కొంచెం తీపి..కొంచెం చేదు

Publish Date:May 26, 2016

Advertisement

సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజున ఒక ఛాయ్ వాలా భారతదేశ భవితను నిర్దేశించేందుగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టాడు. ఆయనే నరేంద్ర దామోదర్‌దాస్ మోడీ. అప్పటికే పీకల్లోతు అవినీతి ఆరోపణలు, కుంభకోణాలతో దేశ ప్రతిష్టను మంట గలిపిన కాంగ్రెస్‌పైన కోపంతో సంకీర్ణ ప్రభుత్వాలు తప్న దేశానికి సుస్థిరమైన ప్రభుత్వం వచ్చే అవకాశమే లేదని అందరూ నమ్ముతున్న దశలో మోడీకి స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టారు ప్రజలు. మరి ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపించుకున్న మోడీ, ఆ ప్రజల నమ్మకాన్ని నిలుపుకున్నారా? ఈ రెండేళ్లలో ఆయన సాధించిన విజయాలేమిటీ.? వైఫల్యాలేమిటీ.? అనే చర్చ మరోసారి దేశం మొత్తం జరుగుతోంది.

 

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా  సాధించిన పాపులారిటీతోనే మోడీ ప్రధాని పీఠాన్ని అధిరోహించారని స్పష్టంగా చెప్పవచ్చు. 2014లో ప్రధాని అయిన తొలి రోజుల్లో ఆయన సీఎంగానే ఆలోచించేవారు. కానీ ఈ రెండేళ్ల సమయంలో మోడీ ఎంతో నేర్చుకున్నారు. కేంద్రంలోని వ్యవస్థల పనితీరును త్వరగానే అర్థం చేసుకున్నారు. అప్పట్లో సీనియర్ మంత్రులపై ఆధారపడిన మోడీ ఇప్పుడు తానే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టారు. యూపీఏ హయాంలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా చాలా వరకూ అంతంత మాత్రంగానే అమలయ్యాయి. దీనిపై దృష్టిసారించిన మోడీ నగదు బదిలీ, ఆధార్ అనుసంధానం ద్వారా పేదల ముంగిట్లోకి సంక్షేమ ఫలాలను అందించారు. గ్రామీణ ప్రాంతాల్లో 7.10 కోట్ల బ్యాంక్ ఖాతాలు తెరవటం ద్వారా..ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అవినితీ అవకాశాలను తగ్గించడం, ఆ ప్రయోజనాలు మరింత ఎక్కువ మంది ప్రజలకు అందేలా చేశారు.

 

ఇక ధరల విషయానికి వస్తే అధికధరలు అనేది నిరంతర సమస్య. ఈ రెండేళ్లలో ప్రజల కనీస ఆహార పదార్ధాల ధరలు భారీగా పెరిగాయి. కందిపప్పు కిలో రూ.200 చేరుకుని సామన్యుడు కొనలేని పరిస్థితి వచ్చింది.  అలాగే అంతర్జాతీయంగా పెట్రోలు ధరలు తగ్గినా మన దగ్గర మాత్రం భారీగా ఉండటాన్ని ప్రజలు సమర్ధించడం లేదు. కానీ వీటి విషయంలో మోడీ సర్కార్ అనుకున్నంత కృషి చేయలేదు. ఇక పారిశ్రామిక రంగాన్ని మోడీ వృద్ధిలోకి తీసుకువచ్చేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. దేశీ తయారీ రంగానికి చేయూతనిచ్చేలా "మేకిన్ ఇండియా" కార్యక్రమాన్ని తలపెట్టారు. దీని కింద దాదాపు 400 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. అలాగే చిన్న సంస్థల ఏర్పాటుకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం "స్టార్టప్ ఇండియా"ను ప్రారంభించారు. మోడీ సంస్కరణల ఫలితంగా రైల్వే, డిఫెన్స్ వంటి కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా వచ్చాయి. కార్పోరేట్ కంపెనీల మార్జిన్లు పుంజుకున్నాయి. కరెంట్ అకౌంట్, ద్రవ్య పరిస్థితులు మెరుగయ్యాయి. మొత్తానికి ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశంగా చైనాను భారత్ అధిగమించింది.

