లోకానికి రంగులు జల్లేద్దామా??

Publish Date:Mar 17, 2022

Advertisement


ఎన్నెన్నో వర్ణాలు అన్నింట్లో అందాలు అంటాడు ఒక సినీగేయ రచయిత. నల్లానల్లాని కళ్ళ పిల్లా అంటాడు మరొక రచయిత. ఎర్రని జాంపండు అని ఊరిస్తారు అందరూ. ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయా అని ముద్దుగుమ్మలు అందాన్ని, సంప్రదాయాన్ని కలిపి అలరిస్తారు. పచ్చని ప్రకృతి అంటూ ప్రకృతి ప్రేమికులు నినదిస్తారు. పిండారబోసినట్టు వెన్నెలా, సముద్రం మీద తెల్లని కలువపువ్వాలా చందమామా అంటూ చమత్కారాలు కురిపిస్తారు. కేంజాయ రంగు సూరీడు ఆకాశమంత నోటితో నవ్వుతాడన్నట్టు అంతా నారింజ వర్ణమే. 


ఇట్లా అన్నింటిలో రంగుల హొయలు, రంగేళి పాటలా ప్రపంచాన్ని కనువిందు చేస్తూ ఉంటుంది. ఆకులోనూ, పువ్వులోనూ, మట్టిలోనే కాక నీటిలోనూ, గాలిలోనూ రంగుల్ని చూసే మనసును, సృజనాత్మక వర్ణనను ఆ రంగులే కొందరికి ఇచ్చేసాయేమో అనిపిస్తూ ఉంటుంది.


ఇప్పుడిదంతా ఎందుకూ అంటే!!


ప్రపంచమంతా రంగులతోనూ, రంగులలో ఉన్న ఆనందంతోనూ నిండిపోయి అందరినీ ఆనందంలో ఉంచుతున్నా రంగుల పండగ ప్రత్యేకంగా ఉంది మనకు. తెల్లని మల్లెపూవుల్లాంటి బట్టలు వేసుకుని రంగులు జల్లుకుని సప్తవర్ణ హరివిల్లులా ఒక్కొక్కరూ మెరిసిపోతూ ఉంటే ఎంతో సంబరంగా ఉంటుంది. 


వసంతఋతువులో అందరిని పలకరించే రంగుల పండగ వర్ణశోభిత వికసిత మాలిక అయిన హొలీ పండుగ భారతదేశమంతా ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ. ముఖ్యంగా కృష్ణుడి ఆరాధకులు వ్రేపల్లె కన్నయ్యను తలచుకుంటూ గోధూళి పాటలు పాడుకుంటూ ఆనంద పరవశంలో మునిగి తేలుతూ ఉంటారు. రంగులు జల్లుకోవడాలు, ఉట్టి కొట్టడాలు, బృందావనంలో రాధాకృష్ణులను తలపించే దాండియా నృత్యాలు ఇలా హొలీ పండుగ హడావిడి అంతా ఇంతా కాదు. ఇవన్నీ ఒకెత్తు అయితే హొలీ పిండివంటల హాంగామా వేరే లెవెల్ అనుకోవచ్చు.


ముఖ్యంగా తీపి పదార్థాలదే ఇక్కడ పైచెయ్యి. పాలతో చేసే పదార్థాలకు పెద్ద పీట వేస్తారు. ప్రతి ఇంట్లో నేతి వాసనలు గుబాలిస్తూ ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాలలో హొలీ సందడి తక్కువే అయినా ముంబయ్, బెంగాల్, గుజరాత్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో హొలీ పండుగ, దాని తాలూకూ హంగామా ఆకాశాన్నంటుతుంది. పిల్లలు పెద్దలు తారతమ్యం లేకుండా రంగులలో తడిసి ముద్దవుతూ ఉంటుంది. 


సంబరంతో జాగ్రత్తలు!!


అయితే సంబరాలలో అపశ్రుతులు జరుగుతూ ఉంటాయి. వాటి గురించి తెలిసిన ప్రజలు ముందుజాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని విషయం కూడా మరచిపోకూడదు. రంగులు జల్లుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కళ్ళలోకి రంగులు పడకుండా సంబరాన్ని ఆస్వాదించాలి. అలాగే కృత్రిమ రంగులకు దూరంగా ఉండాలి. ఎలాగైతే వినాయకచవితి సంబరాలలో కాలుష్యం పెరగకూడదని మట్టి గణపతిని ప్రోత్సహిస్తున్నామో అలాగే రంగుల విషయంలో కూడా సహజమైన పదార్థాలను ఎంచుకోవాలి. నిజానికి ఇలా సహజమైన రంగులు తయారు చేసుకోవడం వల్ల ఖర్చు తగ్గడం మాత్రమే కాకుండా కాసింత ఓపిక పెరుగుతుంది. మనుషుల్లో సృజనాత్మకత బయటకు వస్తుంది. ఇంకా చెప్పాలంటే బోలెడంత ఆత్మసంతృప్తి మిగులుతుంది.  ఇంకా శరీరానికి కొబ్బరి నూనె, బాడీ లోషన్ వంటివి ముందుగానే పూసుకోవడం వల్ల రంగుల ప్రభావం చర్మం మీద పడకుండా ఉంటుంది. ఇంకా ఫస్ట్ ఎయిడ్ కిట్ దగ్గరలో ఉంచుకోవడం మంచిదే.


