చెత్తగా ఆడాం.. ఓటమిపై టీమ్ ఇండియా స్కిప్పర్ శ్రేయస్ అయ్యర్.!

Publish Date:Jul 8, 2026

Advertisement

క్రికెట్ లో గెలుపు, టములు సహజమే అయినా..  కొన్ని ఓటములు మాత్రం అభిమానులను, జట్టును కోలుకోలేని దెబ్బ తీస్తాయి. తాజాగా ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత జట్టుకు అలాంటి   చేదు అనుభవమే ఎదురైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 125 పరుగుల భారీ తేడాతో   ఘోరాతి ఘోరమైన పరాజయాన్ని చవిచూసింది.

భారత టీ20 క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా ఇది  భారీ ఓటమి కావడం గమనార్హం. ఈ దారుణ వైఫల్యంపై టీమిండియా స్కిప్పర్ శ్రేయస్ అయ్యర్ అసహనం వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం  మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. జట్టు   ప్రదర్శన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, మైదానంలో ఆడిన తీరు చెత్తగా ఉందంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.   ఆటగాళ్ల బాధ్యతారాహిత్యాన్నిగట్టిగా విమర్శించారు.   పిచ్   200 పరుగులు సాధించే అంత సులువుగా ఏమీ లేదన్న శ్రేయస్ అయ్యర్.. టీమ్ ఇండియా బౌలర్లు ప్రణాళికలను   సరిగ్గా అమలు చేయలేదన్నాడు.  

ఇక 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాటింగ్ విభాగం పేకమేడలా కూలిపోయింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ముఖ్యంగా పవర్‌ప్లేలోనే 4 కీలక వికెట్లను కోల్పోవడం జట్టును కోలుకోలేని దెబ్బ తీసిందని శ్రేయస్ అయ్యర్ విశ్లేషించాడు. పవర్‌ప్లే ముగిసేసరికే మ్యాచ్ పూర్తిగా ఇంగ్లాండ్ వైపు మలుపు తిరిగిందని, అంతటి ఒత్తిడిలో భారీ లక్ష్యాన్ని ఛేదించడం అసాధ్యంగా మారిందని చెప్పాడు.   

India vs England T20, Team India Loss, Trent Bridge T20, Shreyas Iyer Angry, Teluguone

By
en-us Political News

  
వరద ఉధృతికి స్పిల్‌ చానల్‌ మధ్య 902 హిల్‌ నుంచి మహానందీశ్వరస్వామి టెంపుల్ వరకు ఉన్న మట్టి, రాతి రవాణా కాజ్‌వేకు గండిపడింది. ప్రాజెక్టు పనుల కోసం వాహనాలు తిరిగేలా నిర్మించిన ఈ కాజ్‌వే వరద తాకిడికి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
ఏటా ప్రకృతి సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. అయితే.. ఇటీవలి కాలంలో యాత్ర ప్రారంభమైన కొద్ది రోజులకే మంచు శివలింగం పూర్తిగా కరిగిపోతుండటం భక్తులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
భారతీయ పర్యాటకుల కోసం సౌదీ అరేబియా సరికొత్త ప్యాకేజీ వీసా విధానాన్ని తెచ్చింది. ఫ్లైట్, హోటల్ రూమ్స్ మరియు వీసా ఒకే క్లిక్‌తో బుక్ చేసుకునే పూర్తి ప్రాసెస్, అర్హతల వివరాలు ఇక్కడ చూడండి.
అహ్మదాబాద్‌కు చెందిన ప్యాకేజింగ్ దిగ్గజం న్యాక్ ప్యాకేజింగ్ Knack Packaging 83 రెట్ల సబ్‌స్క్రిప్షన్‌తో స్టాక్ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. పటేల్ ఫ్యామిలీ సక్సెస్ స్టోరీ మరియు ఐపీఓ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి పేరుతో వచ్చిన నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ ప్రకటన నమ్మి రూ.85 లక్షలు పోగొట్టుకున్న ప్రముఖ డాక్టర్. సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తు వివరాలు మీకోసం.
భారత్,ఇంగ్లాండ్ 3వ టీ20 మ్యాచ్‌లో తిలక్ వర్మ స్టంపింగ్ వివాదంపై థర్డ్ అంపైర్ నిర్ణయం వెనుక ఉన్న అసలు ఐసీసీ క్రికెట్ నిబంధనలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఈ దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇప్పటివరకు ఐదుగురు కీలక నిందితులను అరెస్ట్ చేశారు. వారిలో విజయవాడకు చెందిన 23 ఏళ్ల మహ్మద్ రహ్మతుల్లా షరీఫ్, 27 ఏళ్ల ఎండీ డానిష్, 23ఏళ్ల మీర్జా సోహైల్ బేగ్‌లతో పాటు, హైదరాబాద్‌కు చెందిన సయీదా బేగం, కర్ణాటకలోని బళ్లారికి చెందిన అబ్దుల్ సలాం ఉన్నారు.
ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో నరాలు తెగే ఉత్కంఠ కొలంబియాపై పెనాల్టీ షూటౌట్‌లో 4,3 తేడాతో స్విట్జ‌ర్లాండ్ చారిత్రక విజయం సాధించింది. రూబెన్ వ‌ర్గాస్ నిర్ణయాత్మక గోల్‌తో 1954 తర్వాత తొలిసారి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన స్విస్ జట్టు, ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాతో తలపడనుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి
భారీ వర్షాలు మరియు కొండచరియలు విరిగిపడటంతో ముంబై,పుణే రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. హైదరాబాద్, విశాఖ రైళ్లు దారి మళ్లించారు. పూర్తి వివరాలు, టికెట్ రీఫండ్ రూల్స్ మరియు లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చూడండి.
పాత ఇల్లు అమ్మి కొత్త ఇల్లు కట్టేటప్పుడు కోవిడ్ లేదా ఇతర కారణాల వల్ల ఆలస్యమైతే సెక్షన్ 54 కింద లభించే ఆదాయపు పన్ను మినహాయింపు రద్దవుతుందా చెన్నై ఐటీఏటీ పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు మరియు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
మోబిక్విక్ (MobiKwik) యాప్ ద్వారా మీ క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించి 1% నుండి 5% వరకు భారీ క్యాష్‌బ్యాక్ ఎలా పొందాలో తెలుసుకోండి. జీమెయిల్ బిల్ఫెచ్ ఫీచర్, నియమ నిబంధనలు మరియు గరిష్ట పొదుపు చిట్కాలు ఇక్కడ చూడండి.
ప్రజలకు మెరుగైన సేవలను అందించడంతో పాటు సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేర్చేందుకు డిజిటల్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు అందించేందుకు వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని సూచించారు.
అయితే బ్యాటరీ ఛార్జ్ విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందనడానికి ఈ ఘటన నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. ఎలక్ట్రిక్ మెర్సిడెస్-బెంజ్ కారు బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ కావడంతో నడి రోడ్డులో నిలిచిపోయి.. తీవ్రమైన ట్రాఫిక్ సమస్యకు కారణమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.