విజయసాయి కొత్త పార్టీ.. చానల్ అందుకేనా ?

Publish Date:Oct 13, 2022

Advertisement

ఒక జర్నలిస్ట్ కు సొంతంగా పత్రిక లేదా ఓ వెబ్ ఛానల్ పెట్టాలనే ఆలోచన ఎప్పుడు వస్తుంది? సహజంగా, ఉన్న ఉద్యోగం ఊడి, కొత్త ఉద్యోగం ఏదీ దొరకని సమయంలో గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవడం కంటే, సొంతంగా ఏదో ఒకటి చేద్దామనే అలోచన పుడుతుంది. సరే, ఆలా ఆలోచన చేసిన జర్నలిస్టులు చాలా వరకు చేతులు కాల్చుకుని మళ్ళీ చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగంలో సర్దుకుపోయిన వారే అనుకోండి, అది వేరే విషయం.  జర్నలిస్టుల విషయాన్ని కాసేపు పక్కన పెట్టి రాజకీయ నాయకుల విషయానికి వస్తే ఉన్న పార్టీలో ఉక్కపోత మొదలై, పక్క పార్టీలతో పని కాదనుకున్నప్పుడు సొంతంగా పార్టీ పెట్టాలనే ఆలోచన చేస్తారు. అఫ్కోర్స్ అక్కడా సక్సెస్ రేటు తక్కువే అనుకోండి. అయినా ఉన్న పార్టీలో ఉక్కపోత తట్టుకోలేక సొంత పార్టీ పెట్టాలనే ఆలోచన చేసే రాజకీయ నాయకులు  మంచి కాసుల పార్టీ అయితే, పార్టీ కంటే ముందే సొంతంగా ఒక  న్యూస్ పేపర్, ఒక న్యూస్ చానల్ ప్లాన్ చేస్తారు.  

అందుకే కావచ్చును వైసీపెలో నెంబర్ 2 గా ఓ వెలుగు వెలిగిన విజయ సాయి రెడ్డి ఇప్పుడు హటాత్తుగా సొంతగా న్యూస్ చానల్ పెడుతున్నానని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. విజయసాయి, సొంత చానల్ తో ఆగుతారా, సొంత పార్టీ వరకు వెళతారా అనే చర్చ, వైసీపీ వర్గాల్లోనే మొదలైందని అంటున్నారు. అంతే కాదు,ఢిల్లీ  స్థాయిలో ఇందుకు సంబంధించి కొంత గ్రౌండ్ వర్క్ కూడా జరిగిందని వైసీపీలో వినవస్తోంది. వైఎస్ కుటుంబ సభ్యులను ముందుంచి, విజయసాయి రాజకీయంగా ముందదుగు వేసే ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోందని అంటున్నారు.  ఢిల్లీ పెద్దలతో పాటుగా  పొరుగు రాష్ట్రానికి  చెందిన ముఖ్యనేత ఒకరు తెర వెనక నుంచ కథ నడిపిస్తునట్లు తెలుస్తోంది. అందుకే, విజయ సాయి, ఓపెన్ గా చానల్ పెడుతున్నానని ప్రకటించారని  అంటున్నారు.    

వైసీపీకి సాక్షి న్యూస్ పేపర్, న్యూస్ చానల్ ఉన్నాయి. అంతే కాదు, ఆ రెండు పత్రికలు,  ఆ ఒక్క చానల్ మినహా మిగిలిన న్యూస్ పేపర్లు, న్యూస్ చానల్స్ చాలా వరకు జగన్  రెడ్డి సువార్త పుత్రికలు అన్నట్లుగానే, వైసీపీ ప్రభుత్వాన్ని మోస్తున్నాయి.  జగన్ రెడ్డితో చక్కని ఇచ్చి పుచ్చుకునే సంబంధాలు కొనసాగిస్తున్నాయి. అటువంటప్పుడు  వైసీపీకి ఇప్పుడు మరో చానల్ అవసరం ఏమొచ్చింది? అంటే, ఛానల్ అవసరం వచ్చింది  వైసీపీకి కాదు. జగన్ రెడ్డికీ కాదు విజయ సాయి రెడ్డికే  ఆ అవసరం వచ్చిందని  లోగుట్టు తెలిసిన, విజయసాయి సన్నిహిత మీడియా మిత్రులు చెపుతున్న మాట.

