ఉండవల్లి ఘటన..వైసీపీ నేతలపై 3 కేసులు నమోదు!

Publish Date:Jun 28, 2026

Advertisement

 

రాజధాని అమరావతి ప్రాంతంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఉండవల్లి పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ రగడపై సీరియస్‌గా స్పందించిన తాడేపల్లి పోలీసులు వేర్వేరు ఫిర్యాదుల ఆధారంగా మూడు వేర్వేరు క్రిమినల్ కేసులను నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.

ఈ గొడవలకు సంబంధించి పెనుమాక ప్రాంతానికి చెందిన మాణిక్యం అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కీలక చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్సీపీకి చెందిన ముఖ్య నేతలు, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నానితో పాటు పలువురు అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

కేవలం స్థానికుల ఫిర్యాదులే కాకుండా, విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దౌర్జన్యానికి దిగినందుకు కూడా పోలీసులు చట్టపరమైన చర్యలు చేపట్టారు. వైఎస్సార్సీపీ బృందం పర్యటించే సమయంలో భద్రతా విధులను పర్యవేక్షిస్తున్న సీఐ వీరేంద్రబాబును నెట్టివేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సదరు పోలీస్ అధికారి స్వయంగా ఫిర్యాదు చేయడంతో, అంబటి రాంబాబుపై పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం అదనంగా మరో కేసు నమోదైంది.

మరోవైపు వైఎస్సార్సీపీ శ్రేణులపైనే కాకుండా ప్రతిపక్ష నేతలు, రైతులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పర్యటనలో ఉన్న వైసీపీ నాయకుడు నారాయణమూర్తి వాహనంపై కొందరు దుండగులు దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. దీనిపై ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కొందరు అమరావతి రైతులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఘర్షణల వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పర్యటనలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, కానిస్టేబుల్‌పై దాడికి తెగబడిన గుంపుపైనే పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. కొందరు వ్యూహాత్మకంగా రాళ్లదాడికి పాల్పడి, అమరావతి ప్రాంత రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారనే కోణంలో విచారణ సాగుతోంది.

ఈ ఘర్షణల వెనుక ముందస్తు ప్రణాళిక ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. గతంలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో నిందితుడిగా ఉన్న చైతన్య అనే వ్యక్తి, నిన్నటి ఉండవల్లి గొడవల్లో కూడా వైసీపీ నేతల పక్కనే తిరిగినట్లు పోలీసులు సీసీటీవీ దృశ్యాల ద్వారా గుర్తించారు. దీంతో ఈ వివాదానికి పాత కక్షలకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణాన్ని కూడా పరిశీలిస్తున్నారు.

రాజధాని ప్రాంతంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించిన వారెవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. శాస్త్రీయ ఆధారాలు, వీడియో ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నామని, త్వరలోనే అరెస్టులు ఉంటాయని తెలుస్తోంది. ఈ పరిణామాలు ఏపీ రాజకీయాల్లో మరింత రాజేసేలా కనిపిస్తున్నాయి.

