బాబుదే జయం.. ఇది ఖాయం!

Publish Date:Sep 25, 2023

Advertisement

స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసిన క్షణం నుంచీ వైసీపీ శ్రేణులు ఆత్మరక్షణలో పడ్డాయి. అరెస్టు సక్రమమని చెప్పలేక, తమ అధినేతను ధిక్కరించే ధైర్యం చేయలేక గింజుకుంటున్నాయి. అంతే కాకుండా ప్రస్తుతం జగన్ కు పార్టీ నేతలు, కార్యకర్తలూ అవసరం లేదనీ, వారి పని ఘనత వహించిన పోలీసు అధికారులే చేసేస్తున్నారనీ అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తూ, తమ భవిష్యత్ పై బెంగటిల్లుతున్నారు.

ఇప్పటి వరకూ రాజకీయాలలో ఇటువంటి కక్ష సాధింపు తీరును ఎన్నడూ చూడలేదని అంటున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో అవినీతి జరిగిందని  నమ్మించేందుకు సర్కార్ ఎంతగా గొబెల్స్ ప్రచారం చేస్తున్నా సొంత పార్టీ క్యాడరే ఆ విషయాన్ని నమ్మలేకపోతున్నారు. అదే సమయంలో అదే స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పుణ్యమా అని తమ పిల్లలు బాగుపడ్డారనీ, మంచి ఉద్యోగాలలో సెటిలయ్యారనీ వైసీపీ క్యాడరే అంటోంది.  అన్నిటికీ మించి గత పక్షం రోజులుగా కేసు తీరు తెన్నులను,  సీఐడీ చీఫ్ పత్రికా సమావేశాలను గమనిస్తున్న వారంతా రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారనే అంటున్నారు.  

 క్షేత్ర స్థాయిలో ప్రజాభిప్రాయాన్ని, ప్రజాగ్రహాన్ని ప్రత్యక్షంగా చూసిన, చూస్తున్న నేతలైతే.. వచ్చే ఎన్నికలలో ప్రజల ముందుకు వెళ్లడం అసాధ్యమని బాహాటంగానే చెబుతున్నారు.  చంద్రబాబును అరెస్ట్ చేసి ముఖ్యమంత్రి పార్టీ పాలిట, తమ పాలిట భస్మాసురుడుగా మారారనీ, ఆయనతో తమకు కూడా రాజకీయంగా మరణశాసనం రాసేశారనీ చెబుతున్నారు. చంద్రబాబును అరెస్టు చేసి జైలులో పెడితే.. అది ఎంత అక్రమంగానైనా సరే.. తెలుగుదేశం పార్టీ కుదేలౌతుందనీ, ఆ పార్టీ ఎన్నికలకు సమాయత్తం అయ్యేందుకు అవసరమైన దిశ, దశ అందిచే నాయకుడు దూరమై నిస్తేజమైపోతుందనీ జగన్ ఊహించారనీ, అయితే ఆయనే కాదు.. అసలు ఎవరూ ఊహించనంత తీవ్రంగా ఆయన అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఆందోళనలతో జగన్ రెడ్డి, ఆయన పార్టీయే ఏం చేయాలో తెలియని అయోమయస్థితిలో, ఏం చేసినా ఇక లాభం లేదన్న నిస్తేజంలో మునిగిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రోటిలో తలపెట్టేశాం.. ఎన్నికలలో రోకటి పోటు తినాల్సిందే అన్న నిశ్చితాభిప్రాయానికి వైసీపీ నేతలూ, క్యాడర్ వచ్చేశారని అంటున్నారు. 

 ఈ నేపధ్యంలోనే 2019 ఎన్నికల్లో, ఒక్క ఛాన్స్   వ్యూహంతో వైసీపీని గెలిపించిన, ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్’కిశోర్ సైతం  చంద్రబాబు అరెస్ట్ తరువాత జగన్ని తప్పు చేశావ్ అని హెచ్చరించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు అరెస్టుకు ముందే జగన్ కు నో అనదర్ చాన్స్ అన్న నిర్ణయానికి వచ్చేసిన ఏపీ ప్రజలు.. ఇక ఇప్పుడు జగన్ ను ఓడించేందుకు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్న పరిస్థితి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా, చంద్రబాబు అప్పటికీ రిమాండ్ లోనే తెలుగుదేశం పార్టీని గెలిపించుకునేందుకు తెగించి బయటకు వస్తామని జనం స్వచ్చందంగా చెబుతున్నారు.

ఈ విషయం తాజా సీఓటర్ సర్వే పేర్కొంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా విజయం తెలుగుదేశం పార్టీదేనని ఆ సర్వే పేర్కంది.   చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను  స్పందిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఆర్థిక, రాజకీయ, సినీ పరిశ్రమలకు చెందిన వారు స్వచ్ఛందంగా చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ.. జగన్ సర్కార్ తీరును ఖండిస్తున్నారు. ప్రాంతీయ, భాషా బేధాలకు అతీతంగా అన్ని వైపుల నుంచీ, అన్ని వర్గాల నుంచీ చంద్రబాబుకు సంఘీభావం వ్యక్తం అవుతున్నది. 

By
en-us Political News

  
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం.
2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.
ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.