Top Stories

political-news-img

పార్లమెంట్ సమావేశాల్లో ఎన్డీఏ వ్యూహాత్మక అడుగులు..!

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో జాతీయ రాజకీయం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగింది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీ (బిజెపి) సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి నూతనోత్సాహాన్ని అందించగా, విపక్ష 'ఇండియా' (INDIA) కూటమిలో తీవ్ర అంతర్మథనం మొదలైంది. ఉభయ సభల్లోనూ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఎన్డీఏ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ వడ్డే వెంకటేశ్వరరావు మరో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ మధ్య ఆసక్తికర విశ్లేషణ టోన్‌ న్యూస్‌లో జరిగింది. వర్షాకాల సమావేశాలు - ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఈసారి పార్లమెంట్ సమావేశాలలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు, మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు, అత్యంత సున్నితమైన నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) వంటి కీలక ప్రతిపాదనలు చర్చకు రానున్నాయి. సభా కార్యకలాపాలను అడ్డుకోకుండా బిల్లులను వేగంగా క్లియర్ చేయాలనేది ప్రభుత్వ యోచనగా ఉంది. మరోవైపు విపక్షాలు నిరుద్యోగం, ప్రశ్నాపత్రాల లీకేజీలు, వివిధ ప్రాంతీయ వివాదాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సమాయత్తమవుతున్నాయి. అయితే, సభలో నిరసనలకు మాత్రమే పరిమితం కాకుండా స్పష్టమైన విధాన ప్రకటనలు చేయాలనే ఒత్తిడి విపక్షాలపై పెరుగుతోంది. వ్యూహాలు - పరిణామాలుఈ సమావేశాల్లో ఎన్డీఏ అనుసరిస్తున్న ప్రధాన వ్యూహం—కాంగ్రెస్ పార్టీని సభలోనూ, బయట కూడా రాజకీయంగా ఏకాకిని చేయడం. ఎన్డీఏ పరిధిలో లేని కొన్ని మిత్రపక్షాలతో సైతం సత్సంబంధాలు నెరపుతూ ప్రతిపక్ష దాడిని తిప్పికొట్టేలా వ్యూహరచన పూర్తయింది. విపక్ష కూటమిలో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది దక్షిణాది ఆందోళనలు: జనాభా ప్రాతిపదికన జరిగే నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఉత్తరాదికి సీట్లు పెరిగి, దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే అనుమానాలు డిఎంకె వంటి భాగస్వామ్య పక్షాల్లో వ్యక్తమవుతున్నాయి. కూటమిలో చీలికలు: తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, లెఫ్ట్ పార్టీల మధ్య సరైన అవగాహన కొరవడింది. ప్రజా ఉద్యమాల విషయంలో కాంగ్రెస్ చొరవ చూపడం లేదనే అసంతృప్తి మిగిలిన విపక్షాల్లో పెరుగుతోంది.దీని ఫలితంగా 'ఇండియా' కూటమి ఏకీకృత శక్గా పోరాడలేక బలహీనపడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భవిష్యత్తు రాజకీయ ప్రభావం2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏర్పడిన రాజకీయ స్థితిగతులను బిజెపి తన అనుకూలంగా మలచుకోవడంలో విజయవంతమైంది. ఈ సమావేశాల ద్వారా 2029 సాధారణ ఎన్నికలకు లేదా 'ఒకే దేశం - ఒకే ఎన్నికలు' (జమిలీ ఎన్నికలు) దిశగా స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసుకోవడం ఎన్డీఏ ప్రాథమిక లక్ష్యం.ప్రతిపక్షాలు తమ అంతర్గత విభేదాలను పక్కనబెట్టి, దక్షిణాది రాష్ట్రాల హక్కులు మరియు ప్రజా సమస్యలపై స్పష్టమైన ప్రత్యామ్నాయ వ్యూహంతో ముందుకు రాకపోతే, రాబోయే రోజుల్లో పార్లమెంటరీ రాజకీయంలో ఎన్డీఏ ఏకపక్ష ఆధిపత్యం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి అంశాలపై పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి.

