TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తాజా వార్తలు మరిన్ని →

రాజకీయంమరిన్ని →

political-news-img

టీడీపీ, జనసేన మధ్య పెరుగుతున్న దూరం.. ఏపీ కూటమిలో ఏం జరుగుతోంది..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. ‘రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు’ అనే సూత్రం ప్రకారం కూటమి ఏర్పడినప్పటికీ.. క్షేత్రస్థాయిలో స్థానిక పోరు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు భాగస్వామ్య పార్టీల మధ్య కొత్త సవాళ్లను తెరపైకి తెస్తున్నాయి.ఇలాంటి అంశాలపై ‘వాస్తవ వేదిక’ కార్యక్రమంలో ‘జమీన్ రైతు’ ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్, తెలుగువన్ ఎం.డీ. కంఠమనేని రవిశంకర్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైఖరి కూటమి ప్రభుత్వంపై ఆయనకున్న అసంతృప్తిని పరోక్షంగా తెలియజేస్తోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వరుసగా నాలుగు కేబినెట్ సమావేశాలకు హాజరుకాకపోవడం, అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాల సమయంలో నియోజకవర్గ పర్యటనలకు ప్రాధాన్యం ఇవ్వడం, అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నప్పటికీ సభకు హాజరుకాకపోవడం వంటి పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.మరోవైపు.. టీడీపీ, జనసేన మధ్య సమాచార వారధులుగా వ్యవహరించిన కీలక నాయకుల వ్యాపార, వ్యక్తిగత ప్రాధాన్యతలు పెరుగుతున్నాయనే భావనతో జనసేన రాజకీయ ప్రయోజనాలపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీల వ్యూహాలు.. అంతర్లీన పరిణామాలు.. రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ, జనసేన తమ తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. జనసేన వ్యూహం: నరసరావుపేట, భీమవరం, మచిలీపట్నం వంటి ప్రాంతాల్లో స్థానికంగా తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు జనసేన నాయకులు స్వయంగా మేయర్, చైర్మన్ అభ్యర్థులను ప్రకటించుకుంటున్నారు. ఈ ప్రకటనలకు పార్టీ అధిష్ఠానం నుంచి స్పష్టమైన అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడం.. టీడీపీపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగానే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టీడీపీ వైఖరి.. కూటమి భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూనే.. రాష్ట్రవ్యాప్తంగా తమ సొంత రాజకీయ బలాన్ని మరింత స్థిరీకరించుకోవడం టీడీపీ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే కీలక అంశాల్లో సీట్ల పంపకంపై తక్కువ వాటా ప్రతిపాదనలు, ఇరు పార్టీల మధ్య సమాచార లోపం వంటి అంశాలు జనసేనలో అభద్రతా భావాన్ని పెంచుతున్నాయనే చర్చ జరుగుతోంది. భవిష్యత్ రాజకీయ ప్రభావం.. టీడీపీ–జనసేన మధ్య అంతర్గత విభేదాలు, స్పష్టమైన సమన్వయం లోపించడం రాబోయే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో జనసేన శ్రేణులు టీడీపీ అభ్యర్థులకు పూర్తి స్థాయిలో సహకరించని పరిస్థితి ఏర్పడితే.. కూటమి ఎన్నికల ఫలితాలపరంగానే కాకుండా రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అదే సమయంలో.. కూటమి భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూనే తమ సొంత రాజకీయ గుర్తింపు, మైలేజీని కాపాడుకునేందుకు జనసేన చేస్తున్న ప్రయత్నాలు రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలను మరింత ఆసక్తికర మలుపులు తిప్పే అవకాశం కనిపిస్తోంది. ( Vasthava Vedika, Dolendra Prasad, Ravi Shankar, AP Politics, Pawan Kalyan, TDP-Janasena Alliance, CM Chandrababu Naidu, AP Municipal Elections, TDP, Janasena, Andhra Pradesh Politics, AP Government, Nara Lokesh, Amaravati Politics, Political Analysis)

Published on: Thu Sep 3, 2026 9:42PM

political-news-img

క్యాబినెట్ నుంచి కొండా సురేఖ బర్తరఫ్..? గవర్నర్‌కు సీఎం లేఖ..!

తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. రాష్ట్ర మంత్రివర్గం నుంచి మంత్రి కొండా సురేఖను తప్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకే క్యాబినెట్ నుంచి ఆమెను బర్తరఫ్ చేయాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా రాజ్‌భవన్‌కు అధికారిక లేఖ పంపించారు. తాజా సమాచారం ప్రకారం, ముఖ్యమంత్రి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సీఎస్ హుటాహుటిన గవర్నర్‌కు సమాచారం అందించారు. ఈ లేఖ ప్రస్తుతం గవర్నర్ పరిశీలనలో ఉంది. మంత్రి సురేఖ తొలగింపు ప్రతిపాదనపై గవర్నర్ అతి త్వరలోనే తుది నిర్ణయం తీసుకుని, ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పాలనా యంత్రాంగంలోనూ, పలు కీలక పదవుల్లోనూ ప్రభుత్వం పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు చేపట్టింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న జి. చిన్నారెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఆయన స్థానంలో జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని నూతన వైస్ ఛైర్‌పర్సన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రాష్ట్ర మహిళా కమిషన్ నూతన అధిపతిగా నేరెళ్ల శారదకు కీలక బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలో మహిళల రక్షణ, వారి సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు శారదను మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ వరుస నియామకాలతో కాంగ్రెస్ వర్గాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. పాలనాపరమైన శైలిని వేగవంతం చేయడంతో పాటు, పార్టీలోని పలు కీలక సమీకరణాలను దృష్టిలో ఉంచుకునే సర్కార్ ఈ సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొండా సురేఖ స్థానంలో ఎవరికి చోటు దక్కుతుందనే అంశంపై ఇప్పటికే కాంగ్రెస్ అంతర్గత వర్గాల్లో విపరీతమైన చర్చ మొదలైంది. కొద్ది రోజులుగా మంత్రుల తీరు మరియు పార్టీ అంతర్గత రాజకీయాలపై విస్తృత చర్చలు జరుగుతున్న నేపథ్యంలో, సీఎం తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా బీసీ నేతలపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుందనే విశ్లేషణలు సాగుతున్నాయి. రాజ్‌భవన్‌ నుంచి కొండా సురేఖ బర్తరఫ్ ఆమోదముద్ర పడిన వెంటనే కొత్త మంత్రి వర్గ విస్తరణపై ప్రకటన వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. రాబోయే గంటల్లో తెలంగాణ రాజకీయాల్లో మరిన్ని సంచలన పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. (Konda Surekha Bartaraf, CM Revanth Reddy, Telangana Cabinet, Telangana Politics, Revanth's Sensational Decision)

Published on: Thu Sep 3, 2026 2:44PM

political-news-img

తెలంగాణ సీఎం పోస్టు ఖాళీగా ఉందా.. కోమటిరెడ్డి వ్యాఖ్యల అర్ధం ఏంటి?

తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి ఖాళీగా ఉందా? లేక ఖాళీ అవ్వబోతోందా? అన్న అనుమానాలు రేకెత్తేలా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. ఆయన తాజాగా తాను తెలంగాణ సీఎం కావడం ఖాయం, దానిని ఎవరూ అడ్డుకోలేరంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. అంతే కాకుండా ఆయన వ్యాఖ్యలు తెలంగాణ అధికార కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయన్న విషయాన్నీ బహిర్గతం చేశాయి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు. తమ కుటుంబం ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకే కట్టుబడి ఉందనీ, పార్టీ కోసం కష్టపడిన అసలు సిసలైన నాయకులకు గుర్తింపు దక్కాల్సిన అవసరం ఉందన్నారు. అంతే కాకుండా తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతానని, ఆ పదవిని తాను కచ్చితంగా చేపడతానని విస్పష్టంగా చెప్పారు. ప్రజా సేవలో శ్రమిస్తున్న తమ లాంటి నాయకులకు ప్రజల మద్దతు ఉన్నంతవరకు పదవులు దక్కకుండా ఎవరూ అడ్డుకోలేరన్న కోమటిరెడ్డి.. తెలంగాణలో కొందరు నేతలు పార్టీని తమ గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తున్నారని, అలాంటి ప్రయత్నాలను సహించేది లేదని హెచ్చరించారు. గత కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, సీఎం మార్పు చర్చల నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పార్టీలో తొలి నుంచీ ఉన్న నాయకులు, మధ్యలో ఇతర పార్టీల నుంచి వచ్చి చేరి కీలక స్థానాలలో కొనసాగుతున్న నాయకుల మధ్య ఆధిపత్య పోరు అంటూ జరుగుతున్న ప్రచారానికి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వ్యాఖ్యలు బలం చేకూర్చేలా ఉన్నాయి. సొంత పార్టీ నాయకత్వ శైలిని ప్రశ్నిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను ఒక్కసారిగా పెంచేశాయి. ఓ వైపు కొండా సురేఖ వ్యవహారం హాట్ టాపిక్ గా కొనసాగుతున్న తరుణంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో తేటతెల్లం చేశాయి. రానున్నరోజులలో కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మరింత పెచ్చరిల్లే అవకాశాలున్నాయని పరిశీలకులు రాష్ట్ర పార్టీలో ఇటీవలి కాలంలో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలను ఉటంకిస్తూ విశ్లేషిస్తున్నారు. [Sensation in Telangana Politics, Komatireddy, CM Comments, Telangana CM, Telugu One]

Published on: Thu Sep 3, 2026 1:23PM

political-news-img

కాంగ్రెస్ కు కొండా సురేఖ గుడ్ బై?.. ఆమె మాటల సారాంశం అదేనా?

తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు మంత్రి కొండా సురేఖ నెక్స్ట్ స్టెప్ ఏమిటన్న దానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇందుకు బుధవారం (సెప్టెంబర్ 2) రోజంతా ఢిల్లీ వేదికగా జరిగిన హై డ్రామాయే కారణం. కొండా సురేఖ వ్యవహారంపై హస్తినలో బుధవారం (సెప్టెంబర్ 2) కీలక పరిణామాలు జరిగాయి. ఒక వైపు ఇదే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో చర్చించారు. మరో వైపు కొండా సురేఖ కోరినప్పటికీ వారి అప్పాయింట్ మెంట్ ఆమెకు దొరక లేదు. దీనిని బట్టే కొండా సురేఖకు కేబినెట్ నుంచి ఉద్వాసన ఖాయమన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనూ కాకుండా పరిశీలకుల్లో సైతం వ్యక్తమైంది. అయితే ఈ విషయంలో కొండా సురేఖ.. హైకమాండ్ నిర్ణయంతో సంబంధం లేకుండా సొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పరిశీలకులు విష్లేసిస్తున్నారు. ఇందుకు ఆమె మీడియా ఎదుట చేసిన వ్యాఖ్యలను ఉదాహరణగా చూపుతున్నారు. హస్తిన వేదికగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఆమె నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనే విమర్శనాస్త్రాలు సంధించారు. అలాగే మంత్రి పొంగులేటి సుధాకరరెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణిలపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ హైకమాండ్ తీరునూ నిలదీశారు. హైకమాండ్ బీసీలపై ఆరోపణలు వస్తే ఒకలాగా, ఇతరులపై ఆరోపణలు వస్తే మరొకలాగా స్పందిస్తారా అని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ పేరెత్తకుండానే నిలదీశారు. ఇక తన భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడుతూ.. పార్టీ తీసుకునే నిర్ణయంపైనే తన కార్యాచరణ అధారపడి ఉంటుందని అన్యాపదేశంగా ఒక వేళ తనను కేబినెట్ నుంచి తొలగిస్తే.. పార్టీకి రాజీనామా చేయడానికి కూడా వెనుకాడనని చెప్పారు. ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది. ఈ పరిణామం నిస్పందేహంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు ఎదురుదెబ్బగా పరిణమిస్తుందని అంటున్నారు. చూడాలి మరి కాంగ్రెస్ అధిష్ఠానం ఏం నిర్ణయిస్తుందో.. కొండా సురేఖ ఏ నిర్ణయం తీసుకుంటారో? [Konda Surekha Goodbye to Congress, Resign, MLA, Warangal East, By Election, Telangana Politics, Telugu One]

Published on: Thu Sep 3, 2026 12:34PM

political-news-img

నా బిడ్డ మాట్లాడితే నాకు ఎందుకు శిక్ష..?... మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్..!

నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..! తనను వద్దు అని చెప్పే అధికారం నాకు లేదు.. తన జీవితం తన ఇష్టం..! ఢిల్లీ మీడియా చిట్‌చాట్‌లో మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో స్పందించారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనపై చర్యలు తీసుకోవద్దని కోరారు. మహిళలు స్వతంత్రంగా బతకాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చెబుతున్నారని, తన కుమార్తె మాట్లాడిన అంశానికి తనను బాధ్యురాలిని చేయడం సరికాదని అన్నారు. తనపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. “నా బిడ్డ మాట్లాడితే నాకు ఎందుకు శిక్ష వేస్తారు..? నా కూతురు మాట్లాడిన దానికి నాపై చర్యలు తీసుకోవద్దు” అని ఆమె పేర్కొన్నారు. నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది. ఆమెను వద్దని చెప్పే అధికారం నాకు లేదు.. తన జీవితం తన ఇష్టం అని మంత్రి కొండా సురేఖ అన్నారు. తాను బీసీ మహిళా మంత్రినని.. తన భర్త మున్నూరు కాపు, తాను పద్మశాలి కులానికి చెందినవారినని తెలిపారు. తమ కులానికి 16 శాతం ఓట్లు ఉన్నాయని పేర్కొన్నారు. తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని స్పష్టం చేశారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండానే తన శాఖను సమర్థంగా నిర్వహిస్తున్నానని అన్నారు. ఒకవైపు కర్ణాటక కాంగ్రెస్‌లో ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా లేరంటూ ఆందోళన జరుగుతోందని.. మరోవైపు తనపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తనపై ప్రెస్‌మీట్లు పెట్టిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వెనుక ఎవరున్నారో తనకు తెలుసని కొండా సురేఖ అన్నారు. అధిష్ఠానం కూడా ఈ విషయాలను ఆలోచించాలని సూచించారు. మీనాక్షి మేడంకు తాను చెప్పాల్సిందంతా చెప్పానని తెలిపారు. తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం తప్పని అన్నారు. తనపై ఏమైనా చర్యలు తీసుకోవాలంటే ఏఐసీసీనే తీసుకోవాలని.. తాను ఏఐసీసీ సభ్యురాలినని కొండా సురేఖ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కే.సీ. వేణుగోపాల్‌ అపాయింట్‌మెంట్‌ తనకు దొరకలేదని తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశానని, తనపై వచ్చిన అంశాలపై ఆయనకు వివరణ ఇచ్చానని చెప్పారు.“ నాపై చర్యలు తీసుకునే ముందు సీఎం రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి” అని కొండా సురేఖ అన్నారు. పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్‌రెడ్డి ఎలా చెబుతారని ప్రశ్నించారు. అలాగే మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, భట్టి విక్రమార్క భార్యకు సంబంధించిన కమీషన్ల అంశాలపై కూడా చాలా ఫిర్యాదులు వచ్చాయని ఆమె వ్యాఖ్యానించారు. “ఆ ఫిర్యాదులపై ఎందుకు మాట్లాడటం లేదు?” అని ప్రశ్నించారు. చాలామంది రెడ్లు మాట్లాడిన సందర్భాల్లో వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కొండా సురేఖ ప్రశ్నించారు. తన విషయంలో మాత్రమే చర్యల అంశాన్ని తెరపైకి తీసుకురావడం ఏమిటని ఆమె నిలదీశారు. మంత్రి కొండా సురేఖ తాజా వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత విభేదాలు, నేతల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలపై మరోసారి చర్చకు దారితీశాయి. Konda Surekha Delhi visit, CM Revanth Reddy, Congress high command, AICC Mallikarjun Kharge, Konda Susmita comments, Telangana cabinet reshuffle 2026, Telangana politics news, K.C. Venugopal, Meenakshi Natarajan

