పడాల నాయకత్వంపై పెరుగుతున్న అసంతృప్తి.
Publish Date:Apr 3, 2012
Advertisement
విజయనగరం జిల్లాలో తెలుగుదేశంపార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఒకప్పుడు టిడిపికి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో అసలు పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. పార్టీ అధికారంలో ఉన్న 8ఏళ్ళ అనేక పదవులు అనుభవించిన నాయకులు పార్టీ అభివృద్ధికి ఏమీ చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. చీపురపల్లి, బొబ్బిలి, సాలూరు, గజపతినగరం నియోజకవర్గాల్లో క్యాడర్ అంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళింది. ఈ జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి పడాల అరుణ పనితీరుపై కూడా కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె అసమర్థత వల్లే గజపతినగరం నియోజకవర్గంలో టిడిపి అడ్రస్ లేకుండా పోతుందని మిగిలిన కొద్దిపాటి కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కీలకమైన ఈ నియోజకవర్గంలోని పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలస పోతున్నప్పటికీ ఆమె పట్టించుకోవడం లదని వారు వాపోతున్నారు. మాజీ మంత్రి అరుణను ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండే దార్తిరాజేలు మండల మాజీ జడ్ పి టి సి సభ్యురాలు నిట్టిరేద్ది లక్ష్మి, ఆ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు గౌరినాయుడు మరికొంతమంది సర్పంచ్ లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ మంత్రి అరుణ కనీసం వారిని వారించలేకపోయారని తెలుస్తోంది. పడాల అరుణ ప్రస్తుతం గజపతినగరం నియోజకవర్గ ఇన్ ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. మాజీ మంత్రి ఇన్ ఛార్జిగా ఉన్న నియోజకవర్గంలోనే పార్టీ పరిస్థితి ఇంత అధ్వాన్నంగా వుంటే మిగిలిన ప్రాంతాల్లో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని కార్యకర్తలు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/vijayanagaram-district-tdp-24-13141.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





