Top Stories

political-news-img

సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభించిన చంద్రబాబు.!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలకమైన ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. అమరావతికి అత్యంత కీలక కనెక్టివిటీ అయిన ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు బకింగ్‌హామ్ కెనాల్‌పై నిర్మించిన భారీ స్టీల్ వంతెనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం (ఆగస్టు 13) ప్రారంభించారు. విజయవాడ, మంగళగిరి మధ్య ఉన్న జాతీయ రహదారితో రాజధానిని నేరుగా అనుసంధానించే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి రావడంతో అమరావతి నవనగరాలకు ప్రయాణం సులభతరం అవుతుంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు దొండపాడు వద్ద ప్రారంభమై రాయపూడి, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి, తాడేపల్లి మీదుగా మణిపాల్ ఆస్పత్రి వద్ద 16వ నంబరు జాతీయ రహదారితో కలుస్తుంది. మొత్తం 21.77 కిలోమీటర్ల ఈ రహదారి నిర్మాణాన్ని మూడు దశల్లో .1,519 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. సచివాలయం, హైకోర్టు, ప్రజాప్రతినిధుల గృహాలు, అధికారులు, ఉద్యోగుల నివాస సముదాయాలు, పరేడ్ మైదానం ప్రాంతాలకు చేరుకోవడానికి ఈ రోడ్డు ఉపయుక్తంగా ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు 60 మీటర్ల వెడల్పుతో 9 లేన్ల లో నిర్మించారు. ప్రత్యేకంగా బీఆర్‌టీఎస్ కారిడార్‌తో పాటు రహదారికి ఇరువైపులా సర్వీసు రోడ్లను అందుబాటులోకి తెచ్చారు. రవాణాతో పాటే విద్యుత్తు, తాగునీటి సరఫరా, గ్యాస్ నెట్‌వర్క్, డ్రైనేజీ, కమ్యూనికేషన్ కేబుళ్ల నిర్వహణ కోసం భూగర్భ మౌలిక వసతులు సమకూర్చారు. పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్‌లు, గ్రీన్‌బెల్ట్ నిర్మాణంతో ఆధునిక రవాణా వ్యవస్థకు ఈ రోడ్డు దర్పణం పడుతుంది. Amaravati Seed Access Road, CM Chandrababu Naidu, Inauguration Seed Access Road, BuckinghamCanalSteelBridge, Amarawathi

Publish Date: Aug 13, 2026 12:20PM

political-news-img

ఎర్రకోట పేలుడు వెనకున్నదెవరో తెలుసా?

