UPI MDR Charges: గూగుల్ పే, ఫోన్ పే వాడేవారికి అలర్ట్.. త్వరలో కొత్త రూల్స్?

Publish Date:Jul 17, 2026

Advertisement

భారతదేశంలో డిజిటల్ విప్లవానికి మారుపేరుగా నిలిచింది యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI). 2016 ఏప్రిల్ 11న నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఈ అద్భుతమైన సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. ప్రారంభంలో దీని వాడకం కొంత నెమ్మదిగా సాగినప్పటికీ, పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో డిజిటల్ చెల్లింపుల ముఖచిత్రమే మారిపోయింది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి మొబైల్ యాప్‌ల రాకతో యూపీఐ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది. నేడు వీధి చివర ఉండే చిన్న కిరాణా కొట్టు నుంచి నగరాల్లోని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు అంతా యూపీఐ మయంగా మారింది. కేవలం ఐదు రూపాయల చాక్లెట్ కొన్నా సరే, జేబులోంచి ఫోన్ తీసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం మనకు అలవాటుగా మారింది. దీనికి ప్రధాన కారణం ఈ సేవలపై ఎలాంటి అదనపు ఛార్జీలు లేకపోవడమే.

అయితే ఇప్పుడు ఈ ఉచిత సేవలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. పెద్ద వ్యాపార సముదాయాల్లో జరిగే యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించే ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక శాఖ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనిపై రాబోయే 15 రోజుల్లోనే ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ కొత్త నిబంధనల వల్ల సాధారణ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని సమాచారం. ఎందుకంటే, తాజా ప్రతిపాదనల ప్రకారం కేవలం రూ.2,000 దాటిన పెద్ద లావాదేవీలపై మాత్రమే ఈ ఎండీఆర్ ఛార్జీలను వర్తింపజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ ఎండీఆర్ ఛార్జీల శాతం కూడా చాలా స్వల్పంగా, అంటే గరిష్టంగా 0.5 శాతం కంటే తక్కువగానే ఉండేలా నిబంధనలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ అదనపు బాదుడు నేరుగా వినియోగదారులపై పడదు. కేవలం పెద్ద వ్యాపార సంస్థలు మరియు మర్చంట్ల నుంచి మాత్రమే ఈ రుసుమును వసూలు చేయాలనేది ప్రభుత్వ ప్రధాన ఆలోచన. అందువల్ల సాధారణ ప్రజలు తమ రోజువారీ చిన్న చిన్న డిజిటల్ చెల్లింపుల కోసం అదనపు డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. ప్రస్తుతం దేశంలో అమలవుతున్న 'జీరో ఎండీఆర్' విధానం వల్ల బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు తీవ్రమైన మౌలిక సదుపాయాల నిర్వహణ ఖర్చులను భరిస్తున్నారు. యూపీఐ వాడకం రోజురోజుకూ రాకెట్ వేగంతో దూసుకుపోతుండటంతో సర్వర్ల నిర్వహణ, సైబర్ భద్రత, సాంకేతిక అభివృద్ధి వ్యయం భారీగా పెరిగిపోతోంది. ఈ వ్యవస్థ సుదీర్ఘ కాలం పాటు స్థిరంగా కొనసాగాలంటే ఆదాయ వనరు తప్పనిసరి అని పార్లమెంట్ స్థాయి ఆర్థిక సంఘం కూడా స్పష్టం చేసింది.

google pay phonepe charges alert,upi payments tax update,central government upi charges.

