పేర్ని నాని ఫ్యూచర్ ఏంటో?

Publish Date:May 4, 2022

Advertisement

పేర్ని నాని.. ఏపీలో తాజా మాజీ మంత్రి.. రవాణా, సమాచార శాఖలు నిర్వహించారు.మూడేళ్లు మంత్రి పదవిని అనుభవించారు. సీఎం జగన్ కోరిక మేరకు ఒక్కసారిగా మాజీగా మారిపోయారు. మంత్రి పదవిలో ఉన్నంత కాలం నానిలో మంచి చమత్కారే కనిపించాడు. మీడియా నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు కాస్త వాస్తవాన్నీ.. మరికాస్త వ్యంగ్యాన్ని జోడించి జవాబులిచ్చేవారు. అయితే.. చేతిలో పవర్ పోవడంతో ఆయన ఇప్పుడు కోరలు పీకేసిన పాము మాదిరిగా అయిపోయారంటున్నారు. తనను పదవి నుంచి పీకేయడంతో పేర్ని నాని అలిగిన వైనం స్పష్టంగా బయటపడకపోయినా.. మౌనం అయితే వహించిన దాఖలాలే కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన నియోజకవర్గానికి వస్తే.. పేర్ని నాని ఆయన పర్యటన దరిదాపుల్లోకి రాకపోవడం అందరి దృష్టికీ వచ్చింది.

పేర్ని నాని తన తండ్రి పేర్ని కృష్ణమూర్తి వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1999లో కాంగ్రెస్ అభ్యర్థిగా మచిలీపట్నంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2011లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ విఫ్ గా పనిచేశారు. 2013లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2014లో జరిగిన ఎన్నికల్లో పేర్ని నాని టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర చేతిలో 16 వేలకు పైబడి ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో నానికి 59 వేల 403 ఓట్లు పోలయ్యాయి. ఇక 2019 ఎన్నికలు వచ్చే సరికి పేర్ని నాని మళ్లీ పుంజుకుని మచిలీపట్నం నుంచే సుమారు 6 వేల ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర పైనే గెలిచారు. అప్పుడాయనకు 66 వేల 141 ఓట్లు వచ్చాయి.

పేర్ని నాని మంత్రి పదవిలో ఉన్నప్పుడు తన సామాజికవర్గానికే చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై బాగా విరుచుకుపడేవారు. పవన్ కళ్యాణ్ ను పార్ట్ టైం పొలిటీషియన్ అని.. బీజేపీని ప్రేమిస్తూ.. చంద్రబాబుకు కన్నుకొడుతున్నారంటూ.. పవన్ మాటలు మారుస్తారని, నిలకడ లేని రాజకీయ నేత అని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూతో పోల్చిన పవన్ కళ్యాణ్ బీజేపీ చంక ఎక్కారని ఘాటు విమర్శలు చేశారు. అలాగే ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న టీడీపీ పైనా పేర్ని నాని ఒంటికాలిపై లేచి మరీ విమర్శలు గుప్పించారు.

మచిలీపట్నం నియోజకవర్గం ఓటర్లలో సగానికి పైగా బీసీలు ఉన్నారు. పేర్ని నాని సామాజికవర్గం ఓటర్లు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు. కొన్ని గ్రామాల్లో అయితే.. కాపులదే పైచేయి. అయితే.. పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్ల కారణంగా ఆ సామాజికవర్గం ఓటర్లు పేర్ని నానిపై ఈ సారి బాగా గుర్రుగా ఉన్నారంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక పేర్ని నానికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని వారు తెగేసి చెబుతున్నారట. ఇక మచిలీపట్నంలో నియోజకవర్గంలో టీడీపీకి మంచి పట్టు ఉంది. టీడీపీ అభ్యర్థిగా కొల్లు రవీంద్ర గతంలో మంచి మెజార్టీతోనే నెగ్గారు. ఈ సారి మళ్లీ మచిలీపట్నంలో టీడీపీకే మెజార్టీ ఓట్లు లభించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఒక పక్కన పవన్ కళ్యాణ్ ను కించపరిచేలా కామెంట్లు చేయడం, మరో పక్కన ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగల సంఖ్యలో బీసీ సామాజికవర్గాలు ఉండడం కూడా పేర్ని నానికి ఈ సారి విజయావకాశాలు తగ్గిపోయే చాన్స్ ఉందంటున్నారు. నియోజకవర్గం అభివృద్ధికి పేర్ని నాని చేసిందేమీ లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు పేర్ని నాని, కొడాలి నాని ఇసుక లారీలు యధేచ్ఛగా తిరిగాయని, వారిద్దరూ ఇసుక దోపిడీ చేశారని స్థానికంగా చెబుతున్నారు. మచిలీపట్నం చుట్టుకప్కల తోడేసిన ఇసుకను హైదరాబాద్ వరకు తరలించుకుపోయేవారనే విమర్శలు ఉన్నాయి. పేర్ని నాని మంత్రి అయిన తర్వాత సొంత ఆస్తులు బాగా కూడబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

