political-news-img

మాజీ మంత్రి రోజా.. రాజకీయ వైరాగ్యమేనా?

మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు ఆర్కే రోజా ఉరుములేని పిడుగులా రాజకీయాల పట్ల వైరాగ్యం ప్రదర్శించారు. రాజకీయాల వల్ల తన ఆరోగ్యం పాడైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలలో ఉండటం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడి.. తద్వారా ఆనారోగ్యం తప్ప తనకు ఒరిగిందేమీ లేదంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో తెగ వైరల్ గా మారాయి. రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు. నియోజకవర్గ సమస్యలు, పార్టీ బాధ్యతలు మరియు ప్రజల అంచనాల మధ్య వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహించేందుకు సమయమే చిక్కలేదన్నారు. గత ఎన్నికలలో ఓటమితో ఒత్తడి నుంచి పూర్తిగా బయటపడ్డానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె రాజకీయాలకు ఒకింత దూరంగా ఉంటున్నారు. అడపాదడపా తప్ప రాజకీయ వ్యాఖ్యలు చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో రోజా రాజకీయాలు, తన వ్యక్తిగత ఆరోగ్యంపై చేసిన వ్యాఖ్యపై పలు రకాలుగా చర్చ జరుగుతోంది.

Publish Date: Apr 8, 2026 6:43PM

political-news-img

కష్టపడిన వారిని గుర్తించాలనేది టీడీపీ సిద్ధాంతం : మంత్రి లోకేష్

కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ‘మై టీడీపీ యాప్’ సమర్థ వినియోగం, పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న టాప్ 10 ఫెర్ఫార్మర్స్ తో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ఆత్మీయ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అనేది ఒక వ్యవస్థ. మనం అందరం ఆ వ్యవస్థలో భాగం. మీ పనితీరు వల్లే ఇక్కడ వరకు రాగలిగారు. రేపు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పక్కన కూర్చొంటారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను సక్రమంగా నిర్వహిస్తే పార్టీ వందేళ్లు ఉంటుంది. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని గుర్తించాలి. పార్టీలో సంస్కరణల కోసం నేను పోరాడుతున్నా. కార్యకర్తే అధినేత. గ్రామ పార్టీ అధ్యక్షుడు, క్లస్టర్ ఇంఛార్జ్ పొలిట్ బ్యూరో వరకు రాగలగాలి. ఎన్నికల్లో విజయం సాధించాలంటే పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఎన్నికల్లో విజయం సాధించాలంటే పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ దిశానిర్దేశం చేశారు. మనం కోరుకున్న మార్పు సాధ్యం కావాలంటే అందరం కలిసికట్టుగా పనిచేయాలి. పార్టీ భవిష్యత్ దృష్ట్యా కడప మహానాడులో తీర్మానించిన 6 శాసనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పార్టీ సిద్ధాంతాలను వివరించేందుకు 365 రోజులూ శిక్షణ తరగతులు నిర్వహిస్తాం. 2019-24 మధ్య జగన్ రెడ్డి ఎమ్మెల్యేలనే కలవలేదు. మనం కార్యకర్తలను కలుస్తున్నాం. నియోజకవర్గ పర్యటనల్లో ముందుగా కార్యకర్తలతో సమావేశం అవుతున్నాం. వారానికోరోజు పార్టీ కార్యాలయానికి వచ్చి సమస్యలు తెలుసుకుంటున్నామని లోకేష్ తెలిపారు . పార్టీ కోసం ప్రాణాలర్పించిన తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కోసం చట్ట సవరణ చేశాం. మీరందరూ క్షేత్రస్థాయిలో ఉండి పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి పిలుపునిచ్చారు. అనంతరం అందరినీ మంత్రి నారా లోకేష్ ఘనంగా సత్కరించి ఎన్టీఆర్ జ్ఞాపికను బహూకరించారు. పార్టీ కార్యాలయంలో మంత్రి లోకేష్ తో ఆత్మీయ భేటీ పట్ల ‘మై టీడీపీ యాప్’ ఉత్తమ కార్యకర్తలు ధన్యవాదాలు తెలిపారు. తాము జీవితాంతం మర్చిపోలేమని ఆనందం వ్యక్తం చేశారు.