ఢిల్లీ నగరంలో అత్యంత భద్రత కలిగిన ఎర్రకోట ప్రాంతంలో సంభవించిన కారు బాంబు పేలుడు ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ పేలుడు వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరిదన్న దానిపై ఇంత కాలంగా పలు అనుమానాలు వ్యక్త మయ్యాయి. అయితే ఆ అనుమానాలన్నిటినీ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్సీ) పటాపంచలు చేసింది. ఎర్రకోట పేలుడు వెనుక ఉన్న మాస్టర్ మైండ్ అల్ ఖైదా అని తేల్చింది. యూఎన్‌ఎస్సీ విడుదల చేసిన అధికారిక నివేదికలో.. ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు వెనుక ఉన్నది అల్‌ఖైదా అనుబంధ వింగ్‌ అయిన అల్‌ఖైదా ఇన్ ద ఇండియన్ సబ్‌కాంటినెంట్ (ఏక్యూఐఎస్) అని విస్పష్టంగా పేర్కొంది. గత ఏడాది నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఉన్న రద్దీ మార్గంలో కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 11 మంది మరణింగా, పలువురు గాయపడ్డారు. మొదట్లో ఈ ఆత్మాహుతి దాడి వెనుక ఉన్నది పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్ర సంస్థ అని అంతా అనుమానించారు. పేలుడు జరిగిన కారు నడిపిన వ్యక్తిని ఉమర్-ఎ-నబీగా విచారణ అధికారులు గుర్తించారు. అతడే ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని విచారణలో తేలింది. అయితే.. ఉగ్ర కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచే యూఎన్‌ఎస్సీ ఈ ఏడాది అగస్టు 10 (సోమవారం) విడుదల చేసిన నివేదిక ఢిల్లీ ఎర్రకోట కారు పేలుడు సూత్రధారి జైష్-ఎ-మొహమ్మద్ కాదనీ, అల్‌ఖైదా ప్రాంతీయ విభాగమైన ఏక్యూఐఎస్ అనీ తేల్చింది. 2014వ సంవత్సరంలో రూపుదిద్దుకున్న ఏక్యూఐఎస్ సంస్థ.. ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఆప్ఘనిస్థాన్ వంటి దక్షిణ ఆసియా దేశాల్లో అల్‌ఖైదా నెట్‌వర్క్, ఉగ్ర భావజాలాన్ని విస్తరించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. గతంలో పెద్ద పెద్ద ముఠాలుగా దాడులు జరిపే పద్ధతికి భిన్నంగా, ఈ సంస్థ ప్రస్తుతం చిన్న చిన్న రహస్య సెల్స్ రూపంలో విడిపోయి, నిశ్శబ్దంగా బలోపేతం అవుతోందని ఆ నివేదికలో యూఎన్‌ఎస్సీ పేర్కొంది. ఈ నివేదిక ఇంకా దక్షిణాసియా ప్రాంతంలో అల్‌ఖైదా, ఐసిస్ వంటి ఉగ్రవాద అనుబంధ సంస్థల దాడుల సామర్థ్యం గణనీయంగా పెరుగుతోందని హెచ్చరించింది. ఈ ఉగ్ర సంస్థలు రసాయన, జీవాయుధాలను సేకరించి.. వాటితో విధ్వంసం సృష్టించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయనీ, కుట్రలు పన్నుతున్నాయనీ వెల్లడించింది. ఎర్రకోట పేలుడులో 11 మంది ప్రాణాలను బలిగొన్న ఘటన వెనుక ఏక్యూఐఎస్ ఉందన్న ఐరాస భద్రతా మండలి నివేదిక ఇండియా భద్రతా సంస్థలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకతను ఎత్తి చూపింది. Red Fort blast, AQIS Al Qaeda, UNSC report, Delhi blast, UN security council terror report

Publish Date: Aug 13, 2026 11:51AM

political-news-img

గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పదవి ఊడుతుందా? బిసిసిఐ సంచలన నిర్ణయం!

భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భవిష్యత్తుపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా మరియు క్రికెట్ వర్గాల్లో తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం, అలాగే సుదీర్ఘ ఫార్మాట్‌లో న్యూజిలాండ్, సౌతాఫ్రికా చేతుల్లో సొంతగడ్డపై ఎదురైన అనూహ్యమైన ఓటములు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి. వైట్ బాల్, రెడ్ బాల్ రెండింటిలోనూ జట్టు ప్రదర్శన గ్రాఫ్ పడిపోవడంతో గంభీర్‌ను హెడ్ కోచ్ పదవి నుంచి తొలగిస్తారనే ప్రచారం ఊపందుకుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (WTC) 2025-27 సైకిల్‌లో 2027 ఫైనల్ రేసులో భారత్ నిలవాలంటే రాబోయే ప్రతీ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. అయితే ఇలాంటి క్లిష్ట సమయంలో భారత క్రికెట్ నియంత్రణ మం‌డలి (బిసిసిఐ) గంభీర్ విషయంలో ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం గంభీర్ కోచింగ్ పదవికి ఎలాంటి ప్రమాదం లేదని, ఆయన బాధ్యత సురక్షితంగానే ఉందని బిసిసిఐ విశ్వసనీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గౌతమ్ గంభీర్‌ను పదవి నుండి తప్పించకపోవడానికి బిసిసిఐ ప్రధానంగా రెండు ముఖ్యమైన కారణాలను విశ్లేషించింది. మొదటిది, భారత టెస్ట్ జట్టు ప్రస్తుతం అత్యంత కీలకమైన 'ట్రాన్సిషన్ ఫేజ్' లేదా మార్పు దశలో ఉంది. సుదీర్ఘ కాలం పాటు జట్టును ముందుండి నడిపించిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్ దిగ్గజ ఆటగాళ్లు ఇటీవల టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. వీరి నిష్క్రమణతో టెస్ట్ జట్టులో ఏర్పడిన లోటును పూడ్చడం రాత్రికి రాత్రే సాధ్యమయ్యే పని కాదు. కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో రూపుదిద్దుకుంటున్న యువ భారత్ నిలదొక్కుకోవడానికి కొంత సమయం పడుతుందని బిసిసిఐ పెద్దలు గుర్తించారు. ఈ మార్పుల సమయంలో కోచ్‌ను మార్చడం జట్టు స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని బోర్డు భావిస్తోంది. రెండో ప్రధాన కారణం, తుది జట్టును తీవ్రంగా వేధిస్తున్న ఆటగాళ్ల గాయాల సమస్య. ముఖ్యంగా సౌతాఫ్రికాతో జరిగిన కీలక టెస్ట్ సిరీస్ మధ్యలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడటం సిరీస్ ఫలితాన్ని తలకిందులు చేసింది. గిల్ అందుబాటులో ఉండి ఉంటే ఆ ఫలితాలు వేరేలా ఉండేవి. రాబోయే శ్రీలంక 2 టెస్టుల పర్యటనకు కూడా గాయాల సమస్య వెంటాడుతోంది. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, యువ టాప్ ఆర్డర్ బ్యాటర్ సాయి సుదర్శన్, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ వంటి కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా దూరమయ్యారు. ఈ అస్థిరమైన పరిణామాలు కోచ్ పనితీరును నేరుగా ప్రభావితం చేశాయని బిసిసిఐ అంచనా వేసింది. gautam gambhir india head coach future wtc 2027,bcci decision on gautam gambhir head coach