Publish Date: Jul 21, 2026 3:42PM

political-news-img

గతం మరిచారా జగన్?

ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో కరోనా కాలం నాటి తీవ్ర కలకలానికి కారణమైన డాక్టర్ సుధాకర్ ఉదంతం మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కొవిడ్ సమయంలో తాము అందించిన వైద్య సేవలు, ఆరోగ్య రంగానికి చేసిన మేలు గురించి ప్రకటనలు చేయడంతో పాటు రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసుల ఉధృతి పెరుగుతున్నా ప్రభుత్వం ఎటువంటి చర్యలూ చేపట్టడం లేదంటూ వైసీపీ విమర్శలు గుప్పించడంతో డాక్టర్ సుధాకర్ ఉదంతాన్ని గుర్తు చేస్తూ నెటిజనులు వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో కరోనా మహమ్మారి తొలి విడత ఉధృతంగా ఉన్న సమయంలో, నర్సీపట్నం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్ కే. సుధాకర్ రావు ప్రభుత్వ వైద్యులకు, సిబ్బందికి ప్రాథమిక రక్షణ పరికరాలైన ఎన్ 95 మాస్కులు, పీపీఈ కిట్లు అందుబాటులో లేవని బహిరంగంగా విమర్శించారు. ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న వైద్యులకు కనీస రక్షణ కల్పించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పటి వైసీపీ సర్కార్.. సమస్యను పరిష్కరించాల్సింది పోయి, డాక్టర్ సుధాకర్ పై సస్పెన్షన్ వేటు వేసి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే నెపంతో వేధింపులు ప్రారంభించింది. మాస్కుల కొరతపై మాట్లాడిన కొద్ది రోజులకే విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం రహదారిపై డాక్టర్ సుధాకర్‌ను పోలీసులుఆయనను అదుపులోనికి తీసుకుని, చొక్కా లేకుండా ఉన్న ఆయన చేతులను వెనక్కి విరిచి కట్టడం, వీధిలో ఈడ్చుకెళ్లి ఆటోలో పడేయడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి జాతీయ స్థాయిలో నిరసనలకు దారితీశాయి. పోలీసులు ఆయనపై కేసులు నమోదు చేయడమే కాకుండా, ఆయన మానసిక స్థితి సరిగా లేదంటూ కేజీహెచ్‌కు, ఆ తర్వాత మానసిక చికిత్సాలయానికి తరలించారు. ఈ దారుణ ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించి, పోలీసుల దాష్టీకంపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ప్రభుత్వ వేధింపులు, మానసిక ఒత్తిడి తాళలేక చివరకు సుధాకర్ గుండెపోటుతో కన్నుమూశారు. ఇక ప్రస్తుతానికి వస్తే.. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ కొవిడ్ సమయంలో తాము అద్భుతంగా పనిచేశామని, వైద్య కళాశాలలు నిర్మించామని చెప్పుకుంటూ.. ఇప్పుడు రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతున్నా అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందంటూ వైసీపీ విమర్శల పర్వం మొదలు పెట్టింది. మందులు లేవు.. మాస్కులు లేవు అంటూ వైసీపీ సొంత మీడియా సోషల్ మీడియా కథనాలు వండి వారుస్తోంది. కరోనా కేసులో క్రమంగా పెరుగుతున్నా పరీక్షా కేంద్రాలు, ఆసుపత్రులలో ప్రత్యేక వార్డులు, ఏర్పాట్లు, వాక్సినేషన్ వంటివి ఏర్పాటు చేయలేదని, ఈ కారణంగా కరోనాతో చనిపోతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఆ కథనాల్లో పేర్కొంటోంది. దీంతో గతం మరిచారా జగన్ అంటూ.. డాక్టర్ సుధాకర్ ఉదంతాన్ని గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ycp carona comments, netizens remember, sudhakar, incident

Publish Date: Jul 21, 2026 3:41PM

political-news-img

ఢిల్లీలో సీజేపీ నిరసన హింసాత్మకం.. 5 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు..!

