జై జై గణేషా..అంటూ గణేష మండపాలు మార్మోగుతున్నాయి. గణేష నిమజ్జన చాలా ప్రాంతాల్లో ఆరంభ మయింది. గ్రామాల్లో, పట్టణాల్లో చాలా ప్రాంతాల్లో ఇప్పటికే చాలా గణేష విగ్రహాలు నిమజ్జన మయ్యాయి. గణేషుని ఊరేగిస్తూ భక్తి పారవశ్యంతో పాటు సరదా కూడా జోడించి భక్తిపాటలతో పిల్లలు, పెద్దవాళ్లు బళ్లమీద ఊరేగిస్తూ తీసికెళ్లడం మామూలు. ఇది అన్ని ప్రాంతాల్లో జరిగేదే. చాలామటుకు నిజంగా సంగీతపర సాంప్రదాయ రీతి పాటలు, లేకపోతే సినిమా భక్తిపాటలతో ఊరేగిస్తూంటారు. మధ్యలో జై బోలో గణేష్ మహారాజ్కీ జై అంటూ అరుస్తూ నానా సందడిగా వాహనాలు కదిలిపోతూంటాయి.
సంప్రదాయపద్ధతికి కాస్తంత రాజకీయరంగూ జోడిస్తున్నారు ఇటీవల. అన్ని ప్రాంతాల్లోని రాజకీయ నాయ కులు కూడా గణేషుని ఊరేగింపులో పాల్గొని తమ ప్రాంతీయులను ఆకట్టుకోవడానికి, పార్టీ పరంగా వారిని దగ్గర చేసుకోను వీలయినంతగా శ్రమిస్తున్నారు. గణేష మండపాల ఏర్పాటు, పూజలు, ఇపుడు ఊరేగింపు అన్నింటా ఆయాప్రాంత రాజకీయనాయకులు వారి వారి పార్టీలను బాగానే ప్రచారం చేసు కుంటున్నారు. అందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన ఒక గణేష ఊరేగింపులో భక్తి పాట మార్చేసి మరీ రాజకీయ రంగు పులిమి ఆనందించారు.
గణేషుని ఊరేగింపులో భాగంగా పలాస భక్తగణంతో పాటు చిందులు వేశారు మంత్రి అప్పలరాజు. అంతే కాదు ఆ ఉత్సవంలో జగనన్నా.. జగనన్నా.. జనమంతా నీ వెంటే! అంటూ పాట వినిపించగానే రెండు స్టెప్పులు కూడా వేశారు. గణేష ఉత్సావాల్లో జగనన్నా.. అంటూ పాట ఏమిటో అటుగా పోతున్నవారికి అర్ధం కాలేదు. కాదేదీ కవితకు అనర్హం అన్నారు పెద్దలు.
జగనన్నను కీర్తించడానికి, స్వామిభక్తి ప్రదర్శించడానికి వైసీపీ వారికి సమయం, సందర్భంతో సం బంధం లేదు. గణేషునికంటే జగనన్నే ఈ లోకాన్ని కాపాడతా డన్న వీరాభిమానాన్ని ప్రదర్శించారు. ఇది కదా స్వామి భక్తంటే!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ultimate-in-party-favouritism-25-143260.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.