాయకత్వ రంగాల్లో అనుభవం కలిగిన వారితో కలిసి ఈ శిక్షణలో రేవంత్ భాగ స్వామి కావడం ప్రత్యేకతగా నిలిచింది.
లీడర్షిప్ ఇన్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ పేరుతో నిర్వహి స్తున్న ఈ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్లో తొలి రోజు అనలైజింగ్ అథారిటీ అండ్ లీడర్షిప్ అనే అంశంపై చర్చ జరిగింది. ఆధునిక పాలన లో అధికార వినియోగం, ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ సవాళ్లపై నిపుణులు క్లాస్ తీసుకున్నారు. ఒక రెండో రెజైన సోమవారం ( జనవరి 26) కేస్ స్టడీస్పై లోతైన విశ్లేషణ, చిన్న గ్రూపులుగా విభజించి నిర్వహించిన కన్సల్టేటివ్ వర్క్ సెషన్లలో సీఎం రేవంత్ రెడ్డి చురుకుగా పాల్గొ న్నారు. గవర్నెన్స్, పాలసీ అమలు, ప్రజలతో అనుసంధానం వంటి అంశాలపై అనుభవాలను పంచుకుంటూ శిక్షణ తీసుకున్నారు. ఇదిలా ఉండగా, బోస్టన్, కేంబ్రిడ్జ్ పరిసర ప్రాంతాలు తీవ్ర మంచు తుఫాన్ ప్రభావంతో అతలాకు తలమయ్యాయి.
భారీ మంచు తుఫాన్ కారణంగా రెండు అడుగు లకుపైగా మంచు కురిసింది. ఉష్ణోగ్రతలు మైనస్ 20 డిగ్రీల సెల్సియస్కు పడిపోవడంతో అక్కడి అధికారులు వింటర్ ఎమర్జెన్సీని ప్రకటించారు. రహదారులు మంచుతో కప్పుకుపోవడంతో అధికారులు అప్రమత్తమై ప్రజలు అత్యవసర ప్రయాణాలు మినహా బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఈ తీవ్ర వాతావరణ పరిస్థితుల మధ్య కూడా రేవంత్ రెడ్డి శిక్షణ కార్యక్రమానికి హాజరు కావడం విశేషం. అంతర్జాతీయ స్థాయిలో నాయకత్వ పాఠాలను తెలుసుకుని, వాటిని తెలంగాణ పాలనలో అమలు చేయా లనే దృక్పథంతో ఈ శిక్షణలో ఆయన పాల్గొంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/stufent-revanth-reddy-39-213037.html
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు.
నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.
జగన్ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా 198 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ ఇస్తే, వాటిలో 102 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయని గుర్తుచేశారు.
వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా, బూతుల నానిగా అనితర సాధ్యమైన గుర్తింపు ఉన్న కొడాలి నాని, 2024 ఎన్నికలలో వైసీపీ పరాజయం, గుడివాడ నియోజకవర్గంలో తాను స్వయంగా ఓడిపోవడంతో వెనక్కు తగ్గారు. కేసుల భయంతో మౌనాన్ని ఆశ్రయించారు. అసలు రాజకీయాలలో ఉన్నారా లేరా అన్నంతగా సైలెంట్ అయిపోయారు.
జగన్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వచ్చి అత్యధికంగా బెంగళూరులోనే మకాం ఉంటుండం ఒక కారణమైతే.. రాష్ట్రానికి, సొంత జిల్లాకు వచ్చినప్పుడు కూడా కార్యకర్తలు, నాయకులకు అప్పాయింట్ మెంట్ దొరకని పరిస్థితి మరో కారణంగా చెబుతుంటారు. ముఖ్యంగా జగన్ అందుబాటులో లేకపోవడం ప్రభావం ఆయన సొంత జిల్లా కడపలో మరీ తీవ్రంగా ఉంది.
కవిత సైతం తన వల్ల పార్టీ ఎలా ఓడిపోయిందని ప్రకటించి చేతులు దులుపుకోవడం కాదు.. అందుకు సంబంధించి వివరణ ఇవ్వాలనీ, లెక్కలు తేల్చాలనీ డిమాండ్ చేయడం ద్వారా మొత్తం బీఆర్ఎస్ నే డిఫెన్స్ లో పడేశారు. దాని నుంచి బయటపడడానికి ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ రంగంలోకి దిగి.. అప్పటి కేటీఆర్, కేసీఆర్ ల ప్రసంగాలు, ప్రకటనలను రీ పోస్టు చేస్తూ హడావుడి చేస్తున్నది.
తుమ్మల నాగేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఐదు రోజుల కిందట దుబాయ్ వెళ్లారు. మంత్రి కుటుంబ సభ్యులలో ఒకరు అనారోగ్యంతో ఉండటంతో మెరుగైన చికిత్స అందించడం కోసం ఆయన దుబాయ్కు వెళ్లినట్లు సమాచారం. చికిత్స అనంతరం తిరిగి రావాలని భావిస్తున్న తరుణంలో పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చి, ఆ ప్రభావంతో దుబాయ్ విమానాశ్రయం మూతపడింది.