తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎవరు...? టిఆర్ఎస్ అధినేత మదిలో ఈపాటికే ఖరారు!

Publish Date:May 17, 2022

Advertisement

తెలంగాణలో రాజ్యసభ ఎవరిని వరించబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రముఖుల పేర్లు తెరమీదికి వచ్చినా... టిఆర్ఎస్ అధిష్టానం ద‌ృష్టిలో మాత్రం ఈ పాటికే జాబితా సిద్దమైందనే చర్చ జరిగుతుంది. మిగతా వన్నీ వదంతుల షికార్లేనన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. అయితే, రాజకీయ వర్గాల్లోనూ, సాధారణ ప్రజల్లోనూ టిఆర్ఎస్ అధిష్టానం దృష్టిలో మాత్రం ప్రముఖంగా వినిపిస్తున పేర్లు  దామోదర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రకాష్ రాజ్. అయితే, మరి కొందరి పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. హెటిరో అధినేత పార్థశారథి రెడ్డి, పిఎల్ శ్రీనివాస్ పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఇదిలా ఉండగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రం రాజ్యసభకు వెళ్ళడానికన్నా ప్రత్యక్ష ఎన్నికలకే అధికంగా మొగ్గుచూపుతున్నారనేది పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నది. కేవలం రెండేండ్లు ఉండే రాజ్యసభకు వెళ్ళడానికి బదులుగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి ఐదేండ్లు పదవిలో ఉండటానికే అధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు సమాచారం. ఇటీవల టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటి రామారావుతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశంలో ఇదే విషయం ప్రస్తావనకు వచ్చినట్టు కూడా శ్రీనివాస్ రెడ్డి మద్దతుదారుల అభిప్రాయం. పారిశ్రామిక వర్గాల మద్దతును కూడగట్టడంలో భాగంగా పారిశ్రామిక రంగానికి చెందిన  ప్రముఖ హెటిరో సంస్థ అధినేత పార్థసారథి రెడ్డిని కూడా రాజ్యసభకు పంపించాలనే యోచన గులాబీ బాస్ మదిలో ఉన్నట్టు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నది. దీనికి తోడు ఆర్జీఆర్ సిద్దాంతి విద్యాసంస్థల అధినేత పిఎల్ శ్రీనివాస్ కు కూడా అవకాశం ఇవ్వలనేది కూడా ఒక ఆలోచన ఉన్నదనేది సీనియర్లలో మాటల్లో నానుతున్నది. 

గతంలో ఎమ్మెల్సీ, రాజ్యసభకు ఎంపికలు ఎలా ఉన్నా.. ఈ మారు మాత్రం సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకుని రాజ్యసభకు పంపించే వారి జాబితాను టిఆర్ఎస్  అధినేత సిద్దం చేసినట్టు చర్చ జరుగుతుంది. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన వారిని ఒకరికి రాజ్యసభకు అవకాశం కల్పించాలనేది గట్టిగా సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వాల్లోనూ సినీ పరిశ్రమలోని వారికి అడపాదడపా పదవులు వచ్చేవి. ఎందుకంటే టి. సుబ్బరామిరెడ్డి, మురళీమోహన్, రావు గోపపాల రావు, మోహన్ బాబు, శారద, జమున, జయప్రద, రోజా, దాసరి నారాయణరావు, కృ‌ష్టంరాజు, బాబూమోహన్ ఇలా చాలామందే రాజ్యసభకు, ఎమ్మెల్సీగా నియమితులైన సందర్భాలున్నాయి. నేటికీ ఇతర రాష్ట్రాల్లో ఇది కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి కూడా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన వారిని రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ను రాజ్యసభకు పంపిస్తున్నారనేది దాదాపు ఖాయమని ప్రచారం జరుగుతున్నది.  అయితే, టిఆర్ఎస్ ఓటు బ్యాంక్ గా మారుతున్న దళితులు, మైనార్టీలలో దళిత వర్గానికి కూడా ప్రాతినిథ్యం కల్పించాలా..? వద్దా..? అనేది కూడా కెసిఆర్ యోచనలో ఉన్నట్టు తెలిసింది. ఈ వర్గం నుంచి అవకాశం కల్పిస్తే మాత్రం మాజీ మంత్రి మొత్కుపల్లి నర్సింహులు, లేదా మాజీ ఎంపి మంధా జగన్నాథంకు అవకాశం ఇవ్వచ్చనేది చర్చ జరుగుతోంది. బిసి వర్గాల నుంచి పిఎల్ శ్రీనివాస్ పేరు వినిపిస్తున్నా.. ఈ మారు అవకాశం రాకపోవచ్చనేది తెలుస్తుంది. ఓసి వర్గానికి చెందిన దివకొండ దామోదర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బ్రాహ్మణ కోటాలో సిఎల్ రాజాం, కెప్టెన్ లక్ష్మీకాంతరావు పేర్లు కూడా ఉన్నాయి. అయితే, తుది జాబితాలో మాత్రం దామోదర్ రావు పేరు ఖాయమని తెలుస్తుంది. ఇక శ్రీనివాస్ రెడ్డి పైన కూడా బిజెపిలోకి చేరుతారనే ప్రచారం ఉన్నందున పార్టీ అతడిని నిలువరించేందుకు రాజ్యసభ సీటును కట్టబెడతారనేది బలంగా వినిపిస్తున్నది.

ఇటీవల రాజ్యసభలో తెలంగాణ నుంచి మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. అందులో బండ్ల ప్రకాశ్, డి. శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావులు ఉన్నారు. అయితే, బండ్ల ప్రకాశ్ స్థానాన్ని భర్తీచేసేందుకు  మే 19 నామినేషన్లకు తుదిగడువుగా ఉన్నది. డి శ్రీనివాస్, కెప్టెల్ లక్ష్మీకాంతరావు స్థానాల్ని భర్తీ చేయడానికి మే 31వ తేదీ నామినేషన్లకు ఆఖరు గడువుగా ఉన్నది. ఈ నేపథ్యంలో రాజ్యసభకు బండ్ల ప్రకాశ్ స్థానంలో పంపించే అభ్యర్థి  ఎవరన్నది బుధవారం  ఖరారు కానున్నది. ఇక డి శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు స్థానాల్ని భర్తీ చేసేందుకు మే 31 నామినేషన్లకు చివరితేదీగా ఉంది. మే 30వ తేదీ వరకు వీటికి గడువు ఉన్నందు ముందుగా బండ్ల ప్రకాశ్ స్థానంలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ను పంపించే అవకాశాలు లేకపోలేదు. మిగతా రెండింటికి దామోదర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లేదా మరో నేతను పార్టీ అధిష్టానం నిర్ణయించనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నేడు అంటే 18వ తేదీన రాజ్యసభకు ఎవరు వెళ్తారనేది తేలే అవకాశాలు లేకపోలేదు.

By
en-us Political News

  
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.