నీటిబొట్టుకు కొత్త గొంతు!!

Publish Date:Mar 14, 2022

Advertisement


ప్రయాణాలు చేస్తూ ఉంటాం. అంతా హైవే రహదారి, ఎక్కడా హోటళ్లు ఉండవు, చిన్న బడ్డీ కొట్టు కూడా కనిపించదు. ఒకవైపు దాహం పట్టిపీడుస్తూ ఉంటుంది. వెంట తెచ్చుకున్న బాటల్ లో నీళ్లు కూడా అయిపోయి ఉంటాయి. నోరంతా పిడచకట్టుకుని పోతూ ఉంటుంది. శరీరం క్రమంగా తేమను కోల్పోయి స్వాధీనం తప్పేంత డైలమాలో పడిపోతుంది. ఏదో చెయ్యాలని అనుకుంటాం. ఎవరైనా మనకు ఎదురైతే బాగుండు, కాసిన్ని నీళ్లిచ్చి దాహం తీరిస్తే బాగుండు అనుకుంటాం. కానీ అలా జరగదు, ఒక్కసారిగా దుఃఖం పొంగుకొస్తుంది. ఇంట్లో ఉంటే గనుక ఇలాంటి నరకం ఉండేది కాదు కదా అనిపిస్తుంది. 


చాలామందికి పైన అనుభవం జీవితంలో ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సందర్భంలో(ప్రయాణాలు అనే కాదు వేరే ఏదైనా సందర్భం కావచ్చు) ఎదురయ్యి తీరుతుంది. కొందరు పైన చెప్పుకున్నవరకే తమ ఆలోచనలు సాగిస్తారు. మరికొందరు దాంతోపాటు ఇంకొంచెం ముందుకు సాగుతారు.


బాత్రూమ్లోనూ, బట్టలు ఉతకడం లోనూ, ఇంటి పనులలోనూ, బయటకు వెళ్లినప్పుడూ, అతిశుభ్రత పేరుతోనూ ఎన్నెన్ని నీళ్లను కాలువలపాలు చేసామా అని కొందరు పశ్చాత్తాపపడతారు. బాత్రూమ్లో దూకే కుళాయి నీళ్లు కూడా అత్యంత విలువైనవిగా అనిపిస్తాయి అప్పుడు. 


ఇది ఒకమనిషి ఆవేదన అయితే గ్రామాలు, మండలాలు, జిల్లాలు అందులో నివసించే వేలు, లక్షల ప్రజానీకం ఏళ్లకేళ్ళుగా నీటి తళతళలు తమ నేలల మీద కనబడక ఎంతెంత ఆవేదన చెందుతూ ఉండి ఉండాలి. మినరల్ వాటర్ సృష్టించి వాటర్ వార్ లకు కారణమైన వ్యాపార సామ్రాజ్యాలు కూడా ఉన్న నేటి అభివృద్ధి ప్రపంచంలో  కనీస అవసరాల కోసం నీటి సరఫరా లేని జనావాస ప్రాంతాలు ఉన్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది. గంధపుచెక్కల చెట్లు సమృద్ధిగా ఉన్నవాడికి ఆ గందపుచెట్టు పెద్ద విలువైనదిగా ఎట్లా అనిపించదో, అలాగే అన్ని సౌకర్యాల మధ్యా కుళాయి తిప్పి నీటిని వాడేసేవాళ్లకు దాహం గొంతుల ఆవేదన అర్థం కాదని అనిపిస్తుంది.


కానీ…..


ప్రపంచంలో, ముఖ్యంగా భారతదేశంలో నీటి ఆవరణా ప్రాంతాల శాతం, అడవుల విస్తరణ శాతం తగ్గిపోతూ ప్రజల అవాస ప్రాంతాలు అభివృద్ధిలో భాగంగా పెరిగిపోతుంటే కరువు ప్రాంతాల శాతం పెరుగుతూ వస్తోంది. చెట్ల నరికివేత విచ్చలవిడిగా జరుగుతూ ఉండటం వల్ల ప్రతి నీటి బొట్టూ ప్రశ్నార్థకంగానే మారుతోంది. మనుషులను మినహాయిస్తే మూగజీవుల ఆవేదన వర్ణించని విధంగా మారిపోతోంది.


వృక్షో రక్షతి రక్షితః!!


చెట్టును మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అన్నట్టు, భూగర్భజలాలు పెరగాలి అంటే చెట్లు నాటడమే సరైన మార్గమని అందరికీ తెలుసు. కానీ నష్టం మనవరకు రాలేదులే అనే దారుణమైన నిర్లక్ష్యపు ఆలోచనల వల్ల ఎంతో స్వార్థం వల్ల మనుషులు తగిన మూల్యం చెల్లించుకునే దిశగా నడుస్తున్నారు. వాటి ఫలితాలే అసందర్బపు ప్రళయాలు. 


