హే జగన్నాథా.. అవినీతి సొమ్ములోనూ వాటాల గొడవా?

Publish Date:Nov 4, 2024

Advertisement

ముందు తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని, ఆ తరువాత తన అధికార మదంతో కొట్లకు పడగలెత్తిన రాజకీయ నేత ఎవరైనా ఉన్నారంటే ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. అడ్డగోలు అక్రమ సంపాదనంతా తన కష్టార్జితమని నిస్సిగ్గుగా చెప్పుకోగలిగిన ధీశాలి కూడా ఆయనే.  2009 నుంచి 2024 మధ్య కాలంలో ఆయన ఆస్తులు వందల రెట్లు ఎలా పెరిగాయన్నది చిదంబర రహస్యమే. స్వేదం చిందించి, కంపెనీలు పెట్టి ఆస్తులను కూడబెట్టానని చెప్పుకుంటున్న జగన్.. 2009 ఎన్నికలకు ముందు కేవలం పది లక్సల రూపాయలలోపు ఆదాయం మాత్రమే ఉన్న వ్యక్తి 2024 నాటికి వందల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా కూడబెట్టగలిగారన్నది చిదంబర రహస్యమే. 

జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో వివరాల మేరకు ఆయన పేరుమీద సేవింగ్స్ అక్కౌంట్ లో  అప్పట్లో లక్షా 93 వేల 797 రూపాయలు ఉన్నాయి. అలాగే ఆయన భార్య విజయలక్ష్మి సేవింగ్స్ అక్కౌంట్లో నాలుగు లక్షల 54 వేల 663 రూపాయలు ఉన్నాయి. ఇంకా ఆమె పేరుపై  సెవింగ్స్ 40 లక్షల రూపాయల ఫిక్సెడ్ డిపాజిట్ ఉంది.  ఇంకా వైయస్ పేరు మీద షేర్ మార్కెట్ లో 20 లక్షల రూపాయలు,  ఆయన భార్య పేరు మీద 35 లక్షల 25 వేల రూపాయల విలువ చేసే షేర్లు ఉన్నాయి.  అలాగే ఇద్దరి పేరు మీద  చెరొక అరకేజీ  అంటే మొత్తం కేజీ బంగారం ఉంది.  ఇవి కాక  కడప జిల్లా ఇడుపులపాయలో  39.52 సెంట్లు,   అర ఎకరం తక్కువ 40 ఎకరాల భూమి ఉంది. అలాగే పులివెందుల పట్టణం రాజారెడ్డి స్ట్రీట్ లో  83 గజాల స్థలం వుంది.   ఇది వైఎస్ 2009లో కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో ఉన్న ఆస్తులు. వైఎస్ కు అప్పట్లో కనీసం కారు కూడా లేదు.  

సరే 2004లో వైఎస్ సీఎం కా కముందు  ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ఆదాయపన్ను శాఖకు చూపించిన ఆస్తి   కేవలం పది లక్షల రూపాయలు మాత్రమే.  అయితే తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ పగ్గాలు చేపట్టిన తరువాత జగన్ ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. 2011 లో కడప లోక్ సభ స్థానానికి జగన్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ సమయంలో  ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్లో  ఆస్తి విలువ అక్షరాలా  365 కోట్లు. ఇక ఆయన భార్య భారతి పేరు మీద ఉన్న ఆస్తి విలువ 41 కోట్ల రూపాయలు.  తండ్రి అధికారంలోకి  రాక ముందు అంటే 2004 కు ముందు  కేవలం  పది లక్షల లోపు ఆదాయం చూపిన వ్యక్తి  2011 నాటికి వందలకోట్లు  ఎలా కూడబెట్టగలిగారన్నది చిదంబర రహస్యమే కదా? తన వ్యాపార విజయ రహస్యం జగన్ దంపతులే వెల్లడించాలి. లేదా అక్రమాస్తుల కేసుల విచారణలో నిగ్గు తేలాలి. అది పక్కన పెడితే 13 ఏళ్ల కిందటే జగన్   43 వేల కోట్ల  ఆర్థిక నేరాలకు పాల్పడ్డారాని ఈడీ, సీబీఐలు కోర్టుకు తెలిపాయి. ఇప్పుడు అదిలక్ష కోట్లు  దాటేసింది.   ఇక జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఐదేళ్ల విధ్వంస పాలనలో ఒక్క  మద్యం, మట్టి , మైనింగ్ ఇసుక  అక్రమ వసూళ్ళు  ఎంత ఉంటాయన్నది ఎవరి ఊహకు కూడా అందదు. 

