ఎర్రసముద్రంలో యుద్ధ జ్వాలలు.!

Publish Date:Jul 23, 2026

Advertisement

అంతర్జాతీయ వాణిజ్య మార్గమైన ఎర్రసముద్రంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.  ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే కీలక సముద్ర మార్గంలో  రాకెట్లు, డ్రోన్ దాడుల మోత మోగుతోంది. సౌదీ అరేబియా నైరుతి తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న ఒక చమురు ట్యాంకర్‌పై  జరిగిన క్షిపణి దాడి ప్రపంచ దేశాలను నివ్వెరపరిచింది.  పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్న తరుణంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ప్రపంచ ఇంధన రవాణాను సందిగ్ధంలో పడేసింది. 

యునైటెడ్ కింగ్‌డమ్ మేరిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ అధికారికంగా వెల్లడించిన వివరాల మేరకు..  సౌదీ అరేబియాలోని అల్ షుకైక్ ప్రాంతానికి నైరుతి దిశలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో  నౌకలో ఉవ్వెత్తున భారీగా మంటలు చెలరేగాయి.   అదృష్టవశాత్తూ ఈ క్షిపణి దాడిలో   ప్రాణనష్టం సంభవించలేదు.  

ఈ వినాశకర దాడికి బాధ్యత వహిస్తూ యెమెన్‌కు చెందిన హౌతీ రెబెల్స్ వర్గం   ప్రకటన విడుదల చేసింది. సౌదీ అరేబియాకు చెందిన రెండు చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి ఒడిగట్టినట్లు హౌతీలు పేర్కొన్నారు. సౌదీ ప్రభుత్వం తమ అధీనంలో ఉన్న ప్రాంతాలను దిగ్బంధించినందుకే  ఆ దేశ నౌకలపై సముద్ర నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. సౌదీ అరేబియా నౌకలపై సముద్ర నిషేధం విధించినట్లు  హౌతీ తిరుగుబాటుదారులు రెండు రోజుల కిందటే హెచ్చరికలు జారీ చేశారు. ఆ హెచ్చరికలు జారీ చేసిన రెండు రోజులకే  బాబ్ ఎల్-మండేబ్ జలసంధికి  సమీపంలో దాడికి పాల్పడ్డారు. 

ఇప్పటికే హర్మూజ్ జలసంధిలో నౌకాయానం దాదాపుగా నిలిచిపోగా, ఇప్పుడు హౌతీ దాడితో  బాబ్ ఎల్-మండేబ్ జలసంధి గుండా నౌకాయానం భద్రత కాదని తేలడంతో   అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో పెట్రోలియం రవాణాపై సందిగ్దత నెలకొంది.  ఈ దాడులకు అడ్డుకట్ట పడకపోతే, ప్రపంచ ద్రవ్యోల్బణం పెరిగి  ఆర్థిక సంక్షోభం నెలకొనే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్త మౌతోంది. 

wares in  Red Sea, Houthi Rebels, Saudi Oil Tanker Attack, Bab el Mandeb Strait, Global Shipping Crisis, Maritime Security

By
en-us Political News

  
కాజా గ్రామానికి చెందిన పెద్దకాపు సింహాద్రి వెంకటరామారెడ్డి పొలాల్లోని పాటి దిబ్బనుగురువారం (జులై 23) దున్నతుండగా రెండు చిన్న విగ్రహాలు నాగలి చాలు పైకి వచ్చాయన్న సమాచారం మేరకు శివనాగిరెడ్డి ఆ విగ్రహాలను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
హైదరాబాదు నగర పరిసరాల్లో ఆర్మీకి చెందిన భూములపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ రక్షణ శాఖ అధికారులు హైడ్రా కమిషనర్‌ను ఆశ్రయించారు.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ప్రక్షాళన, విముక్తి, భద్రత అనే మూడు అంశాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఈ జనరేషన్‌కి ఎమోషనల్ కంట్రోల్ లేకపోవడమే నేరాలకు కారణమా..!
టెక్ మహీంద్రా కంపెనీ ముందు ధర్నాకు దిగిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి..
ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో సీఐడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో తీవ్ర చలననాన్ని రేపింది.
వరంగల్‌లో మీడియా రిపోర్టర్లతో నిర్వహించిన చిట్‌చాట్ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
తన అనుచరులు, స్థానికులతో కలసి ప్రత్యేక వేదికపై కూర్చుని ఈ మౌన నిరసన చేపట్టారు. ఏలాంటి ఉపన్యాసాలు, నినాదాలు లేకుండా కేవలం మౌనంతోనే ఆయన నిరసన వ్యక్తం చేశారు. దేశ రాజథానిలో వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా కేంద్రం స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేతులు మారిన ప్రతీసారీ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల అంశం మళ్లీ రాజకీయ తెరపైకి వస్తుంది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన ప్రాపర్టీని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేలం వేయడాన్ని సమర్థిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బండ్ల గణేష్ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి విదితమే. అయితే బండ్ల గణేష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పును సమర్ధించింది.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఢిల్లీ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.