Publish Date:May 22, 2023
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆంధ్రప్రదేశ్ మీద చాలా హోప్స్ పెట్టుకుంది. తెలంగాణలో పార్టీ కమిటీలను ఏర్పాటు చేయకముందే ఏపీ శాఖకు అధ్యక్షుడిని ఎంపిక చేసింది. అక్కడి నుంచి బీఆర్ఎస్ లో చేరికలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడమే కాకుండా..అలా చేరేవారికి వాహనాలు ఏర్పాటు చేసి మరీ హైదరాబాద్ కు తోలుకు వచ్చింది.
నగరమంతటా వారికి స్వాగతం చెబుతూ ఫ్లెక్సీలూ ఏర్పాటు చేసింది. అంతే కాదు ఏపీలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం. విశాఖ స్టీల్ ప్రైవేటుపరం కాకుండా బీఆర్ఎస్ అడ్డుకుంటుంది.. బిడ్ వేసి అవసరమైతే ఫ్యాక్టరీని సొంతం చేసుకుంటుందంటూ చాలా చాలా కబుర్లు చెప్పింది. అంతే ఆ తరువాత ఏపీలోని బీఆర్ఎస్ శాఖ అసలు ఉందో లేదో తెలియనంతగా సైలెంట్ అయిపోయింది. ఎంతా ఆర్భాటంగా విశాఖ స్టీల్ బిడ్ లో పాల్గొంటామంటూ సింగరేణి అధికారులను పంపి పరిశీలించిన తరువాత ఏమైందో ఏమో మిన్నకుండిపోయింది. దాంతో ఏపీలో బీఆర్ఎస్ పట్ల భ్రమలు.. ఏమైనా ఉంటే అవి పూర్తిగా అడుగంటిపోయాయి.
అలాగే ఏపీ సీఎం జగన్ది అప్పుల ప్రభుత్వం. కేసీఆర్ సంక్షేమ-అభివృద్ధి ప్రభుత్వాన్ని చూసి జగన్ చాలా నేర్చుకోవాలి అంటూ ఏపీ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, అనేక సందర్భాల్లో విమర్శలు చేశారు. ఇక తెలంగాణ మంత్రులు కూడా అవకాశం ఉన్నా లేకపోయినా.. సందర్భం ఉన్నా లేకపోయినా ఏపీ అభివృద్ధి లేమి గురిచి విమర్శలూ వ్యాఖ్యలూ చేశారు. అవన్నీ పక్కన పెడితే ఇంతని అంతని గుంటూరులో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి కేసీఆర్ వస్తున్నారంటూ బిల్డప్ ఇచ్చారు. హడావుడీ, హంగామా చేశారు.
చివరకు ఆ కార్యాలయ ప్రారంభ కార్యక్రమం ఎవరికీ పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడుస్తోంది అన్న చందంగా ఎవరికీ పట్టని ఒకె ప్రైవేటు కార్యక్రమంగా చప్పగా సాగిపోయింది. కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని చేసిన ప్రచారమూ ఉత్తుత్తిదేనని తేలిపోయింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/where-is-brs-in-ap-25-155735.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.