Publish Date: Apr 8, 2026 6:35PM

political-news-img

అమరావతికి చట్టబద్ధత.. స్వాగతించిన స్వప్నాదత్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన అమరావతి రాజధాని అంశంపై సినీ పరిశ్రమ ఆమోదయోగ్యం కాని మౌనం వహిస్తున్నది. అయితే ఈ ఒక్క విషయం అనే కాదు.. గత కొన్నేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల విషయంలో టాలీవుడ్ స్పందించడం కంటే మౌనమే మేలన్నట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నది. జగన్ హయాంలో చిత్రపరిశ్రమ విషయంలో ఆయన అనుసరించిన తీరు, అవమానించిన విధం నుంచి టాలీవుడ్ ఇప్పటికీ తేరుకోనట్లుగానే కనిపిస్తున్నది. అందుకే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ మౌనం వీడలేదు. ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత విషయంలో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ మౌనంగానే ఉండిపోయి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నది. ఎందుకంటే.. అమరావతిని రాజధానిగా జగన్ వ్యతిరేకిస్తున్నారు కనుక. సపోజ్ ఫర్ సపోజ్ రేపు ఆయన అధికారంలోకి వస్తే అమరావతికి మద్దతుగా మాట్లాడిన వారిపై ప్రతీకార చర్యలకు దిగుతారన్న భయమే అందుకు కారణంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అమరావతికి మద్దతుగా హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గళం విప్పినా.. వారిరువురూ రాజకీయాలలో క్రియాశీలంగా ఉన్నారు. ఆ కారణంగా వారి అభిప్రాయం చిత్రపరిశ్రమ అభిప్రాయంగా భావించలేని పరిస్థితి ఉంది. అయితే గతంలో అంటే జగన్ హయాంలో జగన్ నిర్ణయాలను ధైర్యంగా ఇసుమంతైనా జంకు లేకుండా విమర్శించిన అశ్వినీదత్ అప్పట్లో తన గళాన్ని గట్టిగా వినిపించారు. ప్రముఖ సినీ నిర్మాత అయినా.. పలు భారీ చిత్రాలు నిర్మాణంలో ఉన్నప్పటికీ ఏ మాత్రం భయం లేకుండా జగన్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు.ఇక ఇప్పుడు ఆయన కుమార్తె స్వప్ప దత్.. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదల కావడాన్ని స్వాగతించారు. ఈ మేరకు ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో చేసిన పోస్టుకు అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ను షేర్ చేశారు. చిత్రపరిశ్రమలో ఉంటూ భారీ చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నా కూడా స్వప్నా అశ్వినీదత్.. రాష్ట్ర రాజకీయాలపై తన అభిప్రాయాలను నిస్సంకోచంగా, ధైర్యంగా వెళ్లడించడంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆమె రాజకీయ పరిణామాలపై తన మనసులోని మాటను ధైర్యంగా చెప్పడం పట్ల నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.

Publish Date: Apr 8, 2026 6:27PM

political-news-img

కేరళ టెక్కీ శరణ్య మిస్సింగ్ మిస్టరీ...డ్రామానా?