ఇబ్బంది పెట్టని సంబరాలు ఆనందాలు!!


కొందరికి రంగులు చల్లుకుని హంగామా చేయడం ఇష్టం లేకపోవచ్చు. ఏవో కారణాల వల్ల హొలీ మూడ్ ను ఎంజాయ్ చేయలేకపోవచ్చు. మరేవో కారణాల వల్ల దూరంగా ఉండాలని అనుకోవచ్చు. స్నేహితులు, చుట్టాలు, పక్కాలు, కొలీగ్స్ ఇలా అందరిలోనూ ఎవరో కొందరు ఇలాంటి వాళ్ళు ఉండచ్చు. అలాంటి వాళ్ళ మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి కానీ బలవంతంగా రంగులు పూయడం అల్లరి చేయడం వంటివి చేస్తే అవతలి వాళ్లకి అది గోలగానూ, సాడిజంగానూ అనిపిస్తుంది. అందుకే వీలైనంత వరకు ఎదుటి వారిని, వారి అభిప్రాయాలను గౌరవించాలి.


పంచభూతాలూ, ప్రకృతి, మనుషులూ, ఆనందాలు, అల్లర్లు, సంతోషాలు, అలకలు, ఆటపట్టించడాలు ఇలా అన్ని రంగులలో కలసి వసంతఋతువులో లోకానికి మరింత కొత్తశోభను అద్దుతాయి.  ఎలాంటి అపశ్రుతులు ఎదురుకాకుండా లోకం మీద  హొలీ రంగులు జల్లేద్దాం!!


◆వెంకటేష్ పువ్వాడ.

By
en-us Political News

  
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది...
పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట..
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది....
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు.
తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని ఎవరూ ఎంచుకోలేరు.  అవి దేవుడు ఇచ్చే బందాలు.  కానీ ప్రతి వ్యక్తి స్నేహితులను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. మంచి స్నేహితులు ఉన్న వారి జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులు...
ప్రతి మనిషి వేర్వేరు వ్యక్తిత్వం కలిగి ఉంటాడు.  ఒకే ఇంట్లో, ఒకే తల్లి కడుపున పుట్టిన వ్యక్తులే వేర్వేరు స్వభావాలను కలిగి ఉన్నప్పుడు బయటి వ్యక్తుల స్వభావం ఒకే విదంగా ఉండటం అనేది జరగదు.  అయితే బయట కొందరిని చూస్తే వీళ్లు అచ్చు మనలాగే ఉన్నారే...
ప్రేమ,  భార్యాభర్తల బంధం,  సహజీవనం.. ఏదైనా సరే.. మనసులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది కీ పాయింట్ గా ఉంటుంది. నేటికాలంలో బంధాలు చాలా పెళుసుగా మారాయి.  చాలా తొందరగా బ్రేకప్ లు  జరుగుతున్నాయి...
పెళ్లి ప్రపంచంలో ప్రజలందరూ సాగించే ఒక పవిత్రమైన  బంధం. భారతీయులు పెళ్లికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.  సాధారణంగా వయసు రాగానే పెళ్లి వయసు వచ్చింది అని అంటుంటారు.  దానికి తగ్గట్టే పెళ్ళిళ్లు చేస్తుంటారు....
గొడవలు లేని భార్యాభర్తల బంధం అంటూ ఉండదు. వాస్తవానికి భార్యాభర్తల మధ్య  జరిగే గొడవలు చాలా వరకు వారి బంధాన్ని మరింత బలంగా మార్చడంలో సహాయపడతాయి.  భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు  ఒకరి మీద ఒకరికి ఉండే ప్రేమను స్పష్టం చేస్తాయి...
అత్తాకోడలు ఇద్దరూ వేరే ఇంట్లో తమ తల్లిదండ్రుల మధ్య గారాభంగా పెరిగి వివాహం పేరుతో ఒక ఇంటిని చేరే వారు.  అయితే ఏ ఇంట్లో చూసినా అత్తాకోడళ్లు అంటే ఒకానొక శత్రుత్వమే కనిపిస్తుంది, వినిపిస్తుంది...
కష్టాలు, సమస్యలు ఎదురైనప్పుడు, ఇతరుల నుండి అన్యాయాన్ని ఎదుర్కుంటున్నప్పుడు, ఇతరుల తప్పులకు తాము నష్టాన్ని  అనుభవిస్తున్నప్పుడు చాలా మంది న్యాయం కోసం న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.