 

ఇక మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సాధించిన విజయాల్లో కెల్లా అతిపెద్దది విదేశాంగ విజయం. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను పెంచడానికి..తద్వారా దేశంలోకి పెట్టుబడులను ఆకర్షించడానికి మోడీ గతంలో ఏ ప్రధాని చేయని విధంగా అనేక దేశాల్లో పర్యటించారు. దశాబ్ద కాలంపైగా ఊరిస్తూ వచ్చిన భారత్-ఇరాన్ ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు . వీటన్నింటి ద్వారా భారత విదేశీ విధానానికి మోడీ కొత్త జీవం పోశారని చెప్పవచ్చు. యూపీఏ ప్రభుత్వానికి అపకీర్తిని మూటకట్టిన అవినీతి విషయంలో నరేంద్రుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రెండేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వంలో ఎవరిపైనా అవినీతి ఆరోపణలు రాకుండా మోడీ జాగ్రత్తలు తీసుకున్నారు. అటు రాజకీయంగానూ మోడీ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. తన రాజకీయ పత్యర్థి కాంగ్రెస్‌ను కట్టడి చేసి "కాంగ్రెస్ ముక్త భారత్ "దిశగా దూసుకుపోతున్నారు. 2014 లో మోడీ అధికారం వచ్చేనాటికి కాంగ్రెస్ పార్టీ 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది..కానీ రెండేళ్ల తర్వాత తిరిగి చూస్తే కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలు ఏడుకు తగ్గిపోయాయి. వీటిలో కర్ణాటకను మినహాయిస్తే అన్నీ చిన్నచితకా రాష్ట్రాలే. ఇదే సమయంలో ఎన్‌డీఏ సర్కార్ కొలువుదీరే నాటికి 7 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు 13 రాష్ట్రాల్లో సొంతంగా లేదా సంకీర్ణంగా ప్రభుత్వాలను నడుపుతోంది. ఇటీవలే జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అసోంలో గెలుపుతో ఈశాన్యంలో మొదటి సారి పాగా వేసింది.

 

 

ఇన్ని విజయాలు సాధిస్తున్నా మోడీకి విమర్శలు తప్పడం లేదు. ఎన్నికల మేనిఫేస్టోలో పేర్కొన్నట్టు నల్లధనం వెనుక్కు తీసుకురాలేదు. ఆయన రెండేళ్లపాలనలో ఏదైనా పెద్ద విమర్శ ఉందంటే అది సమాజంలో పెరుగుతున్న అసహనమే. తమ మాట వినని కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు, విద్యార్థుల పట్ల అసహనం. హెచ్‌సీయూ, జేఎన్‌యూలలో చేలరేగిన అల్లర్లు తదితరా అంశాల విషయంలో మోడీ సర్కార్ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యాయి. భారత్-పాక్ సరిహద్దుల్లో మోడీ హయాంలో జరిగినన్ని కాల్పులు ఏ ప్రధాని హయాంలోనూ జరగలేదు. పాక్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత పోస్ట్‌లపై దాడులకు దిగాయి. ఈ దాడుల్లో ఎంతోమంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు..ఇంకా కోల్పోతూనే ఉన్నారు. అటు  చైనా రాజకీయంగా, సైనికంగా, ఆర్థికంగా చొచ్చుకుని వస్తున్నా మోడీ సర్కార్ ధీటైన జవాబివ్వడంలో విఫలమైందని చెప్పవచ్చు. మొత్తం మీద మోడీ రెండేళ్ల పాలన అన్నివర్గాలను అనుకున్నంత మేర సంతృప్తి పరచలేకపోయినా ఆయన తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో సమర్థుడైన ప్రధాని లేడంటున్నారు. మిగిలిన మూడేళ్లలో అయినా సామాన్యుడి కలల్ని మోడీ నిజం చేసి "అచ్చేదిన్" తీసుకువస్తారని ఆశిద్దాం..
 

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.