భారతదేశంలో కోవిడ్ విజృంభించిన సమయంలో వైద్యరంగం అందించిన సేవలు అనన్య సామాన్య మని అందరూ అంగీకరిస్తారు. అన్నిప్రాంతాల్లోనూ డాక్టర్లు, నర్సులు ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేటు ఆస్పత్రులు ఎంతో అద్బుతంగా పనిచేసి ప్రజలను కాపాడడంలో ఎన్నో త్యాగాలు చేసి ప్రజల మన్ననలు అందుకున్నారు. నిఫా వైరస్, కొవిడ్తో కేరళ ప్రభుత్వం చేసిన యుద్ధంలో మంత్రిగా శైలజ అద్భుతంగా పని చేశారు. ఆమె సేవలను రామన్ మెగసెసె అవార్డు కమిటీ గుర్తించింది. కానీ కేరళ ఆరోగ్యశాఖ మాజీ మంత్రి శైలజ ఆ అవార్డును స్వీకరించకూడదని నిర్ణయిం చారు.
ప్రజాసేవకు తన జీవితాన్ని అంకితంచేసిన మహోన్నత వ్యిక్తి రామన్ మెగసెసె సేవకు గుర్తింపుగా ఆయన పేరుతో ఒక అవార్డును ప్రవేశపెట్టారు. 1957 ఏప్రిల్ మాసంలో న్యూయార్క్లోని రాక్వెల్ బ్రదర్స్ ఫౌండేషన్ వారు ఈ అవార్డును నెలకొల్పారు. ప్రతి సంవత్సరం, వివిధ రంగాల్లో కృషి చేసిన ఆసియాకు చెందిన ప్రముఖులకు ఈ అవార్డును బహుకరిస్తారు. ఆసియా నోబెల్గా పేరొందిన ఈ అవా ర్డును ప్రభుత్వ సర్వీసులు, కమ్యూనిటీ లీడర్షిప్, జర్నలిజం, లిటరేచర్, శాంతి తదితర రంగా లలో సేవచేసినవారికి ఇస్తారు. తన జీవితకాలం మొత్తం శాంతికోసం పోరాటం చేసిన రామన్ మెగసెసె యువ రాజకీయ నాయ కులకు ఆదర్శవాదిగా పేరు గాంచాడు
రామన్ మెగసెసె అవార్డును స్వీకరించకూడదని కేరళ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి కేకే శైలజ నిర్ణయించు కు న్నారు. దీనిపై శైలజ మాట్లాడుతూ, రామన్ మెగసెసె 64వ అవార్డును తనకు ఇవ్వాలని నిర్ణయించి నట్లు కమిటీ తెలిపింది. తాను రాజకీయ నాయకురాలినని, ఈ అవార్డును రాజకీయ నేతలకు ఎన్నడూ ఇవ్వలేదనీ అన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలిగా ఉన్న తాను ఈ అవార్డు స్వీకరణ అంశాన్ని పార్టీ నేతలతో చర్చించామన్నారు. దానిని తీసుకోకూడదని సమిష్ఠిగా నిర్ణయం తీసుకున్నామని శైలజ తెలిపారు. రామన్ మెగసెసె అవార్డును ఎన్జీవో అందిస్తోంది. ఆ సంస్థ కమ్యునిస్టు పార్టీ సిద్ధాంతాలను బలపరచదని కేరళ మాజీ మంత్రి శైలజ పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cant-take-megasese-award-says-sailaja-25-143263.html
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.