కుర్రకారుకి బైక్ ల పిచ్చి పెరిగిపోతోంది. బైక్ రైడ్ అంటేనే అదో అద్భుతం! ఈ తరం యువత పల్స్ బాగా తెలిసిన బిఎండబ్ల్యూ కేవలం యువత కోసమే సరికొత్త హంగులతో తెస్తోంది 310 ఆర్ ఆర్ బైక్. జూన్ 15న మార్కెట్ లోకి రానున్న ఈ బైక్ ఖరీదు రూ.3 లక్షలు. దీని ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ బైక్ టివిఎస్ అపాచీ 310తో ప్లాట్ఫామ్ షేర్ చేసుకుంటుంది. బిఎం డబ్ల్యూ మోటరాడ్, టివిఎస్ మోటార్ ఇటీవలే భాగస్వాములయ్యాయి. ఈ భాగస్వామ్యం ఆధ్వర్యం లోనే టివిఎస్ భారతదేశంలో బిఎండబ్ల్యూ వాహనాల ఉత్పత్తికి సహకరిస్తుంది.
ఇక డిజైన్ విషయానికి వస్తే, బిఎండబ్ల్యూ 310 బైక్ అపాచీ 310 డిజైన్లా కనిపించవచ్చు. బ్లూటూత్ అను సంధానమయి వుండడం మరో ప్రత్యేక ఆకర్షణ. అలాగే డ్యూయల్ ఛానల్ ఏ బిఎస్ తో ఆకట్టుకుంటుంది. అన్నింటికీ మించి ఆర్ ఆర్ 310 బైక్లు తెలుపు, నీలం రంగుల్లో వుంటుంది. నీలం రంగు బిఎండబ్ల్యూ సంప్రదాయంగా వున్నదన్నది అందరికీ తెలిసినదే.
ఇంజన్ సంగతి చెప్పాలంటే, ప్రస్తుత బిఎండబ్ల్యూ 310 ఇంజన్ మోడల్ లానే ఈ కొత్త బైక్ ఇంజన్ వుంటుంది.
అలాగే 312.2 సిసి సింగిల్ సిలిండర్తో, లిక్విడ్కూల్ ఇంజన్ కలిగి వుంటుంది. ఈ బైక్కి 9700 ఆర్పియం వద్ద 34 పిఎస్, అత్యధికంగా 7700 పిఎం వద్ద 27.3 ఎన్ఎం శక్తి కలిగి వుంటుంది. అలాగే 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ యూనిట్ కూడా కలిగి వుంటుంది. ఇక వేగంలో చెప్పక్కర్లేదు..గంటకు 160 కి.మీ వేగంలో వెళుతుంది. 0 నుంచి 1000 కి.మీ కేవలం 7.17 సెకండ్లలో దూసుకెళ్లగలదు. ఈ సరికొత్త హంగుల బైక్ ఖరీదు అపాచి 310 కిమించే వుంటుంది.
అపాచీ 310 ప్రస్తుతం రూ.2.65 లక్షలకు దొరుకుతోంది. ఇటీవల బిఎండబ్ల్యూ ఫోర్ వీలర్లు ఊహించని ప్రమాదాలకు గురి అవుతుండడంతో వాటిని వెనక్కి తీసు కుని, ఉత్పత్తి ఆపేసి ఎంతో అత్యాధునిక హంగులతో ఈ బిఎండబ్ల్యూ బైక్ను ఉత్పత్తి సంస్థ అందిస్తు న్నది. ఈ బైక్ తప్పకుండా దేశంలో యువతను ఆకట్టుకోగలదని అధికారులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/two-wheelers-from-bmw-25-137200.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.