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
వేడివేడి బజ్జీల వాసనతో ఆకర్షితులైన స్థానికులు వాటిని ఆస్వాదించేందుకు ఆగిపోయారు.
తెలంగాణ ప్రభుత్వం వీఐపీల భద్రత కుదింపు నిర్ణయాని కారణం, రాష్ట్రంలో పూర్తిగా తొలగిపోయిన నక్సల్స్ సమస్యగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గతంలో తెలంగాణ సరిహద్దుల్లోనూ, కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ తీవ్రంగా ఉన్న మావోయిస్టుల ప్రభావం ఇప్పుడు కలికానిక్కూడా కనిపించనంతా తగ్గిపోయిందని ఆ నివేదిక స్పష్టం చేస్తున్నదని పేర్కొంది.
ఇరాన్‌పై అమెరికా దాడి చేసింది. దీంతో ఇరాన్‌ అమెరికా అనుకూల దేశాలపై ప్రతీకార దాడులు చేపట్టింది. ఈ క్రమంలో పనామా జెండా ఎగురవేస్తున్న కికు అనే చమురు నౌకపై డ్రోన్‌ దాడి జరిగింది. ఆ నౌకలో సుమారు రెండు మిలియన్‌ బ్యారెళ్ల ముడి చమురు ఉండగా, సిబ్బంది ఎవరికీ హాని కలగలేదు. ఈ ఘటన తర్వాత అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ఇరాన్‌లోని పది ముఖ్యమైన సైనిక లక్ష్యాలపై వైమానిక దాడులు చేసింది.
సాంకేతికత ఎంత పెరిగినా వైద్యానికి ప్రత్యామ్నాయం కాలేదనే చేదు నిజాన్ని మరోసారి నిరూపించింది.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా మధిరలో బహిరంగ సభ నిర్వహించడం సాధ్యం కాదని అధికారులు తేల్చేశారు. హెలికాప్టర్ ప్రయాణానికి వాతావరణం ఏమాత్రం అనుకూలించకపోవడం, మైదానాలు వాన నీటితో నిండిపోవడంతో ముఖ్యమంత్రి పర్యటనను రద్దు చేసుకోక తప్పలేదు.
గత కొంతకాలంగా ప్రేమించుకున్న యువతి, యువకుడు పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు
ప్రభుత్వం చేపట్టిన ఎస్‌ఐఆర్ సర్వే, నివేదికల ప్రక్రియ ముజీబుర్ రహ్మాన్ జీవితంలో తీవ్ర ఆందోళనను నింపింది. ఈ ఎస్‌ఐఆర్ జాబితాలో తన పేరు లేదనే విషయం అతనికి తెలిసింది. తన పేరు నమోదు కాకపోవడంతో భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా వచ్చే ఎటువంటి సహాయం లేదా పెన్షన్లు, రేషన్ వంటి ప్రయోజనాలు తన ఇద్దరు దివ్యాంగులైన పిల్లలకు అందవేమోనని అతనుఆందోళనకుగురయ్యాడు.
ఆయన ఐదు రోజుల్లో నాలుగు రోజుల జిల్లాల పర్యటనలో భాగంగా తొలుత నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో పేదల సేవలో కార్యక్రమం ద్వారా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని సీఎం చంద్రబాబు లబ్థిదారులకు అంద జేస్తారు. అదే రోజు తిరుపతి చేరుకుని అక్కడి శ్రీసిటీలో.. హీరో మోటో కార్ప్ సుమా . 750 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న గ్లోబల్ పార్ట్స్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. రాత్రికి శ్రీసిటీలోనే బస చేస్తారు.
పుణేకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ అత్యంత దారుణ హత్యకు గురైన ఉదంతం
ఎల్ నినో కారణంగా తలెత్తే సవాళ్లను రైతులు ధైర్యంగా అధిగమించాలనీ, ప్రకృతి సాగుతో పంటలు పండించి, భూమిని, ఆరోగ్యాన్ని విషతుల్యం కాకుండా కాపాడుకుందామని ఆయన పేర్కొన్నారు.
అత్యవసర విచారణకు నిరాకరిస్తూ సుప్రీం కోర్టు సోమవారం.. వెకేషన్ తరువాత ఈ పిటిషన్ ను లిస్ట్ చేస్తామని స్పష్టం చేసింది. జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ షీల్ నాగులతో కూడిన సుప్రీం వెకేషన్ ధర్మాసనం ఈ పిటిషన్‌ను ప్రస్తుత వేసవి సెలవుల అనంతరం, కోర్టు పునఃప్రారంభమయ్యాక సాధారణ జాబితాలో చేర్చి విచారిస్తామని స్పష్టం చేసింది.
బజాజ్ ఆటో భవిష్యత్తు వృద్ధి కోసం సరికొత్త మల్టీ-ప్లాట్‌ఫామ్ వ్యూహాన్ని ప్రకటించింది. 125cc ప్లస్ మోటార్‌సైకిళ్లు, చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ల విస్తరణ మరియు 63,000 కోట్ల రూపాయల రికార్డు రెవెన్యూతో బజాజ్ ఆటో మార్కెట్లో దూసుకుపోతున్న తీరుపై ప్రత్యేక కథనం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.