ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ ఏమయ్యారు?

Publish Date:Dec 24, 2019

Advertisement

ఎన్నికల ముందు వరకు టిడిపిలో ఉన్న తిరుపతి ఎంపి బల్లి దుర్గా ప్రసాద్ ఫలితాలు ఊహించి వైసీపీ లోకి జంప్ చేశారు. ఇలా వచ్చారో లేదో అలా సీటు దక్కడం ఇలా భారీ మెజార్టీతో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి పై గెలిచి బంపర్ ఆఫర్ కొట్టేశారు. ఊహించని విధంగా ఎంపికైన దుర్గా ప్రసాద్ నియోజక వర్గ ప్రజలకు కనిపించకుండా పోయారు. ఆయన ఎప్పుడు వస్తున్నారో ఎక్కడ ఉంటున్నారో సొంత పార్టీ నేతలకు కూడా అర్థం కావడం లేదు. నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన ఈయన తిరుపతి ఎంపిగా గెలిచాక కూడా గూడూరుకే పరిమితమయ్యారు. అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెడతారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే సమావేశాలు, రిబ్బన్ కటింగులలో తప్ప ఎంపీ కనిపించడం లేదు. ఎంపీకి సమస్యలు చెప్పుకుందామనుకునే ప్రజల సంగతి దేవుడెరుగు, కనీసం కార్యకర్తలకు కూడా బల్లి అందుబాటులో లేకుండా పోయారు. ఏదైనా అందామా అంటే పార్టీలోకి కొత్తగా వచ్చిన వ్యక్తి కావడంతో ఎవరు ఏమి చేయలేకపోతున్నారు. పార్టీ హైకమాండ్ కు చెప్పుకుందామంటే అది ఎవరో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు వైసిపి తిరుపతి నియోజక వర్గ కేడర్. కనీసం ఎంపీకి సంబంధించినవారైనా ఉన్నారా అంటే అది లేకుండా పోయింది. ఎంపీని కలవాలంటే ఎవరిని అడగాలో కూడా తెలియని పరిస్థితి వచ్చిందని నగరవాసుల్లోనూ చర్చ నడుస్తోంది.  ఇక ఎంపీని కలవాలని నియోజక వర్గ ప్రజలు అడిగితే కుమ్మరోడికి కుండలు కరువ అన్న రీతిలో తమకే దర్శనభాగ్యానికి దిక్కులేదని సొంత పార్టీ కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేతలు. 

నెలకో రెండు నెలలకో ప్రెస్ మీట్ లో తప్ప మరెక్కడా కనిపించని ఎంపి బల్లి దుర్గా ప్రసాద్ తీరు పై తిరుపతి ప్రజలు గుర్రుగా ఉన్నారని సమాచారం. గెలిచాకే కాదు ఎన్నికల ప్రచారంలో కొన్ని ప్రాంతాల వారికి కనీసం మొహం కూడా చూపించలేదు దుర్గా ప్రసాద్. పార్లమెంట్ నియోజక వర్గంలో కీలకమైన తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తిలో ఎక్కడ బల్లి ప్రచారం చేసిన దాఖలాలు లేవు. గెలిచాకైనా మారతారు అనుకుంటే బల్లి దుర్గా ప్రసాద్ తీరులో మాత్రం మార్పు రాలేదు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా రైల్వే స్టేషన్ తనిఖీలు, ఆసుపత్రి తనిఖీ అంటూ హడావుడి చేయడం తప్ప నగర వాసుల సమస్యలు పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఎమ్మెల్యే భూమనతో ఉన్న భేదాభిప్రాయాల కారణం గానే బల్లి తిరుపతి మొహం చూడటం లేదని తెలుస్తోంది. ఏది ఏమైనా ఎన్నికల్లో గెలిచాక తిరుపతి వాసులకు వెంకన్న దర్శనం అయినా దొరుకుతుందేమో గానీ ఎంపీగారి దర్శనం అంతంత మాత్రమే అనే చర్చ జోరుగానే సాగుతోంది. పరిస్థితి ఇలానే ఉంటే నియోజక వర్గం ప్రజల్లో అది తీవ్ర అసంతృప్తికి కారణమవుతుందని అంటున్నారు. ఇక ఆ ఎఫెక్ట్ పార్టీ పై పడుతుందని తిరుపతి వైసీపీలో ప్రచారం జరుగుతోంది. ఎంపీగారి దర్శనం ప్రజలకు ఏ మేరకు అందుతుందో చూడాలి.

By
en-us Political News

  
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.