నేతల బూతులపై యాక్షన్ ఏదీ?

Publish Date:Feb 20, 2026

Advertisement

వాస్తవ వేదిక తాజా ఎపిసోడ్ లో ఏపీ రాజకీయాల్లో  మారుతున్న పరిణామాలు, నాయకుల దిగజారుడు భాష,   ఎన్టీఆర్, వైఎస్ వంటి నేతల హుందాతనం గురించి  తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజా వాస్తవ వేదికలో విశ్లేషణాత్మక చర్చ జరిపారు.  
రాజకీయాల్లో నానాటికీ తీసికట్టుగా మారుతున్న సంస్కారంపై డోలేంద్ర ప్రసాద్  గుర్రానికి, గాడిదకి తేడా ఏంటి? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏపీలో గత జగన్ పాలనలో  చోటుచేసుకున్న పరిణామాలు, భాషా ప్రయోగం, రాజకీయాలలో హుందాతనాన్ని తిరిగి తీసుకురావడంలో  ప్రస్తుత ప్రభుత్వ బాధ్యతలపై పలు సూచనలు చేశారు.  

రాజకీయాల్లో బూతు భాషా ప్రయోగం జగన్ రాజకీయ ప్రవేశం చేసిన తర్వాతే పరాకాష్టకు చేరిందన్నారు. గతంలో రోశయ్య, కేసీఆర్ వంటి వారు ఘాటు విమర్శలు చేసినప్పటికీ భాష పరంగా ఎక్కడా దిగజారలేదనీ, అనుచిత పదప్రయోగం చేయాలేదనీ గుర్తు చేశారు.  ఇక జగన్ హయాంలో కొడాలి నాని, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ వంటి వారు  వైసీపీ ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్టులను చదివేవారనీ,  వారు  జగన్ నిలబెట్టిన బొమ్మలు  లేదా  రోబోల వంటి వారు మాత్రమేననీ డోలేంద్ర ప్రసాద్ అన్నారు.  అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు సతీమణిని వైసీపీయులు అవమానించడం వంటి ఘటనలు వైసీపీకి రాజకీయంగా పెద్ద నష్టాన్ని చేకూర్చాయని, ఒక స్త్రీని అవమానిస్తే ఎవరికైనా సరే రాజకీయంగా పుట్టగతులుండవన్నారు.  జగన్ హయాంలో  జరిగిన అరాచకాలు, దాడుల వల్ల విసిగిపోయిన ప్రజలు చంద్రబాబుకు అధికారం ఇచ్చారన్నారు. 

 వైసీపీ నాయకుల ఇళ్లపై  టీడీపీ కార్యకర్తలు దాడులు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. జగన్ పరిపాలనలో దాడులు జరగడం సాధారణం, కానీ చంద్రబాబు ప్రభుత్వంలో అలా జరగకూడదని హెచ్చరించారు. గాడిదకీ, గుర్రానికీ తేడా ఉంది కదా అన్నారు.  వైసీపీ చేసే అరాచకాలనే టీడీపీ కూడా చేస్తే, గుర్రానికి (టీడీపీ)  గాడిద (వైసీపీ) తేడా లేకుండా పోతుందని డోలేంద్ర ప్రసాద్ అన్నారు.  
జగన్ తన ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగ్ లేదా చంద్రబాబు అబద్ధాలు కారణమని నమ్ముతున్నారే తప్ప, తన అరాచక పరిపాలన వల్ల ప్రజలు ఓడించారని అంగీకరించడంలేదన్న ఆయన   జగన్ తన పుట్టుకతో వచ్చిన స్వభావాన్ని మార్చుకోలేరని, ఆయన పద్ధతి మారకపోతే వైసీపీ గ్రాఫ్ పతనం నుంచి పతనానికి దిగజారుతూనే ఉంటుందని విశ్లేషించారు.  అదే సమయంలో ఆయన అధికార తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి కూడా కొన్ని సూచనలు చేశారు.   ప్రత్యర్థులపై దాడులు కాదు చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు.   బూతులు తిట్టే నాయకులకు కోర్టుల ద్వారా శిక్ష పడేలా చేయాలని చెప్పారు. రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్ష పడిన ఉదాహరణను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

 రాజకీయ సభలు పెట్టి, వైసీపీ నాయకుల భాషా సంస్కృతిని ప్రజలకు వివరించాలని, రాజకీయాల్లో మేధావులను తిరిగి ఆహ్వానించాలనీ, అలాగే..  టీడీపీ తన పాత పద్ధతిలో కార్యకర్తలతో మమేకం కావాలని, ఎవరో తెలియని  బ్రోకర్ల'మాటలు విని నిర్ణయాలు తీసుకోవడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని సూచనలాంటి హెచ్చరిక సున్నితంగా చేశారు. రాజకీయాల్లో శాంతిభద్రతలు, సభ్యత, సంస్కారం, అభివృద్ధిని ఆశించి ప్రజలు చంద్రబాబును ఎంచుకున్నారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉందనీ డోలేంద్ర ప్రసాద్ చెప్పారు.

వాస్తవ వేదిక పూర్తి ఎపిసోడ్ ను తెలుగువన్ యూట్యూబ్ చానల్ లో ఈ కింది లింక్ ద్వారా చూడండి.

 

By
en-us Political News

  
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.