Published on: Wed Sep 2, 2026 5:35PM

political-news-img

నాపై చర్యలంటే.. ముందు సీఎం రేవంత్‌పై చర్యలు తీసుకోవాలి : కొండా సురేఖ

ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..! మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై చర్యలు తీసుకునే ముందు సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని షాకింగ్ కామెంట్స్ చేశారు. పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రి అని రేవంత్ చెప్పుకోవడం మంత్రులు, నేతలు అసంతృప్తిగా ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయం ఒక్కసారిగా ఢిల్లీ హస్తిన వీధులకు చేరింది. కొండా సురేఖ ఆమె కుమార్తె కొండా సుస్మిత వ్యాఖ్యల దుమారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పార్టీ క్రమశిక్షణపై సుస్మిత చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ వివాదంపై స్పష్టత నిమిత్తం సురేఖకు ఇప్పటికే నోటీసులు జారీ చేసి, నివేదికను కాంగ్రెస్ అధిష్టానానికి పంపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సుమారు 60 నిమిషాల (1 గంట) పాటు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. పార్టీ నియమావళిని దాటి వ్యవహరించే నేతలపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వానికి మరియు పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని ముఖ్యమంత్రి అధిష్టానానికి వివరించినట్లు సమాచారం. అయితే ఊహించని మలుపు తిరుగుతూ మంత్రి కొండా సురేఖ కూడా హుటాహుటిన ఢిల్లీకి చేరుకోవడంతో వరంగల్ రాజకీయాలతో పాటు రాష్ట్ర కాంగ్రెస్‌లోనూ తీవ్ర కలకలం రేగింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, కొండా సురేఖ అత్యంత ఘాటుగా స్పందించారు. "నన్ను అధిష్టానం పిలవలేదు, నేనే స్వయంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అపాయింట్‌మెంట్ అడిగి ఢిల్లీకి వచ్చాను. పార్టీలో ఉన్నది మాట్లాడితే చర్యలు ఎందుకు తీసుకుంటారు?" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త సంచలనం సృష్టించాయి. పార్టీ శ్రేణుల సంక్షేమం మరియు ప్రాంతీయ సమతుల్యత కోసమే తమ అభిప్రాయాలను వ్యక్తం చేశామని, నిజ నిజాలు చెప్పడం క్రమశిక్షణా ఉల్లంఘన కిందకు ఎలా వస్తుందని ఆమె ప్రశ్నించడం గమనార్హం. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ మీనాక్షీ నటరాజన్, టీపీసీసీ చీఫ్ బి. మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఢిల్లీలో విడివిడిగా పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ వివాదానికి వీలైనంత త్వరగా స్వస్తి చెప్పాలని అధిష్టానం భావిస్తోంది. మంత్రి వర్గంలో 100 శాతానికి పైగా క్రమశిక్షణ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి కోరుతుంటే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కొండా కుటుంబం తమ స్వరాన్ని బలంగా వినిపిస్తోంది. పార్టీ మూలాలకు హాని కలగకుండా, సురేఖ చేత మంత్రి పదవికి రాజీనామా చేయించి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలా? లేక కేవలం వివరణతో సరిపెట్టి వ్యవహారాన్ని సర్దుమణిగేలా చేయాలా? అనే అంశంపై ఏఐసీసీ పెద్దలు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఒకవేళ తీవ్ర చర్యలు తీసుకుంటే ఉమ్మడి వరంగల్ పరిధిలోని దాదాపు 12 నియోజకవర్గాల్లో పార్టీ సమీకరణాలపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ వేదికగా సాగుతున్న ఈ హైడ్రామాలో రాబోయే 24 గంటల్లో వెలువడే అధిష్టానం నిర్ణయమే మంత్రి కొండా సురేఖ భవిష్యత్తును నిర్ణయించనుంది. Konda Surekha Delhi visit, Revanth Reddy Congress high command, AICC Mallikarjun Kharge, Konda Susmita comments, Telangana cabinet reshuffle 2026, Telangana politics news

Published on: Wed Sep 2, 2026 3:54PM