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోమవారం నాడు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఛలో సంసద్' పార్లమెంట్ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు, హింసాత్మక ఘటనలకు దారితీసింది. శాంతియుతంగా నిరసన తెలపాల్సిన ఈ కార్యక్రమం ఒక్కసారిగా అదుపుతప్పి పోలీసులతో ఘర్షణకు దారితీయడంతో రాజధాని వీధులు రణరంగంగా మారాయి. సీజేపీ కార్యకర్తలు, ఆందోళనకారులు పార్లమెంట్ వైపు దూసుకుపోవడానికి ప్రయత్నించడంతో భద్రతా దళాలు వారిని నిరోధించాయి. ఈ క్రమంలో రెండు వర్గాల నడుమ తీవ్రమైన ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో ఢిల్లీ పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఈ హింసాత్మక ఘటనలపై ఢిల్లీ పోలీస్ శాఖ అత్యంత తీవ్రంగా స్పందిస్తూ మొత్తం ఐదు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసింది. కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్, పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లతో పాటు పరిసర ప్రాంతాల పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదయ్యాయి. అనుమతి లేకుండా ఆందోళన వద్ద డ్రోన్లను ఎగరేయడం, ముందస్తు కుట్ర పన్ని హింసను ప్రేరేపించడం, విధి నిర్వహణలో ఉన్న భద్రతా సిబ్బందిపై విచక్షణారహితంగా దాడులకు తెగబడటం, మరియు ప్రభుత్వ, ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం వంటి తీవ్రమైన నేరారోపణలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రాజధానిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన ఎవరినీ విడిచిపెట్టేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఘర్షణల తీవ్రతకు అద్దం పడుతూ ఏకంగా 118 మంది భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురు సీనియర్ పోలీస్ అధికారులు కూడా ఉండటం గమనార్హం. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పాటు పోలీసు వాహనాలపై దాడులు చేసి ధ్వంసం చేశారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ త్రోపులాటలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్) అసిస్టెంట్ మహిళా కమాండెంట్ సోనియా షెరావత్ తీవ్రంగా గాయపడగా, ఆమె చేయి విరిగినట్లు వెల్లడైంది. నిరసన సమయంలో తొక్కిసలాటలో చిక్కుకున్న మహిళా ఆందోళనకారులను రక్షించేందుకు తాను ప్రయత్నిస్తుండగా, నిరసనకారులు తనపైకి దూసుకొచ్చి దాడికి పాల్పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హింసకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టేందుకు ఢిల్లీ పోలీసులు సమగ్ర దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటివరకు 70 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనా స్థలంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను, అలాగే ప్రత్యక్ష సాక్షులు మరియు డిజిటల్ మీడియా ద్వారా సేకరించిన మొబైల్ ఫోన్ వీడియోలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దాదాపు 250కి పైగా వీడియో రికార్డింగ్లను డీహైడ్రేట్ చేసి, శాస్త్రీయంగా విశ్లేషిస్తూ హింసకు ప్రేరేపించిన వారిని, రాళ్లదాడికి దిగిన వారిని గుర్తిస్తున్నారు. అంతేకాకుండా, ఈ ఆందోళన కార్యక్రమానికి ప్రచారం కల్పించిన, కార్యకర్తలను సమీకరించిన పలు వాట్సాప్ గ్రూప్‌లపై కూడా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. మంగళవారం కూడా కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతుండటంతో ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను పటిష్టం చేశారు. Delhi Jantar Mantar violence, CJP protest Delhi, Delhi Police FIRs, Chalo Parliament march, Jantar Mantar clash news, CJP protest CCTV footage

Publish Date: Jul 21, 2026 3:19PM

political-news-img

భోగాపురం భూ నిర్వాసిత రైతులకు చంద్రబాబు బంపర్ గిఫ్ట్.. ఏంటో తెలుసా?

ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మితమై వచ్చే నెల 1న ప్రారంభోత్సవానికి ముస్తాబైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం భూములు త్యాగం చేసిన రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు బంపర్ గిఫ్ట్ ప్రామిస్ చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రగతికి ఊపిరి పోసేందుకు తమ జీవనాధారమైన భూములను ప్రభుత్వం సేకరించడానికి సహకరించిన రైతులకు కృతజ్ఞతగా, గౌరవంగా భోగాపురం విమానాశ్రయం నుంచి ఉచితంగా ఒకసారి విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించారు. ఈ మేరకు ఆయన అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. రాజధాని అభివృద్ధి, ప్రాంతీయ విమానాశ్రయాల విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పనలో నిర్వాసితుల పాత్ర గుర్తింపునకు చంద్రబాబు నిర్ణయం ఒక మైలురాయిగా నిలుస్తుందని పరిశీలకులు అంటున్నారు. విజయనగరం జిల్లా పరిధిలో రూపుదిద్దుకున్న భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వచ్చే నెల 1న ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం ప్రకారం, భోగాపురం విమానాశ్రయ భూసేకరణ ప్రక్రియలో తమ పట్టా భూములను, సాగు భూములను అందించిన ప్రతీ ఒక్క రైతు కుటుంబానికి ఈ వన్-టైమ్ ఫ్రీ ఫ్లైట్ జర్నీ సదుపాయం వర్తిస్తుంది. గతంలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణ ప్రాంతంగా ఉన్న తమ సొంత నేల నుంచి నేడు దేశ విదేశాలకు విమానాలు ఎగిరిపోతుంటే, ఆ ప్రయాణంలో తొలి భాగస్వాములుగా ఇక్కడి రైతులే ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ పంట పొలాలు ఏ స్థలంలోనైతే ఉండేవో, అదే స్థలంలో రూపుదిద్దుకున్న రన్‌వే పైనుంచి విమానంలో నింగికి ఎగరడం రైతులకు ఒక మరుపురాని అనుభూతిని ఇస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ప్రత్యేక పాస్‌లు, ప్రయాణ మార్గదర్శకాలను త్వరలోనే వెల్లడించనున్నారు. Bhogapuram Airport, CBN Free Air Travel, Bhogapuram Farmers

Publish Date: Jul 21, 2026 3:09PM

political-news-img

చంద్రబాబు అరెస్ట్‌ అయినప్పుడు స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్న వ్యక్తికి టీటీడీలో కీలక పదవి.!

