ఇంతకీ నూతన పార్లమెంట్ భవనం పేరేంటి?

Publish Date:May 26, 2023

Advertisement

అత్యాధునిక సదుపాయాలతో, సర్వాంగ సుందరంగా నిర్మించిన నూతన పార్లమెంట్ భవనం ప్రారంభానికి అంతే సర్వాంగ సుందరంగా సిద్దమైంది. మరో రెండు రోజుల్లో,  అంటే మే 28 న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభిస్తారు. సరే ఇంతకీ నూతన పార్లమెంట్ భవనం పేరేంటి అంటే తెలియదు. ఎందుకంటే ఆ భవనానికి ఇంకా నామకరణం జరగలేదు. కొత్త పార్లమెంట్ భవానానికి ఇంకా ఏ పేరునూ కేంద్రం ఖరారు చేయలేదు.

అయితే  ఏ పేరు పెట్టినా అదొక వివాదంగా మారుతుందని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. ముఖ్యంగా, ఉత్తర ప్రదేశ్ లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ప్రభుత్వం నగరాల, పట్టణాల పేర్లకు హిందుత్వ వాసనలు అద్దుతున్న నేపద్యంలో పార్లమెంట్ పేరులోనూ అవే వాసననలు గుబాళిస్తే   లౌకికవాద పార్టీలు పార్లమెంట్ ను ప్రధాని ప్రారంభించడాన్ని రచ్చచేస్తున్న రీతిలోనే మరింతగా రచ్చచేయవచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే  కొత్తగా నిర్మించిన పార్లమెంట్లో ఎన్ని ద్వారాలున్నాయి. ఆ ద్వారాలకు ఏ పేర్లు పెట్టారని ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 

మరోవంక నూతన పార్లమెంట్ భవనం ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త పార్లమెంట్ భవనంలో మహాత్మాగాంధీ, చాణిక్యుడు, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తో సహా ప్రముఖుల విగ్రహాలు ఉంటాయని  చెబుతున్నారు. అంతే కాకుండా కొత్త పార్లమెంట్ భవనానికి మూడు ప్రవేశ ద్వారాలు ఉన్నాయట. ఈ ప్రవేశ ద్వారాలకు చారిత్రక అంశాలను మేళవించారట. వాటికి జ్ఞాన ద్వారం..శక్తి ద్వారం.. కర్మ ద్వారాలుగా నామకరణం చేశారు.

జ్ఞాన ద్వారానికి ఒకవైపున గార్గి, యాజ్ఞవల్క్య మహర్షి మధ్య జరిగిన సంభాషణ దృశ్యం, మరోవైపు నలంద చిత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. శక్తి ద్వారానికి ఒక వైపున చాణిక్య, మరోవైపు మహాత్మాగాంధీ దండియాత్ర దృశ్యాలు ఉండనున్నాయి. కర్మ ద్వారానికి ఒకవైపు కోణార్క్ చక్రం, మరోవైపు సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేద్కర్ కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు.  

కేంద్ర ప్రభుత్వం 2022  సెప్టెంబర్లో రాష్ట్రపతి భవన్ కు వెళ్లి చారిత్రాత్మక రహదారి రాజ్ పథ్ ను కర్తవ్య పథ్ గా మార్చింది.  ఈ క్రమంలో కొత్త పార్లమెంట్ భవనానికి కూడా కొత్త పేరు పెట్టనున్నట్టు చర్చ జరుగుతోంది. అయితే పార్లమెంట్ హౌజ్ అని పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పెట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇంత వరకు ఏ పేరునూ ఖరారు చేయలేదు. మరోవైపు నూతన పార్లమెంట్ భవనంలో బంగారు రాజదండం సెంగోల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ సెంగోల్  స్పీకర్ కుర్చీ వద్ద ఏర్పాటు చేస్తున్నారు.  నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు.

By
en-us Political News

  
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.