బెజవాడలో "రెంట్" మంటలు...!

Publish Date:May 27, 2016

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో అద్దెలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ఫైరయ్యారు. ప్రజలపై అద్దెల భారం పెంచి ఇబ్బంది పెడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. తన పాలనను హైదరాబాద్ నుంచి విజయవాడకు మార్చినప్పటి నుంచి పలు సందర్భాల్లో రాజధాని వాసులకు అద్దెపై ప్రేమ ఎక్కువని దానిని వీడాలని చెప్పుకుంటూ వచ్చారు. విజయవాడ వాసులది సంకుచిత మనస్తత్వమని..వీరు ప్రపంచమంతా వెళ్లి వ్యాపారాలు చేస్తుంటారు. కానీ సొంత ప్రాంతం వచ్చేసరికి సంకుచితంగా ఆలోచిస్తారని సాక్షాత్తూ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. బెజవాడ, గుంటూరు ప్రజలు తాత్కాలిక ప్రయోజనాలను వెతుక్కోవద్దని హితవు పలికారు. చిన్న చిన్న స్వార్థాలను వదులుకోకపోతే నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. అయినా ఇక్కడి ప్రజల ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడం..సచివాలయ ఉద్యోగులు విజయవాడ వచ్చేందుకు అద్దెను కారణంగా చూపుతుండటంతో సీఎం "రెంట్‌పై" ఫోకస్ చేశారు.

 

బెజవాడలో ఈ పరిస్థితి ఇప్పుటికిప్పుడు వచ్చింది కాదు. రాష్ట్ర విభజనకు పూర్వం నుంచే రాజకీయ, విద్యా, వైద్య, సాంస్కృతిక, వాణిజ్య, రవాణా రంగాలకు బెజవాడ కేంద్రం. నిత్యం ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వివిధ వ్యాపారాల నిమిత్తం తరలివస్తుంటారు. వన్‌టౌన్‌లో వస్త్ర, బంగారం, బెనిటిక్స్‌ తదితర వ్యాపారం బాగా జరుగుతుంది. దీంతో రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా ఉపాధి నిమిత్తం బెజవాడ బాట పడుతుంటారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ వసతి నిమిత్తం అద్దె ఇళ్లే శరణ్యం. మొదట్లో కాస్త తక్కువగానే ఉన్న అద్దెలు రియల్ బూమ్ పెరగడం, అద్దెను వ్యాపార కోణంలో చూడటంతో కాలక్రమేణా పెరుగుతూ వచ్చాయి. అప్పట్లో ఒక కుటుంబానికి అద్దె ఇళ్లు కావాలంటే కనీసం రూ.6 వేల నుంచి 10 వేలను నెల అద్దెగా చెల్లించుకోవాలి.

 

కాని రాష్ట్ర విభజన జరగడం..అమరావతిని రాజధానిగా..విజయవాడను తాత్కాలిక రాజధానిగా నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో నవ్యాంధ్రలో బెజవాడ, గుంటూరులు కీలక నగరాలుగా మారడంతో అద్దెలు భారీగా పెరిగిపోయాయి. ఒక జాతీయ సంస్థ సర్వే ప్రకారం ఈ రెండు నగరాల్లో అద్దెలు కనీసం 25 వేల నుంచి 30 వేల వరకు పెరిగిపోయాయి. దీనికి తోడు ఇంటిపన్ను, నీటిపన్ను, కరెంట్ చార్జ్ అదనం. ఇలాంటి పరిస్థితుల్లో జూన్ 27లోగా ఏపీ సచివాలయ ఉద్యోగులు అమరావతికి తరలిరావాల్సిందేనని సీఎం చంద్రబాబు తేల్చిచెప్పారు. అయితే హైదరాబాద్‌ను వదులుకోవడానికి సిద్ధపడ్డ ఉద్యోగస్తులకు విజయవాడ అద్దెలు వణికిస్తున్నాయి. ఈ రెండు నగరాల్లో అద్దెలు, హైదరాబాద్‌లో సంపన్నులు నివసించే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలను మించిపోయాయని సాక్షాత్తూ ఏపీ సర్కార్ నియమించిన కమిటీ ప్రభుత్వానికి తెలిపింది.

 

రాజధానికి చుట్టుపక్కల 20 కిలోమీటర్ల పరిధి వరకూ సింగిల్ బెడ్ రూం రూ.15 వేలు, డబుల్ బెడ్‌రూం రూ.18 వేల నుంచి రూ. 25 వేల వరకూ ఉన్నాయని ఈ కమిటీ గుర్తించింది. ఒకవేళ ప్రభుత్వమే కల్పించుకుని ఉద్యోగులకు వసతి సౌకర్యాలు కల్పించాలన్నా ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పరిస్థితి లేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో జూన్ 27 సమీపిస్తుండటంతో ఉద్యోగుల తరలింపు, వసతి, ప్రభుత్వ కార్యాలయాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. దీనిలో అద్దె అంశం వచ్చింది..గతంతో పోలిస్తే అద్దెలు విపరీతంగా పెరిగాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకురావడంతో ఆయన అగ్గిమీద గుగ్గులమయ్యారు. ఇకపై దీనిని ఉపేక్షించేది లేదని అద్దెనియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మరి సీఎం చర్యలు విజయవాడ, గుంటూరుల్లో అద్దెలు తగ్గించగలుగుతాయా..? బాబు ఆవేదనను ప్రజలు అర్థం చేసుకుంటారా..?

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.