ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో అసలేం జరిగింది? ఏం జరుగుతోంది?

Publish Date:Jul 20, 2026

Advertisement

 తెలుగు వన్ ఎక్స్ క్లూజివ్

నిన్న మొన్నటి వరకూ ఒక సెలబ్రిటీగా మీడియా, యువత గొప్పగా చెప్పిన ఉదయ్ కృష్ణారెడ్డి.. ప్రస్తుతం ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సస్పెండ్ అయ్యారు.  ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతానికి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. ఆయన నాయనమ్మ కూరగాయలు అమ్ముతూ ఆయనను పెంచి పెద్ద చేసింది. అత్యంత పేదరికంలో పెరిగిన ఉదయ్, 2013లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. అయితే విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఒక సీఐ ద్వారా ఎదురైన తీవ్ర అవమానమే ఆయన జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. ఎలాగైనా అంతకంటే ఉన్నతమైన సివిల్ సర్వెంట్‌గా మారాలనే దృఢ సంకల్పంతో 2018వ సంవత్సరంలో తన కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయిలో సాధన చేసి ఐపీఎస్ సాధించారు. అటువంటి వ్యక్తిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అతడి నేపథ్యం గురించి తెలుగువన్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ప్రముఖ అనలిస్ట్ కందుల రమేష్ మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. 

ఉదయ్ కృష్ణారెడ్డి.. ఐపీఎస్ సాధించడానికి చేసిన ప్రయాణం  అంత సులువుగా సాగలేదు. గ్రామీణ నేపథ్యం, తెలుగు మీడియం చదువు కావడంతో మొదటి మూడు ప్రయత్నాలలో ఉదయ్ కృష్ణారెడ్డికి  నిరాశే ఎదురైంది. నాలుగో ప్రయత్నంలో వేరే సర్వీస్ వచ్చినప్పటికీ..  ఆశించిన ఐపీఎస్ మాత్రం దక్కలేదు. అయినా నిరాశ చెందకుండా..  రోజుకు 10 నుండి 12 గంటల పాటు  కష్టపడి చదివి, ఐదో ప్రయత్నంలో ఆల్ ఇండియా 365వ ర్యాంక్ సాధించి ఐపీఎస్ కావాలని కన్న కలలను సాకారం చేసుకున్నారు.   హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఆయన శిక్షణ పొందుతున్నారు. అంతా సజావుగా సాగుతోందనుకున్న సమయంలో, ఆయన జీవితాన్ని ఒక్కసారిగా అతలాకుతలం చేసే తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి.

హైదరాబాద్‌లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కర్ణాటకకు చెందిన ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఉదయ్ కృష్ణారెడ్డిపై  లైంగిక వేధింపుల ఫిర్యాదు చేశారు. తనను గదిలో బంధించి, కత్తితో బెదిరించాడని, లైంగికంగా వేధించాడని,  ప్రైవసీకి భంగం కలిగించాడని ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆయనపై సెక్షన్ 74, 75, 77 (వైరిజం), 78 (స్టాకింగ్), 79, 127(2) (అక్రమ బంధనం), 115(2), 351(2) తో పాటు ఐటీ యాక్ట్ సెక్షన్లు 66E మరియు 67A కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పోలీస్ అకాడమీలో పని ప్రదేశాల్లో మహిళల వేధింపుల నిరోధక చట్టం కింద ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ (ఐసీసీ) ఉన్నప్పటికీ, ఫిర్యాదులో తీవ్రమైన క్రిమినల్ అంశాలు ఉండటంతో ఈ కేసు నేరుగా  పోలీస్ స్టేషన్‌కు చేరింది.

ఈ తీవ్రమైన ఆరోపణలపై ఉదయ్ కృష్ణారెడ్డి స్పందిస్తూ, అవన్నీ  అసత్యాలని, బేస్‌లెస్ ఆరోపణలని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. తన వద్ద ఉన్న ఆధారాలతో సదరు మహిళా అధికారిణిపై   కేసు పెడతానని మీడియాకు  మెసేజ్ పంపారు. అయితే ఈ వార్త జాతీయ మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ విపరీతంగా ప్రచారం కావడం, తన ప్రతిష్ఠకు భంగం కలిగిందన్న   మానసిక ఆందోళనకు ఆయన గురై.. హైదరాబాద్ మోతీనగర్‌లోని తన బంధువుల ఇంట్లో తీవ్ర డిప్రెషన్‌లో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆయన ఎస్‌ఆర్ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక ఆదర్శవంతమైన ప్రేరణాత్మక కథగా నిలిచిన యువ ఐపీఎస్ అధికారి ఇలా చట్టపరమైన చిక్కుల్లో పడటం, ఆత్మహత్యా యత్నం చేసి ఆస్పత్రి పాలవ్వడం  తీవ్ర కలకలం రేపుతోంది.

