Publish Date:Jul 23, 2022
కష్టాలు వస్తే ఒకే సారి కట్టగట్టుకుని వస్తాయంటారు పెద్దలు. ఇప్పుడు గుజరాత్ వడోదర వాసుల పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది. ఒక వైపు వరదలు ముంచెత్తి ఇళ్లు నీటమునిగి సతమౌతున్న వడోదర వాసులకు మొసళ్ల భయం పట్టుకుంది.
వడోదర విశ్వామిత్ర నది ఒడ్డున ఉంటుంది. విశ్వామిత్ర నది మొసళ్ల ఆవాసం కూడా. ఈ నది దాదాపు 300కు పైగా మొసళ్లకు ఆశ్రయం ఇస్తోంది. అటువంటి విశ్వామిత్ర నది ఇటీవలి వర్షాలకు పొంగి ప్రవహించింది. భారీగా వరద నీరు పోటెత్తడంతో నది గట్లు తెంచుకుని ప్రవహించింది. వరద నీరు వడోదరను ముంచెత్తింది. కాలనీలకు కాలనీలు నీట మునిగాయి. ఆ వరద నీటితో పాటు నదిలో ఆవాసం పొందుతున్న మొసళ్లు కూడా వడోదరలోకి వచ్చేశాయి.
కాలనీలకు కాలనీలను ముంచెత్తిన వరద నీటితో పాటు మొసళ్లు కూడా కాలనీల్లోకి వచ్చేశాయి. పలు అపార్ట్ మెంట్ ఆవరణల్లో మొసళ్లు కనిపించడంతో జనం భయంతో బెంబేలెత్తిపోయారు. అసలే వరదలతో దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్న వారికి మొసళ్లు ప్రాణాంతకంగా పరిణమించాయి. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు.
వరద నీటితో పాటు కొట్టుకు వచ్చిన మొసళ్లు డ్రైనేజీల ద్వారా ఎక్కడికెక్కడకు కొట్టుకుపోయాయో అన్న ఆందోళన వ్యక్తమౌతోంది. మొత్తం మీద అటవీ అధికారులు శ్రమించి పెద్ద సంఖ్యలో మొసళ్లను పట్టుకుని తీసుకెళ్లినప్పటికీ.. ఇంకా ఎన్ని మొసళ్లు ఎక్కడెక్కడ ఉన్నాయా అన్న భయం మాత్రం వడోదర వాసులను వెంటాడుతూనే ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/viswamitra-river-flood-crocodiles-in-vadodara--25-140385.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.