By
en-us Political News

  
తన భర్త పవన్ కల్యాణ్‌కు ఇటీవల భుజానికి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని, స్వామివారి కృపాకటాక్షాలు ఉండాలని కోరుకుంటూ అన్నా లెజినోవా కాలినడకన తిరుమల చేరుకుని తిరమలేశుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన కుమారుడు మార్క్ శంకర్ పవన్ కల్యాణ్ పేరిట అన్నప్రసాదం ట్రస్టుకు 17 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు.
వైసీపీ హయాంలో ముంబైకి చెందిన నటి కాదంబరి జెత్వానీ, తల్లిదండ్రులపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫోర్జరీ, అక్రమ వసూళ్ల ఆరోపణలతో అక్రమంగా కేసు నమోదు చేశారనేది ప్రధాన ఆరోపణ. వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఆధారంగా.. కేవలం 24 గంటల వ్యవధిలోనే ముంబై వెళ్లిన ఏపీ పోలీసులు ఆమెను, ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేసి విజయవాడకు తరలించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ, వాటిని ఎండగట్టడమే ప్రధాన లక్ష్యంగా ఈ యువ సంగ్రామ సభకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పది వేల మందికి పైగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు పార్టీ కార్యకర్తలు హాజరవుతారని బీఆర్ఎస్ అంచనా వేసింది.
రాజకీయ నాయకులు వస్తారు.. వెళ్తారు. పార్టీలు మారతాయి, జెండాలు మారతాయి, జనం, నేల మాత్రం శాశ్వతం. అందుకే.. అందుకే ఈ రోజు ప్రపంచాన్ని ఒకటే అడుగుతున్నాం. పులివెందులను ఒక వ్యక్తి కళ్లతో చూడకండి. పులివెందులను ఒక కుటుంబం చరిత్రతో కొలవకండి.
ఈ దాడుల్లో ప్రాంగణంలో పెంచుతున్నపాతిక గంజాయి మొక్కలు బయటపడ్డాయి. అంతేకాకుండా, విక్రయానికి సిద్ధంగా ఉంచినట్లు అనుమానిస్తున్న ఎండు గంజాయిని కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు.
1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా పక్కన పెట్టడంతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఆరున్నర దశాబ్దాల క్రితం క్రితం కుదిరిన ఈ ఒప్పందాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చాలని, ఆధునీకరించాలని న్యూఢిల్లీ గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఒప్పందంలో మార్పులు జరిగే వరకు పాకిస్తాన్‌కు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్న ఇండియా.. తన సార్వభౌమత్వ పరిధిలోని పనులను వేగవంతం చేసింది.
ఆదివారం లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో వన్డేయే రోహిత్ శర్మ చివరి మ్యాచ్ అన్న ప్రచారానికి బలం చేకూర్చే విధంగా.. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు రోహిత్ శర్మ కుటుంబ సభ్యులు ఇప్పటికే లండన్ చేరుకున్నారు. దీంతో రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలు అయితే ఇది రోహిత్ శర్మ సొంత నిర్ణయమా? బిసిసిఐ పెద్దలు, చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాత్మకంగా పొమ్మనలేక పెడుతున్న పొగా అన్న అనుమానాలు క్రికెట్ అభిమానుల్లో బలంగా వ్యక్తమౌతున్నాయి.
రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీకి చెందిన ఆదివాసీలు ఈ సభలో పాల్గొన్నారు. ఈ ప్రాంతాల్లోని గిరిజన జిల్లాలను, సరిహద్దు గ్రామాలను అన్నింటినీ ఒకే చోటికి చేర్చి, ఒక సమగ్రమైన గిరిజన రాష్ట్రంగా మార్చాలని సభలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు.
చేనేత రంగానికి ప్రగడ కోటయ్య అందించిన సేవలను, చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఆయన చేసిన పోరాటాలను గుర్తించి.. రాబోయే తరాలకు ఆయన ఆశయాలను అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొంది. ప్రగడ కోటయ్య జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో అధికారికంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై స్పష్టమైన ఆదేశాలు వెలువరించింది.
ఏపీలో తల్లికి వందనం పథకం కింద జూలై 22న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13,000 జమ కానున్నాయి. అంగన్వాడీ, శానిటేషన్ వర్కర్ల పిల్లలకు వర్తించే కొత్త రూల్స్, బడ్జెట్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
దేశంలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయనకు సంఘీభావం తెలపడానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వంటి ప్రముఖులు దీక్షా శిబిరానికి వచ్చి ఆయనను పరామర్శించారు. ఆయన పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూనే, ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యం కాబట్టి దీక్షను విరమించాలని కోరారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లండ్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్ పదవిని తిరస్కరించి, ఆర్‌సీబీతోనే ఉంటానని స్పష్టం చేశారు. ఆ వివరాలు ఇక్కడ చదవండి.
సరైన రహదారి లేక అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లాలన్నా, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్నా బొడ్డుమామిడి గ్రామస్థులు పడుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులను ప్రారంభించింది. దీంతో దశాబ్దాల ల సాకారమవుతుండటంపై గ్రామస్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.