మంత్రిగా ఉంటూ ఈ చిల్లర చేష్టలేంటి రోజా మేడమ్?

Publish Date:Oct 18, 2022

Advertisement

‘వేసిన రాయినల్లా ఒప్పుకుంటే.. వెర్రోడే గెలిచాడని’ సామెత ఒకటి ఉంది. అంటే.. ఆ మాదిరిగా ఉంది ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా తీరు అని పలువురు రాజకీయ నేతలు, ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.  విశాఖపట్నం విమానాశ్రయంలో రోజా ప్రవర్తించిన తీరుతో అనేక మంది ఆమెపై  అగ్గిమిద గుగ్గిలం అవుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ ఎయిర్ పోర్టుకు వస్తున్న సందర్భంగా ఆయనకు అఖండ స్వాగతం పలికేందుకు వచ్చిన జనసేన శ్రేణులు, నేతలను రెచ్చగొట్టే విధంగా మంత్రి రోజా ‘వేలు’ చూపించడంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. మంత్రై ఉండీ అలాంటి చిల్లర చేష్టలేమిటని ప్రశ్నిస్తున్నారు.

అమరావతే ఏకైక రాజధాని అన్న  డిమాండ్ తో ఆ ప్రాంత రైతులు అమరావతి టూ అరసవిల్లి మహా పాదయాత్ర ఉత్తరాంధ్రకు సమీపిస్తున్న క్రమంలో ‘విశాఖ గర్జన’ పేరుతో అధికార వైసీపీ ఆధ్వర్యంలో నాన్ పొలిటికల్ జేఏసీ పేరుతో శనివారం (అక్టోబర్ 15) జరిగిన కార్యక్రమంలో ఆ గర్జనలో మంత్రి రోజాతో సహా పలువురు ఇతర మంత్రుల, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలను అమరావతి రైతులపై రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేశారు. ఆ తర్వాత తిరిగి వెళ్లేందుకు రోజా సహా వైసీపీ నేతలు, కొందరు మంత్రులు కూడా విశాఖ విమానాశ్రయానికి వెళ్లారు.

అదే సమయంలో ఉత్తరాంధ్రలో మూడు రోజుల పర్యటన కోసం, ‘జనవాణి’ కార్యక్రమం నిర్వహించేందుకు వస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ను స్వాగతించేందుకు జనసేన నేతలు, శ్రేణులు ఇసుక వేస్తే రాలనంత సంఖ్యలో ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఆ సందర్భంగా ఎయిర్ పోర్టు ఆవరణలో రోజా తన వేలు చూపిస్తూ వారిని రెచ్చగొట్టారు. దాంతో జనసైనికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకోవడం.. మంత్రులకు, వైసీపీకీ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది. ఆ సందర్భంగానే మంత్రుల కార్లపై దాడి జరిగింది.

మంత్రులు విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చేటపుడు తాను అక్కడే ఉన్నానని, జనసేన నేతలు, కార్యకర్తలు హుందాగా వ్యవహరించారని టీడీపీ నేత బుద్దా వెంకన్న మంగళవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. జనసైనికులకు మంత్రి రోజా వేలు చూపించారు. వేలు చూపించడానికి అర్థం ఏమిటో రోజాయే చెప్పాలి అని బుద్దా వెంకన్న అన్నారు. ఇటు జనసైనికులు కూడా రోజా వ్యవహరించిన తీరుపై కారాలు మిరియాలు నూరుతున్నారు. రోజా మరీ  హద్దుమీరి  వ్యవహరిస్తున్నారంటూ ఫైరవుతున్నారు. రోజా వేలు చూపించిన వీడియో క్లిప్పింగ్ చూసిన పలువురు ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఓ మహిళ అయి ఉండీ, పైగా మంత్రి పదవిలో ఉండీ ఆమె అటువంటి చేష్టలకు పాల్పడటాన్ని తప్పుపడుతున్నారు.  

రోజా ఇలా అసభ్యంగా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదని జనం గుర్తుచేసుకుంటున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. అప్పటి సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. అప్పటి మంత్రి పీతల సుజాతపైన కూడా ‘వడ్డాణం’ అంటూ ఆమె ప్రదర్శించిన హావభావాలు చూసిన ప్రతి ఒక్కరూ తప్పుపట్టారు. అలాగే అసెంబ్లీలోనే  టీడీపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి వైపు చూస్తూ  ‘… కోస్తా’ అంటూ ఆమె చేసిన విన్యాసం కూడా పలువురిని విస్మయా నికి గురిచేసింది.   మంత్రి పదవి  చేపట్టిన తరువాత  అయినా హుందాగా ప్రవర్తించకుండా ఇలాంటి చిల్లర చేష్టలకు పాల్పడుతుండాన్ని జనం అసహ్యించుకుంటున్నారు. రోజాకు ఇప్పటికైనా కాస్త ఇంగితం వస్తే బాగుండు అని వ్యాఖ్యానిస్తున్నారు.

By
en-us Political News

  
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు. ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.