Publish Date: Aug 13, 2026 11:38AM

political-news-img

ఉగ్రవాదులతో వేదిక పంచుకున్న పాక్ మాజీ మంత్రి.. ఇండియా అంతు చూస్తామంటూ హెచ్చరిక.!

పాకిస్థాన్ రాజకీయ నాయకులకు, ఉగ్రవాదులకు ఉన్న అనుబంధం మరో సారి వెల్లడైంది. ఆ దేశ మాజీ మంత్రి, అవామీ ముస్లిం లీగ్ అధినేత షేక్ రషీద్ అహ్మద్ ఉగ్రవాదులతో వేదిక పంచుకున్నారు. నిషేధిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాకు చెందిన కీలక ఉగ్ర నేతలతో ఒకే వేదికపై ప్రత్యక్షమైన పాకిస్థాన్ మాజీ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి, అవామీ ముస్లిం లీగ్ అధినేత షేక్ రషీద్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అంతర్జాతీయంగా నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన కీలక నాయకులతో కలిసి ఒకే వేదికపై ప్రత్యక్షమైన ఆయన షేక్ రషీద్ అహ్మద్ ఇండియాపై విషం కక్కారు. విద్వేష పూరిత వ్యాఖ్యతో విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ మాజీ మంత్రి, రాజకీయ నాయకుడు ఉగ్రవాదులతో ఒకే వేదికపై కూర్చుని భారత్ అంతు చూస్తామంటూ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఒక బహిరంగ సభలో షేక్ రషీద్ అహ్మద్ లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ ఖలీద్ మసూద్ సంధు, ఆ ఉగ్ర సంస్థ కేంద్ర సలహా మండలి సభ్యుడు ఖారీ మహమ్మద్ యాకూబ్ షేక్‌లతో కలిసి వేదికను పంచుకున్నారు. ఆ సందర్భంగా ప్రసంగించిన ఆయన తాను లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు బానిసనని బాహాటంగా ప్రకటించారు. భారత్ గనుక పాకిస్థాన్ వైపు కన్నెత్తి చూస్తే.. ఆ దేశాన్ని దేవుడు నాశనం చేస్తాడంటూ శాపనార్ధాలు పెట్టారు. భారత్‌పై దాడి జరిగితే అక్కడ పక్షులు కూయవని, ఆలయాల్లో గంటలు డా మోగవనీ హెచ్చరికలు జారీ చేశారు. గతంలో తాను అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో తన ఫోన్‌లో హఫీజ్ సయీద్ ఫోన్ నంబర్ ఉండటంతో అమెరికా అధికారులు తనను ఆ దేశం నుంచి బహిష్కరించారని రషీద్ స్వయంగా వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ ప్రభుత్వంలో 2020 నుంచి 2022 వరకు మంత్రిగా షేక్ రషీద్ కీలక బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఒక వైపు అంతర్జాతీయ వేదికలపై తాము ఉగ్రవాదానికి వ్యతిరేకమని పాక్ ప్రభుత్వం పదే పదే చెప్పుకుంటూ.. మరో వైపు ఆ దేశ మాజీ మంత్రి ఉగ్రవాదులతో వేదికలు పంచుకోవడం పాక్ నైజానికి ప్రత్యక్ష నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రషీద్ ప్రసంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. Pak terror relations exposed, Sheikh Rashid Ahmed, Hafiz Saeed, Lashkar e Taiba, Pakistan Former Minister, TeluguOne

Publish Date: Aug 13, 2026 11:10AM

political-news-img

కుల్దీప్ యాదవ్ స్పిన్ లీడర్ కావడం సాధ్యమేనా? మురళీ కార్తీక్ షాకింగ్ కామెంట్స్!

భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం కీలకమైన మార్పుల దిశగా పయనిస్తోంది. ప్రత్యేకించి రెడ్ బాల్ క్రికెట్‌లో టీమిండియా స్పిన్ రంగానికి దశాబ్ద కాలంగా వెన్నుముకగా నిలిచిన రవీంద్ర జడేజా తన కెరీర్ చరమాంకానికి చేరుకోవడంతో, భారత స్పిన్ విభాగానికి తదుపరి నాయకుడు ఎవరు అనే ప్రశ్న తీవ్రంగా వినిపిస్తోంది. శ్రీలంకతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్ ఈ నేపథ్యంలో చైనామాన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు అత్యంత కీలకమైన అవకాశంగా మారింది. కుల్దీప్ తన అద్భుతమైన వైవిధ్యంతో మ్యాచ్ విన్నర్‌గా పేరు తెచ్చుకున్నప్పటికీ, టెస్టుల్లో అతనికి సుదీర్ఘ కాలం పాటు క్రమం తప్పకుండా అవకాశాలు లభించకపోవడం పెద్ద లోటుగా పరిణమించింది. ఇంగ్లాండ్ పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్ మొత్తం అతను రిజర్వ్ బెంచ్ కే పరిమితమవ్వడంపై క్రీడా విశ్లేషకులు ఎన్నో ప్రశ్నలు గుప్పించారు. భారత మాజీ స్పిన్నర్ మురళీ కార్తీక్ స్పందిస్తూ, జడేజా తర్వాత స్పిన్ అటాక్‌ను ముందుండి నడిపించే నాయకుడిగా ఎదగడం కుల్దీప్ యాదవ్‌కు అత్యంత కష్టతరమైన సవాల్‌ అని విశ్లేషించారు. వివిధ నాయకుల పర్యవేక్షణలో కుల్దీప్ యాదవ్ ప్రదర్శన గణాంకాలను పరిశీలిస్తే అతని సామర్థ్యం తేటతెల్లమవుతుంది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలో 2017 నుండి 2021 మధ్యకాలంలో కుల్దీప్ అత్యధికంగా 75 మ్యాచ్‌లు ఆడి, 25.34 సగటుతో, 5.12 ఎకానమీ మరియు 29.6 స్ట్రైక్ రేట్‌తో 140 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 4 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి, అత్యుత్తమ ప్రదర్శన 6/25 గా నమోదైంది. అలాగే రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2017 నుండి 2025 వరకు 62 మ్యాచ్‌లలో పాల్గొని, 20.92 అత్యుత్తమ సగటుతో, 4.57 ఎకానమీ మరియు 27.4 స్ట్రైక్ రేట్‌తో 116 వికెట్లు సాధించాడు, అందులో 2 ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. ఇక శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో 2025 నుండి 2026 మధ్య 9 మ్యాచ్‌లు ఆడి 27.65 సగటు, 4.10 ఎకానమీ మరియు 40.4 స్ట్రైక్ రేట్‌తో 23 వికెట్లు (ఒక 5-వికెట్ల హాల్, ఉత్తమ బౌలింగ్ 5/82) సాధించాడు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో 16 మ్యాచ్‌లలో 11.81 అద్భుత సగటుతో 32 వికెట్లు, హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో 11 మ్యాచ్‌లలో 17.06 సగటుతో 15 వికెట్లు, కెఎల్ రాహుల్ నాయకత్వంలో 10 మ్యాచ్‌లలో 23.95 సగటుతో 22 వికెట్లు, శిఖర్ ధావన్ నేతృత్వంలో 7 మ్యాచ్‌లలో 25.50 సగటుతో 10 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా రిషభ్ పంత్, అజింక్య రహానే సారథ్యంలో చెరో 1 మ్యాచ్ ఆడి నాలుగేసి వికెట్లు, ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో 1 మ్యాచ్ ఆడి 19.00 సగటుతో 2 వికెట్లు తీశాడు. murali kartik on kuldeep yadav spin role,kuldeep yadav test record under captains,india next spin leader after jadeja.