దానికి తోడు జగన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏపీ ఆర్థికంగా దిగజారిపోవడం, అభివృద్ధి జాడే లేకపోవడం, ఓటర్లకు కావాల్సిన కనీస అవసరాలు కూడా కల్పించలేక చతికిలపడిపోయిన వైసీపీకి వ్యతిరేకత పెరిగిపోతుండడం కూడా పేర్ని నానికి చేదు అనుభవాన్ని మిగిల్చే అవకాశం ఉందంటున్నారు. వీటితో పాటు మచిలీపట్నం నియోజకవర్గంలో సమస్యలు కూడా మూడేళ్లు మంత్రిగా పనిచేసిన పేర్ని నాని అంతగా పరిష్కరించలేదనే విమర్శలు ఉన్నాయి.

మొత్తం మీద ఎన్నో వ్యతిరేకతలను నెత్తిన మూటకట్టుకున్న పేర్ని నానికి ఈ సారి మచిలీపట్నం నియోజకవర్గంలో గెలుపు అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

By
en-us Political News

  
ఉపా కింద నమోదైన ఈ కేసులో నిందితుడి తరఫున న్యాయపోరాటం చేసేందుకు వైసీపీ పార్టీ లీగల్ సెల్ విభాగానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రంగంలోకి దిగారు.
ఈ సర్జరీల తరువాత పవన్ కల్యాణ్ కనీసం నెల రోజుల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇటీవల అనంతపురం జిల్లాలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య చోటుచేసుకున్న వ్యక్తిగత విమర్శలు, ఆరోపణల పరంపరపై మధుసూదన్ రెడ్డి, ప్రజాప్రతినిధుల మధ్య కేవలం రాజకీయ పోరాటం ఉంటే ఫర్వాలేదని, కానీ ఇరువర్గాలు కులాల ప్రస్తావన తెస్తూ కుంపట్లు రాజేయడం తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.
రావణ్ అరెస్టుపై వైసీపీ, ఇతరులు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నేరస్థులకు వైసీపీ ఇలా బాహాటంగా మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో, సమాజానికి ఎంతటి ముప్పుగా పరిణమించాడో ప్రజలంతా గమనించాలని కోరారు.
తిపక్షాల నుంచి వచ్చే విమర్శలను తిప్పికొట్టే విషయంలో జనసేన ఏమంత యాక్టివ్ గా లేదన్నది వాస్తవమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఈ విషయంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా పార్టీ లీడర్లు, క్యాడర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాదే పాద‌యాత్ర ప్రారంభిస్తాన‌ని కేటీఆర్ స్వయంగా ప్రకటించి కూడా వెనక్కు తగ్గడంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఏ మంత వ్యతిరేకత కనిపించడం లేదన్న అవగాహనతోనే కేటీఆర్ తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారన్న చర్చ జరుగుతోంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య సమక్షంలో కమలం కండువా కప్పుకుని బీజేపీలో చేరారు. వీరు ముగ్గురూ ఇలా బీజేపీలో చేరారో లేదో అలా బీజేపీ హైకమాండ్ వీరి రాజీనామాతో ఖాళీ అయిన ఆ మూడు రాజ్యసభ స్థానాల ఉపఎన్నికలకే వీరినే తమ అభ్యర్థులుగా ప్రకటించింది.
దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే ఉపా చట్టాన్ని ఉప్మా యాక్ట్ అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఇప్పుడు చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కి మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రతిపాదన తెచ్చినప్పుడు దొనకొండ పేరును గట్టిగా వినిపించాలని జగన్‌కు సీనియర్ నేత మైసూరా రెడ్డి సహా పలువురు సూచించారు. కానీ.. జగన్ అసెంబ్లీలో ఆ విషయాన్ని మర్చిపోయి విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెట్టాలంటూ మాట్లాడారని, ఆ తర్వాత మాట మార్చలేక కాలయాపన చేశారని మధుసూదన్ రెడ్డి చెప్పారు.
రాయలసీమలో వైసీపీ  కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్  ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయిన వారి చూపు ఇప్పుడు జనసేనపై ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఈ క్రమంలోనే వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని, త్వరలోనే గ్రేటర్ రాయలసీమలో వైసీపీ  ఖాళీ  అయిపోయినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు. 
ఒకవేళ కోర్టులో ఇవి ఎడిటెడ్ వెర్షన్లు అని రుజువైతే.. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందని, ఇది ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని హెచ్చరించారు.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్.. తాను గ్రౌండ్ రియాలటీని గత ఎన్నికల సమయంలో చెప్పినా నమ్మలేదనీ, తాను 2014 ఎన్నికల్లోనూ, మొన్నటి 2024 ఎన్నికల్లోనూ కూడా ఆరు నెలల ముందే చంద్రబాబు, లోకేష్‌లకు సీట్ల మార్జిన్ గురించి కచ్చితమైన అంచనాలు చెప్పినా వినలేదని.. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని ఉదహరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.