Publish Date:Jul 23, 2022
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులూ ఉండరు. అలాగని ఒకరికొకరు ఒకే పన్నాముక్కలానూ కలిసి ఉండరు. తెర మీద కావలించుకున్న ఇద్దరూ తెర వెనుక ఆవల కొట్టుకు ఛస్తారన్నారు పూర్వం ఓ కవి. ఎవ్వరయినా, ఎవరితోనైనా సఖ్యత నటించ డమే.. ప్రయాణ లక్ష్యం వేరే ఉంటుంది. ఇపుడు మోదీ, మమతా దీ స్నేహం భావం అదే. ఇద్దరూ నిజానికి ఎడ మొగం పెడమొగం. కానీ శతృవును ఎంచుకున్నాక చూసుకోవడాలు, నవ్వుకోవడాలు, ఆనక పెరట్లో పావులు కదపపడాలు మామూలే.
మోదీ ప్రభుత్వానికి విపక్షంలోనూ తామే ఉండాలన్న చిత్రమైన కోరిక మమతా దీది. ఒక్కసారైనా ప్రధాని కావాలన్న తలంపు ఆమెది. దేశంలో ప్రధాన ప్రతిపక్షాన్ని మోదీగారు అనుకోగానే తొక్కేయడం చాలా కష్టం. అందుకు తగిన పదునైన తిక్క అస్త్రం ఒకటి కావాలి కనుక బెంగాలీ చెల్లి మమతాదీని ఎగదోయడంమే మార్గం అనుకున్నారాయన. ఆమె కూడా తన అవసరం కోసం మోదీ ముక్త భారత్ కీ జై అనే అనాలి. కనుక వైరుధ్యాలు తెరమీద చూపుతూ తెర వెనుక ఊహించని మలుపులతో చిర్నవ్వులు చిందిస్తూ మనం ఒకటే కలిసి పోరాడదాం అని అందరికీ టోపీ పెట్టే వ్యూహాలతో ఉన్నారు.
బీజేపీతో కర్రా విరక్కుండా పాము చావాకూడదన్న తీరులో మమతా బెనర్జీ వ్యవహరిస్తున్నారు. ఆమెను భ్రమలోనే ఉంచామని బేజీపీ అనుకుంటోంది, తాను ఉపరాష్ట్రపతి అభ్యర్ధి విషయంలో తనను విశ్వాసంలోకి తీసుకోలేదన్న ఉక్రోషంతో ఆమె దూరంగా ఉంటున్నారు. అందువల్ల వీరి ఐక్యత గాలివాటుకు పడే కర్రలాంటిది. పైగా మార్గరెట్ అల్వా అభ్యర్ధిత్వాన్ని కాంగ్రెస్ ప్రకటిం చింది కానీ అదేమంత విజయాన్ని ఇవ్వకపోవచ్చు. వాస్తవానికి మార్గరెట్ మీద సోనియాకు ప్రత్యేకించి ప్రేమ లేదు. ఎవరూ లేక పేరు ప్రకటించినట్లే అయింది, కనుక నవీన్ పట్నాయక్ తదితరులు మళ్లీ బీజేపీ అభ్యర్ధికే మద్దునిస్తారు. అంటే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి అభ్యర్దులను గెలిపించుకోవడంలో, తమకు భవిష్యత్లో అనుకూలించేవారినే పీఠం ఎక్కించడంలో కమలనాథుల వ్యూహం ఫలించినట్టే.
ఆప్ పార్టీ ఎంపిక భేటీకి డుమ్మా కొట్టేసింది. వెరసి యశ్వంత్ సిన్హాలాగే మార్గరెట్ను కూడా ఘోరంగా ఓడిపోయే ప్రణాళికను బీజేపీ అమలు పరుస్తోంది. అందులో మొదటి సూచిక మమత వోటింగుకు దూరంగా ఉంటామనే ప్రకటన! ఢిల్లీ సర్కిళ్ల ప్రచారం మేరకు మొన్న మంత్రి పదవికి రాజీనామా చేసిన ముక్తార్ నక్వీని బెంగాల్ గవర్నర్గా చేస్తే మమతను శాంత పరిచినట్టే అవు తుంది. నక్వీ హుందాగా ఉంటారు. తన వ్యవహారశైలి, రాబోయే సాధారణ ఎన్నికల్లో బెంగాల్లో టీఎంసీ, బీజేపీ అభ్యర్థుల ఎంపిక చాలా ప్రణాళికబద్ధంగా జరగబోతోంది. కనుక బెంగాల్ టైగర్ను ఆట్టే గోలచేయకుండా దువ్వడంలో మోదీ, షా చదరంగ ప్రావీణ్యం గొప్పదే!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/political-mind-game-of-modi-sha-25-140389.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.