అడవిలో దారి తప్పి.. నాలుగు రోజుల పాటు కనీసం తిండి కూడా లేకుండా గడిపి, సురక్షితంగా బయటపడటం అంటే మామూలు విషయం కాదు. కానీ కేరళకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శరణ్య విషయంలో ఇదే జరిగింది. అయితే, ఆమె ప్రాణాలతో తిరిగి రావడం సంతోషకరమైనా, ఆమె చెప్పిన వివరాలు మాత్రం ఇప్పుడు పెను వివాదానికి దారి తీస్తున్నాయి. ఆమె చెప్పే కథలో లాజిక్ లేదంటూ నెటిజన్లు, రాజకీయ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 2న కర్ణాటకలోని కొడగు సమీపంలో ట్రెక్కింగ్‌కు వెళ్లిన శరణ్య తన బృందం నుంచి విడిపోయింది. దీంతో అప్రమత్తమైన కర్ణాటక ప్రభుత్వం డ్రోన్లు, జాగిలాలు, ఫారెస్ట్ శాఖ సిబ్బంది మరియు ప్రత్యేక పోలీసు బలగాలతో అత్యంత భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. దాదాపు నాలుగు రోజుల ఉత్కంఠ తర్వాత ఏప్రిల్ 5న ఆమె ఆచూకీ లభ్యమైంది. శరణ్య సురక్షితంగా దొరకడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే అసలు కథ ఆమె తిరిగి వచ్చిన తర్వాత మొదలైంది. ఫారెస్ట్‌లో ఉన్న నాలుగు రోజులు తాను కేవలం రోజుకు మూడు లీటర్ల నీటిని మాత్రమే తాగి ప్రాణాలు నిలబెట్టుకున్నానని శరణ్య పేర్కొంది. క్రూర మృగాలు సంచరించే ఆ దట్టమైన అడవిలో, ఫుడ్ లేకుండా అన్ని రోజులు ఉన్నా ఆమె ఎంతో ఉత్సాహంగా, ఆరోగ్యంగా కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సోషల్ మీడియాలో నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ ఉదంతంపై కొడగు జిల్లాకు చెందిన బీజేపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శరణ్య ఆచూకీ కోసం ప్రభుత్వం ప్రజల సొమ్మును భారీగా ఖర్చు చేసిందని, డ్రోన్లు, రెస్క్యూ టీమ్‌ల కోసం వినియోగించిన నిధుల దృష్ట్యా దీని వెనుక ఉన్న వాస్తవాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేస్తూ, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా విచారణ జరపాలని కోరారు. మరోవైపు పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. ప్రాథమికంగా ఆమెతో మాట్లాడినప్పుడు అనుమానించదగ్గ అంశాలేవీ కనిపించలేదని ఒక అధికారి తెలిపినప్పటికీ, పెరుగుతున్న ప్రజా నిరసనలు మరియు రాజకీయ ఫిర్యాదుల నేపథ్యంలో లోతైన విచారణకు సిద్ధమయ్యారు. నాలుగు రోజుల పాటు అడవిలో జంతువుల మధ్య ఒంటరిగా ఉండటం సాధ్యమేనా అనే కోణంలో నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. సాధారణంగా దట్టమైన అరణ్యంలో తప్పిపోయిన వారు తీవ్రమైన అలసట, నీరసం మరియు భయంతో కనిపిస్తారు. కానీ శరణ్య విషయంలో అవేమీ లేకపోవడం ఈ మిస్టరీని మరింత పెంచుతోంది. ఒకవేళ ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన డ్రామా అయితే, ప్రభుత్వం వెచ్చించిన లక్షలాది రూపాయల ప్రజాధనానికి బాధ్యత ఎవరిది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు శరణ్య స్టేట్‌మెంట్‌ను మరోసారి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆమె ఫోన్ సిగ్నల్స్, ఆ నాలుగు రోజుల్లో ఆమె కదలికల ఆధారంగా నిజానిజాలను బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మిస్సింగ్ మిస్టరీలో మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Publish Date: Apr 8, 2026 6:16PM

political-news-img

టెక్ ప్రపంచంలో సంచలనం...వారానికి 4 రోజుల పనికి ఏఐ ప్లాన్!

