మోడీ, షాలకు ఏపీ గండం?

Publish Date:Sep 26, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఏదో ఒక మేరకు పట్టు సాధించాలంటే.. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీని బలహీన పరచడం ఒక్కటే మార్గం అని కమలం అధినేతలు తలపోశారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్టు వెనకాల ఉన్నది బీజేపీ వ్యూహమేనని విశ్లేషిస్తున్నారు. కేంద్రంలో తమ అధికారం పదిలంగా ఉండాలన్నా.. ఏపీలో తమ పెత్తనం సాగాలన్నా చంద్రబాబును రాజకీయంగా బలహీన పరచడం ఒక్కటే మార్గమని మోడీ భావిస్తున్నారని చెబుతున్నారు. అందుకే ఏపీలో జగన్ సర్కార్ అడ్డగోలు విధానాలకూ, పరిమితులకు మించిన అప్పులకూ, నియమనిబంధనలకు తిలోదకాలిచ్చి సాగిస్తున్న అరెస్టులకు అనుమతులు ఇస్తూ.. ఏపీలో దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థను, పతనమౌతున్న జగన్ ప్రతిష్టను వేడుక చూస్తున్నట్లు కమలనాథులు చూస్తున్నారని అంటున్నారు. 

అయితే బీజేపీ రాష్ట్ర శాఖ రాష్ట్రంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పార్టీ హై కమాండ్ కు నివేదికలు అందిస్తుండటంతో.. ఏమో ఎటువైపు పోయి ఎటువైపు వస్తుందోనన్న జంకుతో ఇప్పటి వరకూ తెలుగుదేశంతో పొత్తు అంశాన్ని సజీవంగా ఉంచుతూ వచ్చింది. అడపాదడపా చంద్రబాబను హస్తినకు పిలిపించుకుని మాట్లాడటం ద్వారా పోత్తు అవకాశాలున్నాయన్న సంకేతాలు ఇవ్వడం, అదే సమయంలో జగన్ సర్కార్ అడ్డగోలు అప్పులకు సై అంటూ.. ఏపీలో బీజేపీ డ్యుయెల్ రోల్ పాటిస్తూ వచ్చింది. 

అయితే ఎప్పుడైతే స్కిల్ స్కామ్ పేరిట చంద్రబాబు అక్రమ అరెస్టును బీజేపీ అధినాయకత్వం ఖండించలేదో.. అప్పుడే సర్వులకూ బీజేపీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి పూర్తిగా బోధపడింది. దీంతో ఏపీలో బీజేపీ స్టేక్ పూర్తిగా జీరో అయ్యింది. నోటీతో పోటీపడి గత ఎన్నికలలో తెచ్చుకున్న ఒక శాతం ఓటు కూడా ఈ సారి అనుమానమే అంటున్నారు. 

వాస్తవానికి ఏపీలో తమకు ఉన్నదీ, పోయేదీ ఏమీ లేదని కమలనాథులకు స్పష్టంగా తెలుసు.. అయినా జనసేనానిని మిత్రుడిగా చెప్పుకుంటూ.. ఆయనను సీఎం అభ్యర్థిగా ముందు పెట్టి వెనకుండి డ్రామా నడిపిద్దామనుకున్న కమలం అధినేతలకు తన పయనం తెలుగుదేశంతోనే.. కలిసి వస్తుందా? రాదా? అన్నది బీజేపీ ఇష్టం అంటూ పవన్ కల్యాణ్ కుండబద్దలు కొటేయడంతో బీజేపీ వ్యూహాలు, ఎత్తుగడలూ పూర్తిగా దెబ్బతిన్నాయి. 

ఇప్పటికే 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి సింగిల్ గా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగిన మెజారిటీ వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ బలంగా పుంజుకుంది. అంతే కాకుండా.. బీజేపీ ఏతర కూటమి ఇండియా.. సమష్టిగా ఉంది. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో సొంతంగా ఓ పుంజీడు స్థానాలు తెచ్చుకోగలిగిన పార్టీలు కాగడా పెట్టి వెతికినా కనిపించని పరిస్థితిది. అందుకే ఏపీలో ఎటు పోయి ఎటు వచ్చినా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మెజారిటీ స్థానాలు తెచ్చుకుని తెలుగుదేశం అధికారంలోకి రావడమే ఖాయంగా అత్యధిక పార్లమెంటు స్థానాలలో కూడా విజయం సాధించి.. కేంద్రంలో కీలక భూమిక పోషించే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయన్న పరిశీలకుల విశ్లేషణలు బీజేపీని గాభరాపెడుతున్నాయి. ఆ కారణంగానే స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్టుకు జగన్ సర్కార్ కు వెనుకనుంచి అవసరమైన అండదండలందించిందనీ, ఎన్నికల సమయంలో చంద్రబాబు జైలులో ఉంటే పార్టీని ముందుండి నడిపించే సారథి అందుబాటులో లేని తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు పకడ్బందీగా సమాయత్తం కాలేదనీ, అలాగే బాబు ప్రెజెన్స్ లేకుండా తెలుగుదేశం, జనసేనల మధ్య సీట్ల సర్దు బాటు, ఓట్ల బదలీ సజావుగా సాగే అవకాశం ఉండదనీ బీజేపీ భావిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 అయితే బీజేపీ ఆశించినదానికి భిన్నంగా చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ.. ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా, ప్రపంచ దేశాలలోనూ కూడా ఆందోళనలు మిన్నంటలం, ఆఖరికి సొంత పార్టీ నేతల నుంచి కూడా చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ప్రకటనలు వెలువడటంతో బీజేపీ కంగుతింది. అన్నిటికీ మించి చంద్రబాబు తప్పు చేసే వ్యక్తి కారు.. ఆయన నిర్దోషిగా, స్వచ్ఛంగా బయటకు వస్తారు అని బీజేపీ సీనియర్ నేత.. మోడీ కేబినెట్ లో స్వతంత్రంగా పని చేసే ఏకైక మంత్రి నితిన్ గడ్కరీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంతో మోడీ, షాల మౌనం వెనుక ఉన్న కుట్ర కోణం బహిర్గతమైందని అంటున్నారు. ఇక ఇప్పుడు  ఏపీలో బీజేపీ ఎదుగుదల సంగతి పక్కన పెడితే ఉనికి కూడా ప్రశ్నార్ధకంగా మారే పరిస్థితి వచ్చిందని అంటున్నారు.  రాజకీయ స్వార్థంతో.. ఒక బలమైన పార్టీని బలహీనం చేయాలన్న దురుద్దేశంతో బీజేపీ ఆడిన కుట్ర క్రీడకు ఆ పార్టీయే బలైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం.
2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.
ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.