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనాపరంగా చక్కటి పని తీరు కనబరుస్తోంది. వివిధ శాఖల్లో ప్రక్షాళన చర్యలు చేపడుతున్నది. అయితే కొన్ని విషయాలలో మాత్రం పార్టీగా తప్పుటడుగులు వేస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం లో జరిగిన ఒక నియామకం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనూ, దేవస్థాన వర్గాల్లోనూ తీవ్ర సంచలనంగా మారింది. జగన్ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్కిల్ కేసులో అక్రమంగా అరెస్టైన సంగతి తెలిసిందే. ఈయన అరెస్ట్ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచి మరీ సంబరాలు చేసిన ఒక వ్యక్తిని ఇప్పుడు తెలుగుదేశం కూటమి సర్కార్ టీటీడీలో కీలక పోస్ట్ లో నియమించడం కలకలం రేపుతోంది. 2023లో స్కిల్ డెవలప్‌మెంట్ కేసు నెపంతో అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిని సిఐడి అధికారులు అరెస్ట్ చేసిన సంగతి విదితమే. ఆ సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) హోదాలో విధులు నిర్వర్తిస్తున్న ఒక అధికారి.. అత్యుత్సాహం ప్రదర్శించారు. చంద్రబాబు అరెస్టును పురస్కరించుకుని స్వీట్లు పంచారు. అక్కడితో ఆగకుండా చంద్రబాబు జైలులోనే మరణిస్తే పండుగ చేస్తానంటూ అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రభుత్వ సర్వీసులో బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ, ఒక రాజకీయ పార్టీకి కొమ్ముకాయడమే కాకుండా, సీనియర్ నాయకుడి అరెస్ట్‌పై హర్షం వ్యక్తం చేయడం అప్పట్లో వివాదంగా మారింది. ఒక రాజకీయ నాయకుడి పట్ల ఇటువంటి ద్వేషపూరిత భావజాలాన్ని ప్రదర్శించడం సరికాదని తోటి సిబ్బంది ఆయనను వారించినప్పటికీ పట్టించుకోలేదని సమాచారం. ఆయన అప్పట్లో వైసిపికి కరడుగట్టిన మద్దతుదారుడిగా వ్యవహరిస్తూ ఇష్టారీతిగా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. 2024 ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రజా తీర్పుతో వైసీపీ ప్రభుత్వం గద్దెదిగి, అఖండ మెజారిటీతో తెలుగుదేశం కూడటమి అధికారం చేపట్టింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తరువాత.. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ పక్షపాతంతో, కక్షపూరితంగా ప్రవర్తించిన అధికారులను గుర్తించి వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారని అందరూ భావించారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడి అరెస్ట్ వేళ అత్యంత వివాదాస్పదంగా వ్యవహరించిన ఈ టీటీడీ ఏఈఈపై కఠిన చర్యలు ఉంటాయని, ఆయనను విధులకు దూరంగా ఉంచుతారని టీటీడీ ఉద్యోగ వర్గాలు, టిడిపి శ్రేణులు భావించాయి. అయితే అందుకు పూర్తి భిన్నంగా జరిగింది. సదరు వివాదాస్పద ఏఈఈ స్థాయి అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్దుబాట్లు, పోస్టింగ్‌లలో ఆయనకు కీలక స్థానం దక్కింది. ప్రస్తుతం ఆయన టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఏఈఈ హోదాలోనే అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. గతంలో చంద్రబాబుపై అత్యంత దారుణంగా విషం చిమ్మిన వ్యక్తికే తెలుగుదేశంకూటమి ప్రభుత్వంలో కీలక పదవి దక్కడం వెనుక అసలు రహస్యం ఏమిటనే దానిపై టీటీడీ పరిపాలనా భవనంలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పాటిస్తున్నామని చెబుతున్న వేళ ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ పరిణామం అటు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న సాధారణ ఉద్యోగులను, ఇటు తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఐదేళ్ల వైసిపి పాలనలో తీవ్ర వేధింపులను తట్టుకుని పార్టీ కోసం నిలబడిన కార్యకర్తలకు తమ అధినేతను దూషించిన వ్యక్తికి కీలక పోస్టింగ్ దక్కడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వం మారినప్పటికీ కొందరు ఉన్నతాధికారుల నిర్లక్ష్యం లేదా అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగానే ఇలాంటి వివాదాస్పద వ్యక్తులకు రక్షణ లభిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ పెద్దల దృష్టికి రాకుండానే సదరు అధికారి తన పలుకుబడి ఉపయోగించుకుని ఈ పోస్టింగ్ పొంది ఉంటారని ప్రచారం జరుగుతోంది. భవిష్యత్తు పరిణామాల విషయానికి వస్తే.. తిరుమల వంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో పనిచేసే సిబ్బందికి రాజకీయ తటస్థత, క్రమశిక్షణ అత్యంత అవసరం. భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న ఆధ్యాత్మిక సంస్థలో రాజకీయ ద్వేషాలను ప్రదర్శించిన వ్యక్తులను ప్రోత్సహిస్తే సమాజంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని పరిశీలకులు అంటున్నారు. . ఈ వివాదాస్పద నియామకంపై ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతుండటంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, టీటీడీ ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. CBN Arrest Controversy, TTD AEE Official Posting, NDA Government, Tirumala Tirupati Devasthanams News, TTD Employee SweetsDistribution

Publish Date: Jul 21, 2026 2:53PM

political-news-img

షూటింగ్‌లో బాలకృష్ణకు గాయం.. ఫోన్‌లో పరామర్శించిన లోకేష్..!