మరోవైపు!!


శరీర ఆరోగ్యానికి నీరు ఎంత అవసరమో అందరికీ తెలిసినదే. కానీ చాలామంది నీటిని సరిపడినంత తాగకపోవడం వల్ల శరీరంలో తేమశాతం తక్కువై కిడ్నీ సమస్యలు మొదలుకుని శరీరాన్ని ఇబ్బంది పెట్టే ఎన్నో అనారోగ్యాలు చుట్టుముడతాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కారణం బయటకు వెళ్లే మహిళలు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, దారి మధ్యలోనూ, పనుల మధ్యలోనూ మూత్రవిసర్జనకు దారిదొరక్క మగవాళ్ళలాగా రోడ్డుపక్కన కానిచ్చేయలేక మూత్రాన్ని బిగించడం లేదా, నీళ్లు సరిగ్గా తాగకపోవడం వల్ల చాలా తొందరగా కిడ్నీలు పాడైపోతూ ఉంటాయి. 


శరీరానికి ఇంధనమైన నీటిని మనం తగుతున్నంత బాద్యతగానే నీటి సంరక్షణ చర్యలు కూడా చేపట్టాలి. భూగర్భజలాలు పెరగడానికి ఉత్తమమార్గం అయిన చెట్ల పెంపకాన్ని కూడా బాధ్యతగా చేపట్టాలి. ఇంటి అవసరాలలో నీటిని ఎంతో పొదుపుగా వాడుకోవాలి. సామాన్లు కడిగిన, బట్టలు ఉతికిన నీటిని సింకుల్లో, కాలువల్లో తోసేయకుండా వాటిని మొక్కలకు, చెట్లకు మళ్లించాలి. అన్నిటికీ మించి పిల్లలకు నీటి విలువ తెలియజెప్పాలి.  శరీరానికి నీరు ఎంత అవసరమో చెబుతూనే, నీటిని వృధా చేయడం ఎంత తప్పో చెప్పాలి. మనం చేతయాల్సింది అంత చేస్తే, ప్రకృతి నీటి గొంతును వినిపిస్తుంది.
                                                                                   

◆వెంకటేష్ పువ్వాడ.

 

By
en-us Political News

  
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది...
పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట..
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది....
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు.
తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని ఎవరూ ఎంచుకోలేరు.  అవి దేవుడు ఇచ్చే బందాలు.  కానీ ప్రతి వ్యక్తి స్నేహితులను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. మంచి స్నేహితులు ఉన్న వారి జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులు...
ప్రతి మనిషి వేర్వేరు వ్యక్తిత్వం కలిగి ఉంటాడు.  ఒకే ఇంట్లో, ఒకే తల్లి కడుపున పుట్టిన వ్యక్తులే వేర్వేరు స్వభావాలను కలిగి ఉన్నప్పుడు బయటి వ్యక్తుల స్వభావం ఒకే విదంగా ఉండటం అనేది జరగదు.  అయితే బయట కొందరిని చూస్తే వీళ్లు అచ్చు మనలాగే ఉన్నారే...
ప్రేమ,  భార్యాభర్తల బంధం,  సహజీవనం.. ఏదైనా సరే.. మనసులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది కీ పాయింట్ గా ఉంటుంది. నేటికాలంలో బంధాలు చాలా పెళుసుగా మారాయి.  చాలా తొందరగా బ్రేకప్ లు  జరుగుతున్నాయి...
పెళ్లి ప్రపంచంలో ప్రజలందరూ సాగించే ఒక పవిత్రమైన  బంధం. భారతీయులు పెళ్లికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.  సాధారణంగా వయసు రాగానే పెళ్లి వయసు వచ్చింది అని అంటుంటారు.  దానికి తగ్గట్టే పెళ్ళిళ్లు చేస్తుంటారు....
గొడవలు లేని భార్యాభర్తల బంధం అంటూ ఉండదు. వాస్తవానికి భార్యాభర్తల మధ్య  జరిగే గొడవలు చాలా వరకు వారి బంధాన్ని మరింత బలంగా మార్చడంలో సహాయపడతాయి.  భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు  ఒకరి మీద ఒకరికి ఉండే ప్రేమను స్పష్టం చేస్తాయి...
అత్తాకోడలు ఇద్దరూ వేరే ఇంట్లో తమ తల్లిదండ్రుల మధ్య గారాభంగా పెరిగి వివాహం పేరుతో ఒక ఇంటిని చేరే వారు.  అయితే ఏ ఇంట్లో చూసినా అత్తాకోడళ్లు అంటే ఒకానొక శత్రుత్వమే కనిపిస్తుంది, వినిపిస్తుంది...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.