Uday Krishna Reddy IPS, Trainee IPS Officer, NPA Hyderabad, Attapur Police Case, Uday Krishna Reddy Suicide Attempt

By
en-us Political News

  
ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఉద్రిక్త పరిణామాలు, పోలీసుల లాఠీచార్జి, టియర్ గ్యాస్ ప్రయోగంపై నెటిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుననారు. అంతర్జాతీయ వేదికలపై ప్రతి క్లిష్టమైన సమస్యనూ శాంతియుత సంప్రదింపులు, చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ఉద్బోధించే ప్రధాని నరేంద్ర మోదీ.. సొంత దేశంలో భవిష్యత్తు భారతాన్ని నిర్మించే విద్యార్థుల ఆందోళనలను ఉక్కుపాదంతో అణచివేయడం ఎంటని నిలదీస్తున్నారు.
పౌర వాణిజ్య నౌకపై జరిగిన ఈ దాడిని ఇండియా ఖండించింది. సముద్ర జలాల్లో స్వేచ్ఛాయుత వాణిజ్యానికి, అంతర్జాతీయ నౌకాయానానికి విఘాతం కలిగిస్తూ పౌర సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఉద్ఘాటించింది.
ఏపీఎస్‌బీసీఎల్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డితో పాటు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్, రాజ్ కసిరెడ్డిలకు విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం వచ్చే నెల 3 వరకూ జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించింది.
శ్రీకాకుళం జిల్లాలో వెలుగులోకి వచ్చిన  4 కోట్ల రూపాయల విలువైన   భూమిని అక్రమంగా కాజేసేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై కేసు నమోదు కావడంతో..  అరెస్టు ఖాయమని నిర్ధారించుకున్న తమ్మినేని సీతారాం తన కుటుంబంతో సహా అజ్ణాతంలోకి వెళ్లిపోయారు.  
ఈ గ్లోబల్ మిషన్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 108 దేశాలకు చెందిన 12 వేల మందికి పైగా విద్యార్థినులకు అంతరిక్ష సాంకేతికత, ఉపగ్రహ ఇంజనీరింగ్, విజ్ఞాన శాస్త్రాలపై ఆన్‌లైన్ ద్వారా ప్రాథమిక శిక్షణ అందించారు. ఈ శిక్షణ అనంతరం నిర్వహించిన పరీక్షలు, ప్రాజెక్ట్ మూల్యాంకన ఆధారంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 300 మంది బాలికలను తదుపరి దశకు ఎంపిక చేశారు. ఆ తర్వాత చోటుచేసుకున్న తుది ఎంపిక ప్రక్రియలో ఇండియా నుంచి 20 మంది విద్యార్థినులు స్థానం సంపాదించగా, వారిలో ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి జెస్సీ నిలవడం గర్వకారణం.
సీఐబీటీలో చదివిన ఉదయ్ రుద్రరాజు ఓపెన్ ఏఐ కంప్యూట్ విభాగానికి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సీటీవోగా నియమితులయ్యారు ఒక సాధారణ ప్రాంతీయ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ప్రపంచం గర్వించే స్థాయికి ఎదిగిన తెలుగు తేజం ప్రస్థానం.. అంకితభావం, నైపుణ్యం ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించింది.
ఈ సందర్భంగా కోర్టు వెలుపల జరుగుతున్న రాజకీయ చర్చలపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఇది కేవలం ఒక నేరపూరిత ఉదంతం. దీనిని కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదని పేర్కొంది.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటీకరణపై దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆక్వా కల్చర్, పొగాకు రంగాలను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని
ప్రధాని మోడీకి ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారు చేస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెబుతూ వస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ వచ్చే నెల మొదటి తేదీన భోగాపురం రానున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుపతి వేదికగా జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
శ్రీకాకుళం సమీపంలోని చాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న 900 చదరపు గజాల ఖాళీ స్థలం కబ్జాలక్ష్యంగా.. ఆ భూమి అసలు యజమానులకు సంబంధం లేకుండా, స్థలాన్ని కబ్జా చేసేందుకు, లేని వ్యక్తులను ఉన్నట్లుగా, ఉన్న వారిని మరణించినట్లుగా చూపిస్తూ బోగస్ మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించారు. తద్వారా న్యాయబద్ధమైన వారసుల పత్రాలను ఫోర్జరీ చేసి అక్రమంగా యాజమాన్య హక్కులను పొందడానికి ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠ భరిత పరిణామాల్లో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.