నిజమే  కారణాలు ఏవైనా గత కొంతకాలంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విజయ సాయి మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. వైసీపీలో విజయసాయి రెడ్డి ఉక్కపోతకు గురవుతున్నారు. అదీ తెలుస్తూనే వుంది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒకటొకటిగా విజయ సాయి పదవులు కత్తిరిస్తూ వస్తున్నారు. మరో వంక, విశాఖ భూదందాల బాగోతం, ఫ్లడ్ గేట్స్ తెరిచినట్లుగా బయటకు వస్తోంది. విజయ సాయి ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. అయినా   జగన్ రెడ్డి కాదుకదా, వైసేపీ నాయకులు ఎవరూ  ఆయనకు అండగా నిలవడం లేదు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఖండించడం లేదు. నిజానికి, విజయసాయిరెడ్డి భూదందాల వ్యవహారాలన్నీ ప్రభుత్వ వర్గాల నుంచే బయటకు వస్తున్నాయని అంటున్నారు.  

ఇక సాక్షి పత్రిక, చానల్ సంగతి అయితే, చెప్పనే అక్కర లేదు. ఇతర పత్రికల్లో వైసీపీ నేతలఫై ఏ చిన్న ఆరోపణ వచ్చినా, కలాలను ఎక్కుపెట్టే సాక్షి విపక్షాలు విజయ సాయిపై విరుచుకు పడుతున్నా కిమ్మనడం లేదు.  దీంతో విజయసాయి రెడ్డికి సీన్ అర్ధమైందని అంటున్నారు. అందుకే నెపాన్ని సాక్షిపై నెట్టి చానల్ ఆలోచనను బయట పెట్టారని అంటున్నారు.  తెలుగు దేశం పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలను సాక్షి టీవీ సమర్ధవంతంగా తిప్పి కొట్టడంలో విఫల  మవుతోందని, అందుకే తాను చానల్ పెడుతున్నానని చెప్పుకొచ్చారు. 

అదలా ఉంటే  నిజానికి జగన్ రెడ్డి, విజయ సాయి మధ్య చాలా కాలంగా  ప్రచ్చన్న యుద్ధం సాగుతోందని, ఏదో ఒక రోజున ప్రచ్చన యుద్ధం ప్రత్యక్షయుద్ధంగా మారక తప్పదని అంటున్నారు. అది గ్రహించే విజయ సాయి యుద్ద సన్నాహాలు ప్రారంభించారని అంటున్నారు. నిజానికి వైసీపీ సీనియర్ నేతలు చాలా మందిలో అసమ్మతి బుసలు కొడుతోంది. ముఖ్యంగా, ముఖ్యమంత్రిపై కంటే, ముఖ్యమంత్రి చుట్టూ చేరిన కోటరీపై పార్టీ సీనియర్లు ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యమంత్రిని వారే తప్పుదారి పట్టిస్తున్నారని అంటున్నారు.

అంతే కాకుండా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పదే పదే ఎమ్మెల్యేలు, మంత్రులకు బహిరంగంగానే హెచ్చరికలు చేయడం, పని తీరు మెరుగు పరచుకోకపోతే, ప్రత్యామ్నాయం చూసుకోవలసి వస్తుందని చెప్పడంతో, పార్టీలో తమ భవిష్యత్ ఏమిటనే విషయంలో సందిగ్దంలో  ఉన్నారు. ఈ నేపధ్యంలో పిల్లి  మెడలో తిరుగుబాటు గంట కట్టేది ఎవరని ఎదురుచూస్తున్న నాయకులు  విజయ సాయిలో ఆ స్పార్క్ చూస్తున్నారని అంటున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు కాకపోయినా, 2024కు ముందు వైసీపీ నెంబర్ 2’ తధ్యమని అంటున్నారు.

By
en-us Political News

  
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.