ప్రొటోకాల్ పాటించని అధికారులు.. సమీక్షా సమావేశం నుంచి వేమిరెడ్డి వాకౌట్

Publish Date:Nov 4, 2024

Advertisement

తెలుగుదేశం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డికి కోపం వచ్చింది.  నెల్లూరు జిల్లా సమీక్షా సమావేశం నుంచి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వాకౌట్ చేశారు. తనకు సముచిత గౌరవం లభించలేదన్న ఆగ్రహంతో ఆయన సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇంతకూ ఏం జరిగిందంటే.. నెల్లూరు జెడ్పీ కార్యాలయంలో ఆదివారం (నవంబర్ 3) జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.  సమావేశం ప్రారంభించిన ఆర్డీవో సమావేశానికి వచ్చిన ప్రజా ప్రతినిథులకు బొకెలు అందజేశారు.

అయితే మంత్రులు, ఎమ్మెల్యేలకు బొకేలు అందించి సభకు పరిచయం చేసిన ఆర్డీవో, ఎంపీ వేమిరెడ్డిని మాత్రం విస్మరించారు. దీంతో వేమిరెడ్డికి ఆగ్రహం వచ్చింది. అంతే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎంత సముదాయించినా.. గౌరవం లేని చోట ఉండలేనంటూ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఆయనతో పాటు ఆయన సతీమణి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కూడా భర్తతో పాటు సమావేశం నుంచి వెళ్లి పోయారు. ఇదేమీ చిన్న విషయం కాదు. వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం గూటికి చేరడానికి కారణమే వైసీపీలో తనకు గౌరవం లభించడం లేదని. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పలు సందర్భాలలో చెప్పారు. 

వేమిరెడ్డి వంటి స్టేచర్ ఉన్న వ్యక్తులు పదవులు, హోదాల కంటే రెస్పెక్ట్ ఉండాలని భావిస్తారు. వైసీపీలో అలా రెస్పెక్ట్ దొరకలేదనే  ఆయన పార్టీ వీడారు.  ఇప్పుడు అదే పరిస్థితి తెలుగుదేశంలో కూడా ఆయనకు ఎదురౌతోందని భావిస్తున్నారు. ఎంపీనైన తనను అధికారులు గుర్తించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఆయనను సముదాయించేందుకు ఆనం ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అధికారులు తనను అవమానించారనీ, ఇంకెప్పుడూ సమీక్షా సమావేశానికి వచ్చేది లేదని వేమిరెడ్డి కుండబద్దలు కొట్టేశారు. అంతా అయిపోయిన తరువాత ఆనం రామనారాయణరెడ్డి అధికారలు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటిది పునరావృతం కాకూడదని ఆదేశించారు.  

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్ర పురోభివృద్ధి విషయంలో వంక పెట్టడానికి వీల్లేకుండా పని చేస్తున్నది. ఈ విషయంలో చంద్రబాబు చాలా స్పష్టంగా ఉన్నారు. ఎక్కడైనా నేతలూ అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తుంటే వెంటనే కరెక్ట్ చేస్తున్నారు. అదే సమయంలో నేతలకు సముచిత గౌరవం దక్కే విషయంపై కూడా దృష్టి పెట్టాలి. నేడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డికి జరిగినట్లు మరో రోజు మరో నేతకు  జరగకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో వేమిరెడ్డి విషయంలో జరిగింది పొరపాటు మాత్రమేననీ, మరోసారి పునరావృతం కాదనీ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఆయనకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. చిన్న విషయమే కదా అని వదిలేస్తే ముందు ముందు ఇదో ఆనవాయితీగా మారిపోయే ప్రమాదం ఉంది. ప్రొటోకాల్ ను ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకుని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. 

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసారి దూరం జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడ‌లు బండ్లు అవుతాయి. బండ్లే ఓడ‌ల‌వుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవ‌స‌రం తీరిపోయిన త‌ర్వాత విసిరేసిన తెడ్డే.. చివ‌రికి ప‌డ‌వ బోల్తా ప‌డ్డ‌ప్పుడు దిక్క‌వుతుంది. అన్న‌దానికి జ‌గ‌న్ అప‌రిప‌క్వంతో కూడుకున్న రాజ‌కీయ విధానాలే ఉదాహ‌ర‌ణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జ‌రుగుతుందో పవన్ కల్యాణ్ విడ‌మ‌ర‌చి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫ‌కేష‌న్ జారీ చేయ‌గానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయ‌కుడు, మాజీ హోం మంత్రి మ‌హ‌మూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.