కృత్రిమ మేధ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన 'ఓపెన్ ఏఐ' సంస్థ ఇప్పుడు ఉద్యోగ విధానాల్లోనూ సంచలన మార్పులకు తెరలేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా పని సంస్కృతిని మార్చేలా వారానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే పని చేసే విధానాన్ని ప్రవేశపెట్టాలని ఈ టెక్ దిగ్గజం ప్రతిపాదించింది. ఏఐ సాంకేతికత వల్ల పని సామర్థ్యం పెరగడమే కాకుండా, ఉద్యోగుల వ్యక్తిగత జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని సంస్థ భావిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతి పెరగడం వల్ల భవిష్యత్తులో మానవ శ్రమ తగ్గుతుందని, ఆ ప్రయోజనాన్ని నేరుగా ఉద్యోగులకే అందించాలని ఓపెన్ ఏఐ స్పష్టం చేసింది. తక్కువ రోజులు పనిచేయడం వల్ల ఉద్యోగులపై ఒత్తిడి తగ్గుతుందని, తద్వారా వారు మరింత సృజనాత్మకంగా ఆలోచించే అవకాశం ఉంటుందని తన నివేదికలో పేర్కొంది. కేవలం పని గంటల తగ్గింపు మాత్రమే కాకుండా, దీనివల్ల ఆర్థిక భద్రత కూడా పెరుగుతుందని అంచనా వేస్తోంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఏఐ ద్వారా కంపెనీలకు వచ్చే అపారమైన లాభాల్లో సామాన్య ప్రజలకు కూడా వాటా ఉండాలని ఓపెన్ ఏఐ సూచించింది. ఇందుకోసం 'పబ్లిక్ వెల్త్ ఫండ్' (ప్రజా సంక్షేమ నిధి) ఏర్పాటు చేయాలని కోరింది. ప్రభుత్వాలు, ఏఐ సంస్థలు సమన్వయంతో ఈ నిధిని రూపొందించి, ఆర్జించిన లాభాలను ప్రజలందరికీ పంపిణీ చేయడం ద్వారా సమాజంలో ఆర్థిక అసమానతలను తొలగించవచ్చని స్పష్టం చేసింది. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న తరుణంలో, కేవలం యంత్రాలు మాత్రమే అభివృద్ధి చెందడం కాకుండా, ఆ అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి వ్యక్తికి అందాలని ఈ సంస్థ ఆకాంక్షిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వాలు తమ పాత విధానాలను మార్చుకోవాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త ఉపాధి చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని ఓపెన్ ఏఐ వెల్లడించింది. ప్రస్తుతం ఐటీ రంగంలో పని గంటలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న తరుణంలో, ఓపెన్ ఏఐ చేసిన ఈ ప్రతిపాదన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే కొన్ని ఐరోపా దేశాల్లో ప్రయోగాత్మకంగా అమలవుతున్న ఈ 'నాలుగు రోజుల పని దినాల' విధానం, ఏఐ కంపెనీల మద్దతుతో ప్రపంచవ్యాప్తంగా అమలులోకి వచ్చే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ ప్రతిపాదనలపై వివిధ దేశాల ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు ఎలా స్పందిస్తాయో చూడాలి. ఒకవేళ ఇది కార్యరూపం దాల్చితే, భవిష్యత్తులో ఉద్యోగాల స్వరూపం పూర్తిగా మారిపోవడం ఖాయం. పని ఒత్తిడి లేని, ఆర్థిక భరోసాతో కూడిన కొత్త జీవనశైలి వైపు అడుగులు పడతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Publish Date: Apr 8, 2026 6:02PM

political-news-img

జగన్ నోట మళ్లీ మావిగన్.. మళ్లీ నెట్టింట ట్రోలింగ్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రా మావిగన్ మంత్రాన్ని మరోసారి జపించారు. ఈ సారి ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తన మావిగన్ ప్రతిపాదనను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఒకింత అసహనం వ్యక్తం చేశారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలిపి అభివృద్ధి చేస్తే అమరావతిపై రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదన్నారు. ఈ విషయాన్ని తాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు చిలక్కి చెప్పినట్లు చెప్పానని కూడా జగన్ చెప్పుకున్నారు. మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు. అమరావతి ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం దాదాపు రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేసినా, మరో రెండు దశాబ్దాల వరకు అది పూర్తిస్థాయి రాజధానిగా మారే అవకాశం లేదంటున్న జగన్ తాను అధికారంలో ఉన్న సమయంలో మూడు రాజధానుల మూడుముక్కలాట వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టంపై ఏం సమాధానం చెబుతారో చూడాలి. అమరావతి కోసం వెచ్చించే రెండు లక్షల కోట్ల రూపాయలలో కేవలం పది శాతం ఖర్చు చేస్తే మావిగన్ మొదటి రోజు నుంచే రాష్ట్ర రాజధానిగా ఉంటుందని చెబుతున్నారు. అదే సమయంలో నెటిజనులు రుషికొండ ప్యాలెస్ కోసం ఖర్చు చేసిన ప్రజాధనాన్ని మావిగన్ కోసం ఎందుకు వెచ్చించలేకపోయారని నిలదీస్తున్నారు. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల పేరుతో కాలయాపన చేసిన జగన్, ఇప్పుడు కొత్తగా ఈ ప్రతిపాదన తీసుకురావడం హాస్యాస్పదమని తెలుగుదేశం విమర్శలతో విరుచుకు పడుతోంది. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత లభించి.. ఆర్థికాభివృద్ధి జోరుగా సాగుతున్న తరుణంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకే జగన్ ఇలా వితండ వాదం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Publish Date: Apr 8, 2026 5:39PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img