Publish Date:Aug 26, 2022
పోటీలు అనగానే క్రీడారంగంలో పోటీలు, రాజకీయరంగంలో పోటీపడటాలు గురించే అందరికీ తెలు స్తుంది. కానీ చిత్రంగా అస్సలు ఎవ్వరూ ఊహంచని సరికొత్త పోటీ ఒకటి ఈమధ్య నిర్వహించారు. అపానవాయు పోటీ! ఆమధ్య ఏదో సినిమాలో ముగ్గురు కమెడియన్లు యూ.ఎస్లో ఒక నగరం వీధిలో నిలబడి అపానవాయు వదలుతారు, దాని ధాటికి చాలామంది పారిపోతారు!
ఇదో సినిమాలో కామెడీ సీన్ ! అది ప్రేక్షకులకు సరదా కోసం సినిమావారు కల్పించిన ఒక సీన్. తలచు కుంటే నవ్వొస్తుంది. కానీ అలా నిజంగానే అవుతుందా అంటే ! ఏమో అనే సందేహాస్పద సమాధానాలూ వినవలసివస్తుంది. మావూళ్లో ఒక పెళ్లి భోజనం చేసిన ఓ పెద్దాయన... అంటూ ఎవరికి తోచిన విధంగా వారు ఏదో ఒక విచిత్ర వివరణలతో ఇలాంటి సంఘటనలు గుర్తుచేసుకున్నా పెద్దగా ఆశ్చర్య పోనక్క ర్లేదు.
ఇలాంటి పోటీ ఏమిటన్నదే ఇపుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నది. ఇది ఎక్కడో విదేశాల్లో కాదు.. చక్కగా మన దేశంలోనే నిర్వహించారు. ఈపోటీలో పాల్గొనడానికి ఏకంగా ముంబై, జైపూర్, దుబాయ్ వంటి నగ రాల నుంచి కూడా పేర్లు నమోదయ్యాయి!
ఒక పెద్ద గది.. ఎంతో చక్కటి సుగంధద్రవ్యాలతో సువాసనలతో ఆకట్టుకుంటుంది. ఎంతో శుభ్రంగా అలంకరించి ఉంటుంది. ఆ గదిలోకి ఒక వ్యక్తిని పంపిస్తారు. అతను అపానవాయు వదులుతాడు.. అది ఎంతగా దారుణంగా వాతావరణాన్ని కంపుమయం చేస్తుందో అంచనా వేస్తారుట! ఎలా చేస్తారన్నది వదిలేద్దాం. అలా చేసిన తర్వాత. మరో వ్యక్తిని మరో గదిలోకి పంపుతారు. ఇలా ఉన్న రెండు గదుల్లోకి లెక్ ప్రకారం, సమయాన్ననుసరించి శుభ్రత జాగ్రత్తలు తీసుకుంటూ మరీ పంపుతారట! ఫైనల్గా ఎవరు ఎంతగా ఇబ్బందిపెడితే వారే విజేత! పరామర్ అనే మహిళ ఈ పోటీలకి జడ్జి. ఊహంచని ఈ పోటీలకు తనను జడ్జిగా నియమించడం గురించి చెబుతూ నవ్వు ఆపుకోలేకపోయిందామె.
ఇదే కాంపిటీషనండీ! అని చిరాకుపడొచ్చు. అనేకానేక వెర్రి ఆటలు, కాంపిటీషన్లలో ఇదోటి! విదేశాల్లో గిన్నిస్బుక్ రికార్డుల కోసం చిన్న చిన్న విషయాల్లోనూ పెద్ద పెద్ధ పోటీలు జరుగుతుంటాయిట. తినడం, రన్నింగ్, బస్కీలు తీయడం.. ఇలాంటివి. మరి మనవాళ్లు కనుగొన్న ఈ పోటీ కూడా ఆ స్థాయికి అను మతి లభిస్తుందేమో చూడాలి! చిత్రంగా ఉంది గదా. ఈమధ్యనే సూరత్లో ఈ పోటీ జరిగితే పెద్ద సంఖ్య లో ఎవ్వరూ పాల్గొనలేదు. కానీ విన్నవారు పడి పడి నవ్వుకుంటూనే ఉన్నారు! ఇలాంటి పోటీలూ ఉంటా యా అని! ఇదే కాదు త్రేణుపుల పోటీ కూడా ఉంటుంది. అయితే దీనికి మాత్రం మరింత కష్టపడాల్సి వస్తుం ది. త్రేణుపులు అంత సులభంగా రావు కదా!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/variety-competition-25-142671.html
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.
భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది.
దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు.