రోజుకో మలుపు తిరుగుతున్న వివేకానందరెడ్డి హత్య కేసులో తాజాగా అజ్ణాత సాక్ష్యులు కీలక సమాచారాన్ని అందిస్తున్నారు. అజ్ణాత సాక్షుల సమాచారంతో సీబీఐ ఎప్పటికప్పుడు సరికొత్త సమాచారాన్ని జోడించి నివేదికలు తయారు చేస్తోంది. 2019 మార్చి 15వ తేదీన జరిగిన వివేకా హత్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సీబీఐని తప్పించుకు తిరుగుతున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు నుండి ఉ;శమనం పొందుతున్నారు.
పులివెందులలో పార్టీ కార్యక్రమాలున్నాయంటూ ఒక సారి, తల్లిగారికి ఆరోగ్యం బాలేదంటూ మరోసారి, తన తల్లికి కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నానంటూ ఇంకో సారి, హైదరాబాద్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స జరుగుతోందని మరోసారని సీబీఐకు అవినాష్ ముఖం చాటేస్తూ వస్తున్నారు. అసలు అవినాష్ తల్లిగారి ఆరోగ్యం విషయంలో అవినాష్ వర్గం అసత్యాలు చెబుతోందని కూడా సీబీఐ అభిప్రాయపడిందని వార్తలు వెలువడ్డాయి. వృత్తిరిత్యా వైద్యురాలైన వివేకా కుమార్తె సునీత కూడా అవినాష్ తల్లిగారికి ఆరోగ్య సమస్యలు లేవని చెప్పడం గమనార్హం. ఆ విషయం పక్కన పెడితే అవినాష్ వాయిదాలు వేసిన సమయాన్ని సీబీఐ చక్కగా వినియోగించుకుంది.
కొంత మంది అజ్ణాత వ్యక్తులను, అంటే కేసుతో సంబంధం లేదని అందరూ అనుకుంటున్న వ్యక్తులను సీబీఐ ప్రశ్నించి కీలక వివరాలు సేకరించింది. వీరిలో మొదటి వ్యక్తి ఐఏఎస్ అధికారి కల్లం అజయ్ రెడ్డి. జగన్ కుటుంబానికి దగ్గరగా మసలే అజయ్ కల్లంను సీబీఐ ప్రశ్నించింది. 2019 మార్చి 15ం తేదీ లెల్లవారు జామున సుమారు 4.15 గంటలకు వివేకా చనిపోయారన్న విషయం తనతో జగన్ చెప్పారని అజయ్ కల్లం వెల్లడించారు. 2019 ఎన్నికల మేనిఫెస్టో తయారీ పనుల్లో ఉన్న తనతో జగన్ ఈ విషయాన్ని పంచుకున్నారని, చిన్నాన్న నో మోర్ అనే క్లుప్త సమాచారాన్ని తనకు అందించారని కల్లాం చెప్పుకొచ్చారు. వివేకా హత్య కేసు డైరీలో ఆయన హత్యకు సంబంధించిన మొదటి సమాచారం 6.30గంటలకు పీఏ కృష్ణారెడ్డి ద్వారా సీఐ శంకరయ్యకు తెలిసింది. తరువాతే ప్రపంచానికి తెలుసు అనేది ఎఫ్ఐఆర్ వివరణ. కానీ అంతకు ముందే లోటస్ పాండ్ కు ఎలా సమాచారం అందింది అనేది సీబీఐ ప్రశ్న. దీనికి సంబంధించి లోటస్ పాండ్ లో ఉన్న వారిని విచారించాలన్నది సీబీఐ వాదన.
ఇది మొదటి అజ్ణాత సాక్షి కథ. ఇక తాజా అజ్ణాత సాక్షి వివరణ ఇలా ఉంది. నేను వివేకా ఇంటికి వెళ్లినప్పుడు అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డి అక్కడే ఉన్నారు. వివేకా శవం రక్తపుమడుగులో పడి ఉంది. తండ్రీ కొడుకులు ఇద్దరూ రక్తపు మరకలు శుభ్రం చేస్తున్నారు. తరువాత వివేకా మృతదేహాన్ని శుభ్రం చేసి కుట్లు వేసి, కట్లు కట్టి పడుకోబెట్టారు. ఇది మరో అజ్ణాత సాక్షి వైఎస్ ప్రతాపరెడ్డి సాక్ష్యం. వైఎస్ ప్రతాపరెడ్డి స్వయానా అవినాష్ రెడ్డికి పెదనాన్న, భాస్కరరెడ్డికి సొంత అన్న. ఈ కేసులో ఇంకా ఎంత మంది సాక్షులు బయటకు వస్తారో తెలీదు. కానీ వివేకా కేసు ఒక కేస్ స్టడీ. అతీంద్రియ వ్యక్తులు, అదృశ్య శక్తులు, అజ్ణాత సాక్షులు ఈ కేసును ఇంకా ఎన్నిమలుపులు తిప్పుతారో వేచి చూడాల్సిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/un-known-witness-revealed-avinash-roll-in-viveka-murder-39-156181.html
ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా? ప్రభుత్వాన్ని రద్దు చేసే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్ వున్నారా? అందుకే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ పెట్టుకున్నారా? అయితే ముందస్తుకు ప్రధాని గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? సోషల్ మీడియాలో బాగానే ముందస్తు ఎన్నికలపై చర్చ అయితే జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్రంలోని బీజేపీ పెద్దలతో ఉన్న అనుబంధం ప్రత్యేక మైనది. ఏపీ ముఖ్యమంత్రిగా గత నాలుగేళ్ల పైచిలుకు పాలనలో జగన్ రెడ్డి అరాచకాలకు, అడ్డగోలు అప్పులకు కేంద్రం పెద్దలు వెన్నుదన్నుగా నిలిచారన్న భావన ఏపీలో గట్టిగా వ్యక్తం అవుతోంది.
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో నేడు 20 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది. ఈ జాబితాలో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఉన్నారు. ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. పలు కసరత్తుల అనంతరం మిగతా స్థానాలకు కూడా విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించనున్నారు. తెలంగాణలో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడం తెలిసిందే.
ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎన్డీయే కూటమిలో చేరేందుకు ఆయన తహతహలాడారనీ, తన కుమారుడు కల్వకుంట్ల తారకరామారావును తెలంగాణ ముఖ్యమంత్రిని చేద్దామనుకుంటున్నాననీ ఆశీర్వదించాలనీ తనను కోరారనీ మోడీ బహిరంగ సభలో వెల్లడించారు.
ఖలిస్థాన్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందంటూ బహిరంగ వివాదానికి ఆజ్యం పోసిన కెనడా .. తదనంతర పరిణామాల్లో భారత్ తీసుకుంటున్న చర్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. భారత్ లో పనిచేస్తున్న 41 మంది దౌత్య సిబ్బందిని అక్టోబర్ 10లోపు ఉపసంహరించుకోవాలని కెనడాను భారత్ కోరడం తెలిసిందే. ఈ చర్యలను ఊహించని కెనడా, ఇప్పుడు ప్రైవేటు చర్చలను కోరుకుంటున్నట్టు ప్రకటించింది. నిజానికి హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు విషయంలో భారత్ తో ప్రైవేటుగానే చర్చించాల్సిన కెనడా, దీన్ని బహిర్గతం చేసి వివాదానికి కారణమైనట్టు నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.
మహిళా బిల్లుకు లోకసభలో మద్దత్తు ఇవ్వని మజ్లిస్ పార్టీ పట్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లకుండా పార్టీ నష్ట నివారణ చర్యలు తీసుకుంటుందా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే మజ్లిస్ పార్టీ మహిళలకు రిజర్వేషన్ అమలు చేయాలని ప్రయత్నాలు చేస్తుందని పరిశీలకులు అంటున్నారు.
పెరిగిన యూకే స్టూడెంట్, విజిటింగ్ వీసాల రుసుము నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఆరు నెలలలోపు విజిటింగ్ వీసా రుసుము గతంలో 100 పౌండ్లు ఉంటే ఇప్పుడు అది 115 పౌండ్లకు పెరిగింది. విద్యార్థి వీసా రుసుము గతంలో 363 పౌండ్లు ఉండగా దానిని 490 పౌండ్లకు పెంచుతూ బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. బుధవారం (అక్టోబర్ 4) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 18 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
వారం రోజులలోగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తం ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం వారం రోజులలోగా షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది.
కుమారుడి రాజకీయ భవిష్యత్తే ముఖ్యమనుకున్న మైనంపల్లి హన్మంతరావు, రోహిత్ను మెదక్ నుంచి పోటీ చేసేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సేవా కార్యక్రమాలు, ఇతర పనులతో మెదక్ లో రోహిత్ ప్రజల్లో ఉంటున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో రాజకీయాలు రంగులు మారుతున్నాయి. అలాంటి వేళ.. రాజకీయ సమీకరణాలు వాయువేగంతో మారిపోతున్నాయి. ఇప్పటి వరకు ముచ్చటగా మూడోసారి అధికార పీఠాన్ని అందుకొంటామంటూ వస్తున్న కేసీఆర్ అండ్ కో ధీమా సన్నగిల్లిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రిమోట్ కంట్రోల్ హస్తినలో ఉంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రధాని, కేంద్ర హోంమంత్రి ఆయనకు అధిష్ఠానం. నీట ముంచినా, పాల ముంచినా భారం మొత్తం వారి మీద వేసి వారి అండదండలతోనే జగన్ రాష్ట్రంలో తన అరాచక పాలన సాగిస్తున్నారు. ఇదీ జగన్ గత నాలుగేళ్ల పై చిలుకు పాలనపై పరిశీలకుల విశ్లేషణ. ఇప్పుడు చంద్రబాబు అరెస్టుతో జగన్ పాపాలలో బీజేపీకి భాగం ఉందన్న విషయం సర్వులకూ తెలిసిపోయింది.
బీజేపీకి జనసేనానిని కటీఫ్ చెప్పేశారా? ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న తనకు బీజేపీతో మైత్రి పెద్ద ప్రతిబంధకంగా మారుతోందని భావిస్తున్నారా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.