Publish Date: Aug 13, 2026 10:58AM

political-news-img

రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ ఆడతాడా? మాథ్యూ హేడెన్ షాకింగ్ కామెంట్స్!

భారత రథసారథి, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో ఊహాగానాలు తీవ్రంగా జోరందుకున్నాయి. 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ మైదానంలో కనిపిస్తాడా లేదా అనే ఆసక్తికరమైన చర్చ అభిమానులతో పాటు దిగ్గజ క్రికెటర్ల మధ్య నడుస్తోంది. ఇప్పటికే టెస్టులు, టీ20 అంతర్జాతీయ ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్ శర్మ కెరీర్ ప్రణాళికపై ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఓపెనర్ మ్యాథ్యూ హేడెన్ అత్యంత కీలకమైన విశ్లేషణను పంచుకున్నాడు. 39 ఏళ్ల వయసులో కూడా రోహిత్ శర్మ ప్రదర్శిస్తున్న ఫిట్‌నెస్, అతనిలో ఇంకా మిగిలి ఉన్న ఎనర్జీ, ఆట పట్ల ఉన్న తీవ్రమైన కసిపైనే అతని 2027 వరల్డ్ కప్ ఫ్యూచర్ పూర్తిగా ఆధారపడి ఉంటుందని హేడెన్ స్పష్టం చేశాడు. ఒక వయసు వచ్చాక ప్రతి అంతర్జాతీయ ప్లేయర్‌కు ఇలాంటి ప్రశ్నలు ఎదురవ్వడం సహజమని, అంతిమంగా రిటైర్మెంట్ నిర్ణయం రోహిత్ పర్సనల్ ఛాయిస్ మాత్రమేనని హేడెన్ పేర్కొన్నాడు. గతంలో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ వంటి భారతీయ దిగ్గజాలు కూడా తమ కెరీర్ ముగింపు దశలో ఇలాంటి సవాళ్లనే ఎదుర్కొన్నారని హేడెన్ గుర్తుచేశాడు. ప్రతిరోజూ యంగ్ ఏజ్ ఎనర్జీతో మైదానంలోకి దిగి అత్యుత్తమ ప్రదర్శన చేయడం ఏ ఆటగాడికైనా పెద్ద సవాలేనని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే సుదీర్ఘమైన టెస్ట్ క్రికెట్ నుండి తప్పుకున్నప్పటికీ, ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) కాంట్రాక్ట్‌తో పాటు బిజీగా ఉండే అంతర్జాతీయ వన్డే షెడ్యూల్‌ను హ్యాండిల్ చేయడం రోహిత్‌కు ఫిజికల్ మరియు మెంటల్ ఛాలెంజ్‌గా మారిందని తెలిపాడు. అయినప్పటికీ, మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారీ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో విమర్శకుల నోళ్లు మూయించడం హిట్‌మ్యాన్‌కు మొదటి నుంచీ అలవాటేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రోహిత్ శర్మలోని బ్యాటింగ్ పవర్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదని నిరూపించడానికి ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో జరిగిన వన్డే సిరీస్ ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది. ఆ జూలై వన్డే సిరీస్‌లో టీమిండియా 2-1 తేడాతో సిరీస్‌ను కోల్పోయినప్పటికీ, రోహిత్ బ్యాట్ నుండి పరుగుల వరద పారింది. ముఖ్యంగా చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన చివరి మ్యాచ్‌లో 388 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించింది. కేవలం 110 బంతుల్లో 17 ఫోర్లు, 5 అద్భుతమైన సిక్సర్లతో 138 పరుగులు బాది తన వరల్డ్ క్లాస్ స్టామినాను నిరూపించుకున్నాడు. ఆ మొత్తం సిరీస్‌లో రోహిత్ 3 మ్యాచుల్లో 58.33 సగటు (Average), 98.31 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 175 పరుగులు సాధించాడు. లార్డ్స్ వన్డేలో విరాట్ కోహ్లీ సాధించిన 74 పరుగుల సహకారంతో రోహిత్ చేసిన సెంచరీ పార్టనర్‌షిప్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. rohit sharma retirement plans matthew hayden comments,hitman rohit sharma odi records world cup 2027.

Publish Date: Aug 13, 2026 10:55AM

MOVIE NEWS