అటువంటి జగన్ ఇప్పుడు చెల్లెలు షర్మిలతో ఆస్తుల విషయంలో గొడవ పడుతున్నారు. తనకు రాజకీయంగా నష్టం కలిగించేలా వ్యవహరిస్తోంది కనుక చెల్లెలు షర్మిలకు ఆస్తుల్లో వాటా ఇచ్చేది లేదని ఢంకా బజాయించి చెబుతున్నారు. తండ్రి వైఎస్ బతికి ఉండగానే ఆస్తుల పంపకం జరిగిపోయిందని నమ్మబలుకుతున్న జగన్.. ఇప్పుడు షర్మిల కోరుతున్న ఆస్తులు తన కష్టార్జితం అని చెబుతున్నారు. అయితే తల్లి విజయమ్మ మాత్రం కుమారుడు జగన్ చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలని ఓ బహిరంగ లేఖలో విస్పష్టంగా ప్రకటించారు.  దీంతో  సొంత పత్రికలో తల్లీ చెల్లిపై వారి వ్యక్తత్వ హననానికి పాల్పడేలా కథనాలు. వారిద్దరూ చంద్రబాబు చెప్పినట్లల్లా చేస్తున్నారంటూ అభాండాలు.  

మొత్తంగా షర్మిలతో ఆస్తుల వివాదంలో జగన్ వాదన అబద్ధమన్నది సులువుగా అర్ధమైపోతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చెల్లెలికి ఆస్తుల్లో వాటాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని తల్లి విజయమ్మ కూడా తన బహిరంగ లేఖ ద్వారా జగన్ దుర్మార్గాన్ని బట్టబయలు చేసేశారు. అయినా శత్రువుతో కుమ్మక్కు అంటూ తల్లి, చెల్లెలిపై విమర్శలు గుప్పిస్తూ జగన్ ఎవరిని నమ్మించాలని ప్రయత్నిస్తున్నారో అర్ధం కావడం లేదని అంటున్నారు. సొంత పత్రికలో ఏం రాసినా అడిగేవాళ్లు ఉండరన్నట్లుగా ఆయన మాటలు చేతలు ఉన్నాయని అంటున్నారు. అయినా  ఎనిమిది ఈడీ కేసులు, 11సీబీఐ కేసులు, 13 ఐటీ కేసుల్లో ఏ1 గా ఉన్న జగన్ మోహన్ రెడ్డి వందల కోట్ల ఆస్తులను చెమటోడ్చి సంపాదించానంటే నమ్మెదేలా అని జనం అంటున్నారు. అయినా పిచ్చి  కాకపోతే ఆస్తే అవినీతి అయినప్పుడు నీతిగా పంచమని అడుగుతారేంటి?

By
en-us Political News

  
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణ‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భార‌త్ పర్యటనకు వ‌చ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
ప్ర‌జ‌ల్లో సంతృప్తి పెంచేలా వ్య‌వ‌హ‌రించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు. అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థులు గ్రామస్తులపై వరాల జల్లు కురిపిస్తున్నారు.
తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ పట్లే కక్షగట్టినట్లుగా వ్యవహరించారు. ఇంత కాలం తన వెన్నంటి ఉండి, తన గెలుపులో కీలకంగా వ్యవహరించిన తెలుగుదేశం శ్రేణులు లక్ష్యంగా దౌర్జన్యాలకు దిగారు. పార్టీ అధినేతపైనా, అధినేత కుటుంబంపైనా కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తల్లిలాండి భువనేశ్వరిని సైతం దుర్భాషలాడారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.