Publish Date:Apr 17, 2026
ఆంధ్రప్రదేశ్ కు మరో భారీ పెట్టుబడి రానుంది. ప్రముఖ సంస్థ అయిన వారీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. అనకాపల్లి జిల్లాలో 8 వేల 175 కోట్ల రూపాయలతో అత్యాధునిక లిథియం అయాన్ బ్యాటరీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కంపెనీ రెడీ అయ్యింది. ఇందు కోసం ఆ కంపెనీకి ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని అనుమతులూ లభ్యమయ్యాయి. దీంతో త్వరలో ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని వారి ఎనర్జీ స్టోరేష్ సిస్టమ్ నిర్ణయించింది.
ఈ మెగా ప్రాజెక్ట్ కోసం అనకాపల్లి జిల్లా రాంబిల్లి ప్రాంతంలో ప్రభుత్వం 300 ఎకరాల భూమిని కేటాయించింది. ఇక్కడ ఏర్పాటు చేయబోయే యూనిట్ సుమారు 16 గిగావాట్ అవర్ ( సామర్థ్యంతో పనిచేయనుంది. ఈ ప్లాంట్లో కేవలం బ్యాటరీ ప్యాక్లు మాత్రమే కాకుండా, సెల్ తయారీ, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్కు అవసరమైన విడిభాగాలను కూడా ఉత్పత్తి చేయనుంది.
ఈ భారీ పరిశ్రమ స్థాపన ద్వారా స్థానిక యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా 3,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలున్నాయి. ప్రాజెక్టు మొదటి దశను వచ్చే ఏడాది జులై నాటికి పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని వారీ ఎనర్జీస్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
వారీ ఎనర్జీస్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. గుజరాత్ , అమెరికాలోని టెక్సాస్లో సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్లు ఉన్న ఈ సంస్థ, తన ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు ఏపీలో ఏర్పాటు చేయబోయే ప్లాంట్ ద్వారా క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి అవసరమైన బ్యాటరీ నిల్వ వ్యవస్థలను దేశీయంగానే అందించే అవకాశం ఉంటుంది.
రాబోయే రోజుల్లో ఈ ప్లాంట్ సామర్థ్యాన్ని 20 గిగావాట్ అవర్ వరకు పెంచాలని వారీ ఎనర్జీస్ సంస్థ భావిస్తోంది. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ తయారీలో ఈ కేంద్రం దేశంలోనే కీలక భూమిక పోషించనుందని చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/wari-energies-massive-investment-in-ap-36-217555.html
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్లో ఘనంగా జరిగింది.
కరీంనగర్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం సంచలనాత్మక దోపిడీ ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
ఎస్.కె.జిలానీ తన కుమారుడు ఫైసల్తో కలిసి బైక్పై ఎల్బీ నగర్ వైపు వెళ్తుండగా.. . గాయత్రినగర్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఫైసల్కు గాయాలయ్యాయి. కారు డ్రైవర్ను నిలదీసేందుకు జిలానీ కారుకు అడ్డంగా వెళ్లారు. అయితే డ్రైవర్ కారు ఆపకుండా ముందుకు పోనివ్వడంతో జిలానీ కారు బానెట్పై పడి దాన్ని గట్టిగా పట్టుకున్నారు.
ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్కు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో నమన్ ధిర్ 57 పరుగులతో రాణించాడు. మిగిలిన వారు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి నెమ్మదిగా ఆడటం జట్టు స్కోరుపై ప్రభావం చూపింది.
వియత్నాం యుద్ధం తర్వాత అమెరికాలో ఏర్పడిన అసంతృప్తి కారణంగా 1973లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో అధ్యక్షుడు కాంగ్రెస్ను పక్కనబెట్టి ఏక పక్షంగా యుద్ధాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. అందుకే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా నియంత్రణలు అవసరమని భావించి ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.
అసలే నష్టాల్లో కూరుకుపోయిన స్పిరిట్ ఎయిర్లైన్స్ యుద్దం కారణంగా ఇంధన ధరలు రెట్టింపు అవ్వడంతో.. ఇక సర్వీసులు నడపలేమని చేతులెత్తేసింది. త్వరలో అన్ని కార్యకలాపాలకూ ఫుల్ స్టాప్ పెడతామని ప్రకటించింది. తమ ప్రయాణికులు ఎయిర్పోర్టులకు వెళ్లవద్దని సూచించింది
నారాయణ్పూర్ జిల్లాకు ఆనుకుని ఉన్న ఛోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ని మార్చి 31న సాయుధ మావోయిస్టులు లేని రాష్ట్రంగా ప్రకటించారు. సాయుధ మావోలు లేని రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలి పేలుడు ఇదే కావడం గమనార్హం.
సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో సూత్రధారిగా ఏకసభ్య కమిషన్ తేల్చిన ఈవో ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
గత కొద్ది కాలంగా మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితమే ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. అక్కడి సైన్స్ సెంటర్లు, ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. పుస్తకాల్లోని జ్ఞానానికి తోడుగా విద్యార్థులకు వాస్తవిక ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు ఆ యాత్ర ఎంతో దోహదపడింది. ఇప్పుడు ఉపాధ్యాయులను కూడా విదేశాలకు పంపడం ద్వారా అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.