కాకినాడలో జరుగుతున్న NBK111 సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడిన ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నంద మూరి బాలకృష్ణను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శిం చారు. ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకోవడంతో పాటు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. షూటింగ్‌లో యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో బాలకృష్ణ స్వల్పంగా జారి మోకాలికి గాయమైనట్లు సమాచారం. వెంటనే చిత్ర యూనిట్ ఆయనను సమీప ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కొద్దిరోజుల విశ్రాంతి అనంతరం తిరిగి షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫోన్‌లో మాట్లాడిన మంత్రి నారా లోకేష్, "బాలా మామయ్య త్వరగా పూర్తిగా కోలుకుని మళ్లీ యథావిధిగా షూటింగ్‌లో పాల్గొనాలి" అని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కాకినాడ పోర్ట్ ఏరియాలో వేసిన ప్రత్యేక సెట్‌లో వర్సటైల్ నటుడు మంచు మనోజ్, బాలకృష్ణ మధ్య ఒక హై-వోల్టేజ్ డ్యూయెల్ ఫైట్ సీక్వెన్స్‌ను దర్శకుడు గోపీచంద్ మలినేని చిత్రీకరిస్తున్నారు. 60 ఏళ్లకు పైబడిన వయసులోనూ డూప్ లేదా స్టంట్ మెన్ల సహాయం తీసుకోకుండా రియలిస్టిక్ యాక్షన్ సీన్లు చేయడం బాలయ్యకు అలవాటు. ఈ క్రమంలోనే ఏకాగ్రతతో రిస్కీ ఫైట్ సీన్ చేస్తున్న సమయంలో బాలకృష్ణ ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డారు. దీనితో ఆయన మోకాలి భాగం తీవ్రంగా మెలికపడి దెబ్బతింది. మోకాలి వద్ద విపరీతమైన నొప్పితో బాధపడటంతో చిత్ర యూనిట్ సభ్యులు తక్షణమే స్పందించి షూటింగ్‌ను అక్కడికక్కడే నిలిపివేశారు. ప్రమాదం జరిగిన వెంటనే మూవీ టీమ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాలకృష్ణను కాకినాడలోని సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. అక్కడి వైద్యుల బృందం ఆయనకు ప్రాథమిక చికిత్స అందించడంతో పాటు గాయం తీవ్రతను అంచనా వేయడానికి మోకాలికి అవసరమైన స్కానింగ్ పరీక్షలు, ఎక్స్-రేలు నిర్వహించింది. బాలయ్య షూటింగ్ స్పాట్‌లో గాయపడ్డారనే వార్త క్షణాల్లో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించడంతో నందమూరి అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కాకినాడలోని ఆసుపత్రి ప్రాంగణానికి అభిమానులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో అక్కడ సందడి నెలకొంది. తమ అభిమాన హీరో ఆరోగ్యం గురించి నిజానిజాలు తెలుసుకోవడానికి వేలాది మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆరా తీయడం ప్రారంభించారు.ఈ క్రమంలో అభిమానుల కంగారును తుడిచిపెడుతూ దర్శకుడు గోపీచంద్ మలినేని సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా హెల్త్ అప్‌డేట్ ఇచ్చారు. కాకినాడ పోర్ట్ వద్ద యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నప్పుడు బాలకృష్ణ మోకాలికి ఒక చిన్న మజిల్ టియర్ (కండరాల గాయం) అయిందని ఆయన స్పష్టం చేశారు. Balakrishna injured during shooting, NBK111 Movie, Kakinada Port Area, Gopichand Malineni, TDP, CM Chandrababu, Naralokesh

Publish Date: Jul 21, 2026 2:52PM

MOVIE NEWS